‘జిగ్రీస్’ పిచ్చి పాషన్ తో చేసిన సినిమా. మ్యూజిక్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను: ప్రీరిలీజ్ ఈవెంట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్ఫుల్ క్రేజీ ఎంటర్టైనర్ “జిగ్రీస్”. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జిగ్రీస్ నవంబర్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్యఅతిథిగా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఇలాంటి సినిమా చేయడానికి యూనిట్ అందరికీ ఒక పిచ్చి కావాలి. సినిమా మ్యూజిక్ చార్ట్ బస్టర్ అయ్యింది. సినిమా కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సెన్సార్, ప్రివ్యూ రిపోర్ట్స్ జనరల్ చాలా జెన్యూన్ గా అనిపించింది. అది థియేటర్స్ లో కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా పిచ్చితో కష్టపడి తీశారు. అర్జున్ రెడ్డి నేను ఎలా తీశాను అంతకంటే ఎక్స్ట్రీమ్ గా తీశారు. దానికోసం అయినా సినిమా బాగా ఆడాలి. హీరో డైరెక్టర్ తో సంబంధం లేకపోయినా ఏదో ఒక ఎలిమెంట్ నచ్చితే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి చూస్తారు. అది మన తెలుగు ఆడియన్స్ స్పెషాలిటీ. ఈ సినిమా కూడా థియేటర్స్లోకి వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమాకి సక్సెస్ మీట్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. థియేటర్స్ ఫిల్ అవుతున్నాయి. అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అందరికి గుడ్ లక్.
కృష్ణ బురుగుల మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మీడియా ఇచ్చిన సపోర్ట్ కి స్పెషల్ థాంక్స్. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నిన్న ప్రీమియర్ వేసాం. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో మాకు మరింత నమ్మకం వచ్చింది. ఒక నటుడిగా నాకు చాలా అవకాశాలు వచ్చాయి. అయితే జనాలకి నచ్చే సినిమా చేసినప్పుడే గుర్తింపు వస్తుందని తెలుసుకున్నాను. గత మూడేళ్లుగా ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నాను. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. ఈ సినిమా నాకు ఒక డీజే టిల్లు, జాతి రత్నాలు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెబుతుంది కాదు నమ్మకంతో చెబుతున్నాను. 100% మిమ్మల్ని నవ్విస్తాను. నవ్వించకపోతే ఇంకెప్పుడు యాక్టింగ్ చేయను. ప్రొడ్యూసర్ కృష్ణ అన్న ఎంతో సపోర్ట్ చేశారు చాలా డౌటు ఎర్త్ పర్శన్. నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్. అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. డైరెక్టర్ గారి వర్క్ సినిమాలో చూస్తారు. మూడేళ్లుగా ఈ సినిమా పైనే ఉన్నారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సందీప్ అన్న సపోర్ట్ ని మర్చిపోలేను. ఆయన గర్వపడే సినిమాలు చేస్తాను. అందరం థియేటర్స్ లో కలుద్దాం.
యాక్టర్ ధీరజ్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. సందీప్ అన్నకి థాంక్యూ. జిగ్రీస్ నాకు చాలా స్పెషల్ ఫిలిం ఇది రిపీట్ వాల్యూ ఉండే సినిమా. నవంబర్ 14న అందరూ థియేటర్స్ లో చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
యాక్టర్ మణి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా సినిమాకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న సందీప్ అన్నకి థాంక్యూ. మా డైరెక్టర్ చాలా ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. మా నిర్మాత ఎక్కడ రాజీ పడకుండా సపోర్ట్ చేశారు. కృష్ణ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ధీరజ్ చాలా టాలెంటెడ్ .తను డైరెక్టర్ కూడా అవుతాడు. మా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యు. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు
డైరెక్టర్ హరీష్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. జిగ్రీస్ రేపు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత కృష్ణకి మీరందరూ ఫ్యాన్ అయిపోతారు. ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ మీరు చూస్తారు. నిన్న ప్రీమియర్స్ వేసాం థియేటర్స్ ఊగిపోతున్నాయి. ధీరజ్ ఆత్రేయ డైలాగులు లేకుండానే అదరగొట్టాడు. మణి సింగిల్ టేక్ పెర్ఫార్మర్ తను కూడా చాలా పెద్ద స్టార్ అవుతాడు. నిర్మాత కృష్ణ గారు చాలా ప్యాషన్ తో సినిమా చేశారు. ఈశ్వర్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. మా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉండాలని తీసాము. థియేటర్స్ లో మీరు చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుగా ఉంటుంది. సందీప్ అన్న లేకపోతే మా సినిమాకి ఇంత ఎక్స్పోజర్ ఉండేది కాదు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ ఆయనే. ఇంత బిజీలో కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అందరం నవంబర్ 14న థియేటర్స్ లో కలుద్దాం
ప్రొడ్యూసర్ కృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా సినిమాకి ఎంతో సపోర్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాని మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. కర్ణాటక మహారాష్ట్ర గోవా బెంగళూరు కేరళ ఇలా అద్భుతమైన లొకేషన్స్ లో తీసిన సినిమా ఇది. తప్పకుండా థియేటర్స్ లో మిస్ అవ్వకుండా చూడండి.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…