‘అర్జున్ చక్రవర్తి’కి గానూ అంతర్జాతీయ స్థాయిలో నాకు నాలుగు అవార్డులు వచ్చాయి – కెమెరామెన్ జగదీష్ చీకటి

‘అర్జున్ చక్రవర్తి’ చిత్రంతో కెమెరామెన్‌గా జగదీష్ చీకటి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజువల్ ట్రీట్‌గా మూవీని తెరకెక్కించిన జగదీష్ చీకటి పనితనం గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘అర్జున్ చక్రవర్తి’ చిత్రానికి గానూ ఎన్నో అంతర్జాతీయ వేడుకల్లో బెస్ట్ సినిమాటోగ్రఫర్‌గా జగదీష్ చీకటి అవార్డుల్ని అందుకున్నారు. ‘అర్జున్ చక్రవర్తి’ ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోండటంతో కెమెరామెన్ జగదీష్ చీకటి చెప్పిన సంగతులివే..

మీ నేపథ్యం ఏంటి? మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది?
జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే ఫోటోగ్రఫీలో ఎన్నో అవార్డులు సాధించాను. నాకు డ్రాయింగ్, ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఫోటోగ్రఫీలోనూ మాస్టర్స్ చేశాను. దూరదర్శన్‌లోనూ పని చేశాను. స్టిల్ ఫోటోగ్రఫీలోనూ అవార్డులు వచ్చాయి. వందకు పైగా షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, ఎన్నో కమర్షియల్ యాడ్స్, ఎన్నో ప్రాజెక్టులను చేశాను. అలా చేస్తున్న సమయంలోనే ‘జత కలిసే’ మూవీకి అవకాశం వచ్చింది. అక్కడ కొత్త వాళ్లందరం కలిసి ఆ మూవీని చేశాం. ఆ సమయంలోనే ‘నాయకి’, ఆర్జీవీ ప్రొడక్షన్స్ నుంచి ‘భైరవ గీత’ ఇలా చాలా ప్రాజెక్ట్‌లు వచ్చాయి.

సినిమాల్లోకి వస్తానంటే మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది?
మా నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం చేస్తారు. నాకు ఎప్పుడూ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుండేవారు. నచ్చిన పని ఏదైనా సరే చేయమని, వంద శాతం ఎఫర్ట్ పెట్టమని అనేవారు. అందుకే నేను దూరదర్శన్‌లో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేశాను. అప్పుడు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.

‘అర్జున్ చక్రవర్తి’ విషయంలో మీ వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?
మన ఇండియాలో గొప్ప టెక్నీషియన్లు ఉన్నారు. హాలీవుడ్ స్థాయికి ధీటుగా మనం తీస్తున్నాం. మా ‘అర్జున్ చక్రవర్తి’ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆ స్థాయి లుక్ వచ్చేందుకు నేచురల్ లైటింగ్‌లోనే షూటింగ్ చేశాం. సౌండ్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా కూడా దర్శకుడి విజన్‌కు తగ్గట్టుగా ఉంటుంది. సినిమా సక్సెస్‌లో ఈ డిపార్ట్మెంట్‌ల ప్రాధాన్యత చాలా ఉంటుంది. దర్శకుడితో సింక్ అవ్వాలి, ప్రొడక్షన్ సపోర్ట్ ఉండాలి. అప్పుడే రిజల్ట్ బాగా వస్తుంది.

దర్శకులతో ఎప్పుడైనా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా?
డీఓపీ అంటే.. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ.. అంటే అతను కూడా ఓ డైరెక్టర్ అన్న మాట. అందుకే దర్శకుడితో బాగా సింక్ అవ్వాలి. దర్శకుడి విజన్‌ను అర్థం చేసుకోవాలి.. క్రియేటివ్ ఆఫ్ డిఫరెన్సెస్ రాకుండా చూసుకోవాలి. అలా నాకు దర్శకుడితో సింక్ కానప్పుడు ఓ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాను.

