గ్లోబ‌ల్ రేంజ్‌లో పుష్ప చిత్రంతో ఇంపాక్ట్ చూపించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన అద్భుతమైన నటన, డిఫరెంట్ స్టైల్, పవర్‌ఫుల్ ఎనర్జీ ఈ చిత్రాన్ని భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఐకానిక్ మూవీగా నిలిపింది. ఈ సినిమా కోసం రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రాచుర్యం పొందింది. ఐకాన్ స్టార్ తనదైన స్టైల్, డాన్స్, ఛ‌ర్మిష్మాతో ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించి అభిమానుల గుండెల్లో ఆరాధ్య హీరో అయ్యారు.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’, మూవీలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ట్రెండ్ అవుతున్నాయి. ప్రేక్షకాదరణను పొందుతున్నాయి. ‘ఊ అంటావా..’ అనే పాట సెన్సేషన్ తర్వాత, సినిమాలోని ఇంట్రో సాంగ్ ‘దాక్కో దాక్కో మేక’కూడా అంతర్జాతీయ ప్రేక్షకులను అబ్బురపరిచింది. పాపులర్ అమెరికన్ టీవీ షో ‘అమెరికాస్ గాట్ టాలెంట్‌’లో బీ యూనిక్ క్రూ టీమ్ చేసిన అసాధారణ ప్రదర్శనతో పుష్ప చిత్రానికి విదేశాల్లోనూ సరికొత్తగా ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ పాపులర్ డాన్స్ షోలో భారతీయ సంగీతంలోని శక్తిని, ఉత్సాహాన్ని ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా ప్రపంచం చూసింది.

పాపులర్ డాన్స్ షో అమెరికా గాట్ టాలెంట్ లో భారతదేశానికి చెందిన డాన్స్ గ్రూప్ బీ యూనిక్ క్రూ.. పుష్ప చిత్రంలోని హిట్ సాంగ్ ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్‌కు స్టేజ్‌పై అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఈ పాట ఒక సెన్సేషనల్ చార్ట్‌బస్టర్‌గా నిలవటమే కాదు..అల్లు అర్జున్ తన ఎనర్జీ, సిగ్నేచర్ స్వాగ్‌తో దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. అదే ఎనర్జీ, స్టైల్‌తో స్ఫూర్తి పొందిన యువ డాన్సర్ల బృందం అతిథులను, ప్రేక్షకులను అబ్బురపరిచే ప్రదర్శనతో మెప్పించింది. పాటలోని అద్భుతమైన డాన్స్ మూమెంట్స్ ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచి మంత్రముగ్ధుల్ని చేశాయి.

ఈ అద్భుతమైన ప్రదర్శన, పుష్ప సినిమాలోని ఐకానిక్ స్టైల్‌కు.. అల్లు అర్జున్ అందించిన డైనమిక్ ప్రెజెన్స్‌కు ఘనమైన ట్రిబ్యూట్‌గా నిలిచింది. ఈ డాన్స్ పెర్ఫామెన్స్ చూసిన ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో డాన్సర్స్‌ను అభినందించారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా సంగీతం ఎంత ఆకట్టుకుందో, ఎంత ప్రభావాన్ని చూపించిందనే విషయాన్ని ఈ పాట మరోసారి రుజువు చేసింది. ఇప్పటికీ ఈ పాట గ్లోబల్ ప్లేలిస్టుల్లో దూసుకెళ్తోంది. తెలుగు ప్రేక్షకులు, అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రేక్షకులూ ఈ అద్భుతమైన వీడియో క్లిప్‌ను ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. బీ యూనిక్ క్రూ సభ్యుల ప్రతిభను ప్రశంసిస్తూ.. గ్లోబల్ స్టేజ్‌పై అల్లు అర్జున్ చూపించిన ఇంపాక్ట్‌ను ఘనంగా ఆహ్వానిస్తున్నారు.

అల్లు అర్జున్ అభిమానులు తమ అభిమాన ఐకానిక్ స్టార్ హీరో పాట గ్లోబల్ స్థాయిలో ప్రాచుర్యం పొందినందుకు గర్వంతో, ఉత్సాహంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్, సినిమా టీమ్ ఈ ప్రదర్శనను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఒక గ్లోబల్ ఫినామెనాన్. ఏజీటీ సీజన్ 20 స్టేజ్‌పై బీ యూనిక్ క్రూ పుష్ప పాటకు ప్రదర్శన ఇచ్చారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. జడ్జిలు సైతం దీన్ని ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఆఫ్ ది సీజన్‌గా ప్రశంసించారు’. అంటూ పోస్ట్ చేయటంతో ద్వారా అభిమానుల ఆనందం రెట్టింపయ్యింది. పుష్ప సినిమా, అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయిలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయంలో దీంతో మరోసారి నిరూపితమైంది.

‘వావ్ మైండ్ బ్లోయింగ్’ అని అల్లు అర్జున్ ఈ ట్వీట్‌ని కోట్ చేస్తూ స్పందించారు. భారతీయ సినిమా, సంగీతం ఎంత దూరం ప్రయాణించగలవో దీంతో తెలిసింది. ఒక ప్రాంతీయ హిట్‌గా మొదలైన పాట ఇప్పుడు గ్లోబల్ పాప్ కల్చర్‌లో భాగంగా మారింది. గొప్ప కథలు, ప్రదర్శనలు, పాటలు ఏ దేశంలో అయినా ప్రతీ ఒక్కరినీ అలరించగలవని మరోసారి దీంతో రుజువైంది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

7 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago