రాయ్ ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అర్చన(వేద), మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు. ముఖ్య అతిధులుగా ఆకాష్ పూరితో పాటు మరో హీరో విజయ్ శంకర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆకాష్ పూరి మాట్లాడుతూ…” అందరికి నమస్కారం. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా వుంది.”కర్మస్థలం” అనే టైటిల్ చాలా చాలా బాగుంది.మోషన్ పోస్టర్ కూడా బాగుంది.చెప్పాలంటే నేను కూడా అమ్మవారి భక్తుడిని.ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం సువర్ ఎక్ససైటింగ్.ఈ మధ్య హనుమాన్, కార్తికేయ,కాంతారా ఇలాంటి సినిమాలని ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. బాగున్న సినిమాలను మన తెలుగు ఆడియన్స్ ఎపుడు ముందుండి ముందుకి తీసుకెళ్తారు.ఈ సినిమాని ని కూడా ముందుకు తీసుకెళ్తారు.ప్రొడ్యూసర్ గారికి హాట్స్ ఆఫ్ ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చినందుకు.నేను కర్మ ని నమ్ముతాను. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అలానే చెడు చేస్తే చేడు జరుగుతుంది అని నమ్ముతాను.ఇలాంటి కథ చేయాలి అని నాకు వుంది.టీం అందరికి ఆల్ ది బెస్ట్. అన్నారు.
విజయ్ శంకర్ మాట్లాడుతూ..”నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా థాంక్స్. “కర్మస్థలం” అనే టైటిల్ లోనే ఒక రోయాలిటీ వుంది.మైండ్ లోకి వెళ్లిపోయే టైటిల్. వచ్చే దారిలో ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ చూస్తూ వచ్చాను. చాలా బాగుంది.ఫస్ట్ నుంచి ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నారు.అలానే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఇలానే చేయండి.ఎందుకంటే నా రాచరికం మూవీకి ప్రమోషన్స్ లేక చాలా లాస్ అయింది.మూవీ తీయడం ఎంత ఇంపార్టెంట్ ఓ పది మందికి తెలిసేలా చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మన టాలీవుడ్ లో మూవీస్ బాగా చేస్తున్నారు కానీ ప్రమోషన్స్ టైం లో డ్రాప్ అయిపోతున్నారు. ఈ మూవీ కి ఆలా కాకుండా ప్రమోషన్స్ మీద టైం పెట్టండి మంచి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటారు. మిలో ఆ కసి కనిపించింది.మన టాలీవుడ్ లో చాలా మంది మంచి డైరెక్టర్స్ వున్నారు, వాళ్లకి కానీ మంచి ప్రోడుసెర్స్ దొరికితేయ్ రాజమౌళి, సుకుమార్ గారి లాగ సక్సెస్ అవుతారు.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నారు.
నటుడు సతీష్ సరిపల్లి మాట్లాడుతూ..”కర్మస్థలి కన్నా ముందు కుంభస్థలి చేసాం. మొదట అది చేసిన తరువాత కర్మస్థలం వచ్చింది.నేను ఎంట్రీ అయినప్పుడు చాలా చిన్న ప్రాజెక్ట్. రాకీ డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ విజువల్స్ పరంగా చూస్తే ఒక పెద్ద సినిమా లాగ చేసారు.చిన్న గా స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద ప్రాజెక్ట్ గా తీర్చి దిద్దారు.ఒక సీక్రెట్ ఏంటి అంటే ఇందులో రాకీ గారు కూడా ఒక మంచి రోల్ చేసారు, డైరెక్షన్ చేస్తూ కూడా.ఇపుడే స్టార్ట్ చేసాం ఇంకా చాలా కంటెంట్ వుంది. అందరికి ఈ సినిమా నచుతుంది అని నమ్ముతున్నాను. చాలా థాంక్స్. అన్నారు.
హీరోయిన్ మిథాలీ చౌహాన్ మాట్లాడుతూ…” ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ రాకీ గారికి థాంక్స్.ఈ క్యారెక్టర్ చేయడం వాళ్ళ మంచి అపీప్రిసియేషన్స్ వస్తాయి అని అనుకుంటున్నాను. చాలా థాంక్స్. అన్నారు.
నటుడు క్రాంతి కిల్లి మాట్లాడుతూ..”ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. 2022 లో కాశ్మీర్ స్టోరీస్ వచ్చింది, 2023 లో కేరళ స్టోరీస్ వచ్చింది, అలానే చావా, రజాకార్ ఇలా కొన్ని సినిమాలు మన సనాతన ధర్మం గురించి మన హిందూ ధర్మం గొప్పతనాన్ని చెప్పాయి. నేను చిన్నపాటి నుంచి చదువుకున్న దాంట్లో తెలియని ఎన్నో కథలను సినిమాలు చూసి తెలుసుకున్నాను.మన హిందూ దర్మం గొప్పతనాన్ని అందరికి తెలియడానికి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కాబట్టి అందరు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను.ఇలాంటి సినిమాలో నేను కూడా పార్ట్ అవడం చాలా హ్యాపీ గ వుంది.ఇది ఇంతటిత ఆగదు కర్మస్థలం తరువాత కుంభస్థలం వస్తుంది. విక్కీ కౌశల్ కూడా పరుశురాముడు పాత్ర చేస్తున్నారు.హిందుత్వం, సనాతన ధర్మం గొప్పతనాన్ని ఆందరూ ఆదరిస్తారు అని అనుకుంటున్నాను.ఆకాష్ బయ్యా ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్. ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు.ఆకాష్ గురించి ఒక చిన్న మాట చెప్పాలి.ఆయన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం వెళ్తున్నాం, సడన్ గావ్ ఆగిపోయి కాళ్ళకి వున్నా చెప్పులు తీసి దూరం లో వున్నా ఒక రాయి కి దణ్ణం పెట్టాడు.. ఇలాంటి సినిమాలకి ఇంత కన్నా గొప్ప గెస్ట్ ఇంకొకరు వుండరు.” అన్నారు.
ప్రొడ్యూసర్ యువరాజ్ మాట్లాడుతూ నేను పూణే నుంచి వచ్చాను.8 నెలల క్రితం నేను రెండు లైన్స్ స్టోరీ విన్నాను. చాలా నచ్చింది.సనాతన దర్మం గురించి చెప్పే సినిమా ఇది.రాకీ చాలా హార్డ్ వర్కింగ్. ఈ సినెమా కోసం తన 100% ఇచ్చాడు.థాంక్ యూ. ” అన్నారు.
డైరెక్టర్ రాకీ మాట్లాడుతూ మనం సాధారణంగా ఎలాంటి పండగ వచ్చిన ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దాని వెనకాల ఒక హిస్టరీ, వార్ ఇలా చాలా వున్నాయి.ఇందులో ఒక మంచి లైన్ చెప్పాను అదే మహిసాసుర మర్ధిని.అందరికి మోషన్ పోస్టర్ నచ్చింది అనుకుంటున్నాను.నేను ఎంత ప్యూర్ గా నమ్మానో అంత మంచిగా ఈ సినిమా చేశాను. అందరు సపోర్ట్ ఇస్తారు అని అనుకుంటున్నాను.” అన్నారు.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…