‘అర్జున్ చక్రవర్తి’ షూటింగ్ టైంలో ఎదురైన సవాళ్లు?
మంచు కురిసే ప్రాంతం కదా అని కాశ్మీర్‌కు వెళ్లాం. కానీ మేం వెళ్లినప్పుడు అక్కడ మంచు పడటం లేదు. దీంతో అక్కడే మంచు కురిసే వరకు ఎదురుచూశాం. అలా చివరకు మైనస్ 8 డిగ్రీల వరకు వెళ్లింది. అలా మంచు కురుస్తుంటే స్వర్గమంటే ఇదేనేమో అన్నట్టుగా కనిపించింది. దీంతో మేం అనుకున్న దానికింటే బాగా షూట్ చేశాం.. విజువల్స్ అద్భుతంగా వచ్చింది. ఆ మంచు ప్రాంతంలో షూటింగ్ చేయడం ఎంతో కష్టంగా అనిపించింది. క్లైమాక్స్ ఎపిసోడ్‌కి చాలా కష్టపడాల్సి వచ్చింది. టెక్నికల్‌గా చాలా ఇబ్బంది ఏర్పడింది. 800 మందిని, ప్లేయర్స్‌ని టైమ్ స్లైస్ అనే ఓ పరికరంతో షూట్ చేయాలని అనుకున్నాం. కానీ అది అందుబాటులో లేకపోయే సరికి అందరినీ ఫ్రీజ్‌లో పెట్టి షూట్ చేశాం. అది చాలా ఎఫెక్ట్‌ను, ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది.

విక్రాంత్ రుద్ర మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? ఆయనతో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?
‘భైరవ గీత’ మూవీని చూసిన దర్శకుడు విక్రాంత్ రుద్ర ఈ మూవీకి నన్ను సంప్రదించారు. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నాం. అందులో భాగంగానే రకరకాల వేరియేషన్స్‌‌తో మూవీని తీశాం. పాత్ర తీరు, ప్రయాణానికి తగ్గట్టుగా కలర్ వేరియేషన్స్ చూపించాను. మూడు రకాల కెమెరాలతో షూట్ చేశాం. విజన్ డిఫరెన్స్ ఉండాలని ఎన్ మోర్ఫిక్, స్పెరికల్ లెన్స్‌లను వాడాం. క్యాస్టూమ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా ప్రతీ విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నాం. డైరెక్టర్ విక్రాంత్ రుద్రకి మంచి టాలెంట్ ఉంది. స్టోరీని బాగా నెరేట్ చేస్తాడు. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఏదైనా సరే ముక్కుసూటిగా చెప్పేస్తాడు.

‘అర్జున్ చక్రవర్తి’కి అంతర్జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు వచ్చింది కదా?
‘అర్జున చక్రవర్తి’కి గానూ అంతర్జాతీయ స్థాయిలో నాకు నాలుగు అవార్డులు వచ్చాయి. కోలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా, కేరవ్యాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, మోకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ది బుద్దా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు వచ్చాయి.

విజయ్ రామరాజుతో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పండి?
విజయ్ రామరాజుకి సినిమా పట్ల చాలా ప్యాషన్, డెడికేషన్ ఉంది. ఈ మూవీలో చాలా వేరియేషన్స్ చూపించాడు. రకరకాలుగా తన శరీరాకృతిని మార్చుకున్నారు. కబడ్డీని నేర్చుకున్నారు. సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. ఆయన మీద ఎన్నో ప్రయోగాలు చేశాం. మంచులో అతడ్ని చాలా కష్టపెట్టాం. హీరోయిన్ సిజా రోజ్ కళ్లతోనే నటించేవారు. దయానంద్ గారు వంద శాతం న్యాయం చేశారు.

ఇన్నేళ్ల జర్నీలో నిర్మాత శ్రీని గుబ్బల సపోర్ట్ ఎలా ఉంది?
నిర్మాత శ్రీని గుబ్బల ఓ ఎన్నారై. ఆయనకు సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది. ఈ మూవీని ఆయన చాలా నమ్మారు. అందుకే మా కోసం చాలా ఏళ్లు అలా టైం ఇచ్చారు. మీకేం కావాలంటే అది చేయండి కానీ.. డబ్బుని మాత్రం వృథా చేయకండని అనేవారు. మధ్యలో ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా ఆయన అండగా నిలబడ్డారు.

‘అర్జున్ చక్రవర్తి’ గురించి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడారా?
ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్స్ చేశారు. ‘అర్జున్ చక్రవర్తి’ బాగుందని, అందులో నా వర్క్ బాగుందని మెచ్చుకున్నారు. మనకే ఇదంతా జరిగిందా? అన్నట్టుగా ఉంటుంది. కబడ్డీ ఆటలో మనం ఉన్నామా? అనే ఫీలింగ్ ఇచ్చేలా కెమెరాల్ని కూడా ఆటలో భాగంగా ఆడించేలా ట్రైనింగ్ తీసుకుని షూటింగ్ చేశాం. ఇందులోని కథ ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ‘అర్జున్ చక్రవర్తి’ ఎంతో మోటివేషనల్‌గా ఉంటుంది.

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

1 day ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

3 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago