హే భగవాన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ ఉంటుంది: నిర్మాత బి.నరేంద్ర రెడ్డి.

Must Read

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్‌’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బి.నరేంద్ర రెడ్డి విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.


మీ నేపథ్యం ఏమిటి? సినిమాలపై ఆసక్తి ఎలా కలిగింది?
కడప జిల్లా లోని ప్రొద్దుటూరు నా స్వస్థలం. ప్రస్తుతం నేను బెంగుళూరులో కన్‌స్ట్రక్షన్‌ రంగంలో ఉన్నాను. చిన్నప్పటి నుండి సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే కన్నడంలో నిర్మాతగా ప్రవేశించాను. తెలుగులో నిర్మాతగా తొలిసినిమా ‘హే భగవాన్‌’

సినీ పరిశ్రమలోకి ఎలా ప్రవేశించారు?
కన్నడ సినీ పరిశ్రమలో సినిమాలకు ఫైనాన్స్‌ ఇచ్చేవాడిని. ఇక సినిమాలంటే పాషన్‌తో నిర్మాతగా మారాను.

హేభగవాన్‌ ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయ్యింది?
మా సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత రమణా రెడ్డి ద్వారా ఈ కథ విన్నాను. హే భగవాన్‌ కంటే ముందు పది కథలు విన్నాను. కానీ ఏది నచ్చలేదు. ‘హే భగవాన్‌’ కథ వినగానే ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఆసక్తిగా అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషనల్‌గా ఉండే సినిమా ఇది.

ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం ఏమిటి? తొలి సినిమా అనుభవం ఎలా ఉంది?

స్టోరీ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. బడ్జెట్‌లోనే సినిమా జరిగింది. ప్రతిది ప్లానింగ్‌ ప్రకారమే వెళ్లాం. సినిమాకు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. అంతా క్వాలిటీగా అవుట్‌పుట్‌ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఫాదర్‌, సన్‌ ఎమోషన్‌ అందరి హృదయాలను హత్తుకుంటుంది.

సినిమా చూసిన తరువాత మీ ఫీలింగ్‌ ఏమిటి?
సినిమా కథ విన్నప్పుడు నేను ఏదైతే ఫీల్‌ అయ్యానో రేపు సినిమా చూసిన తరువాత కూడా ఆడియన్స్‌ కూడా అదే థ్రిల్ల్‌ ఫీలవుతారు. ప్రతి సన్నివేశం ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఆసక్తిగా ఉంటుంది. సినిమాలో హీరో సుహాస్‌, నటుడు నరేష్‌, కమెడియన్ సుదర్శన్‌, వెన్నెల కిషోర్‌ ఇలా ప్రతి పాత్ర ఆడియన్స్‌ను బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది.

సినిమాలో ఇంటర్వెల్‌, పతాక సన్నివేశాల్లో ట్విస్ట్‌లు ఉంటాయా?
ఖచ్చితంగా ఆడియన్స్‌ ఊహకు అందని విధంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఉంటుంది. ప్రతి సన్నివేశం కొత్తగా అనిపిస్తుంది.

బన్నీవాస్‌, వంశీ నందిపాటితో కలిసి ఈ సినిమా విడుదల చేయడం ఎలా ఉంది?
బన్నీ వాస్‌, వంశీతో ట్రావెల్‌ వంశీ మొదట్నుంచీ ఉంది. ఈ కథ గురించి వంశీ నందిపాటికి తెలుసు. ఆయనతో ట్రావెల్‌ అవుతున్నాను. వాళ్ల అసోసియేషన్‌తో ఈ సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది.

నిర్మాతగా మీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఈసినిమాలో ఎంత వరకు ఉంటుంది?

క్రియేటివ్‌ ప్రాసెస్‌లో మా ఇన్‌వ్వాల్వ్‌మెంట్‌ ఏమీ వుండదు. కథ ఓకే చేయడం వరకు మన బాధ్యత, ఆతరువాత సినిమా బడ్జెట్‌లోనే జరగుతుందా? లేదా షూటింగ్‌ ఈ రోజే ఏం చేశారు? ఇలా ప్రతిది నిర్మాతగా చెక్‌ చేసుకుంటాను.

సినిమా నిర్మాణంతో పాటు ఓ కథను ఎంచుకుని సినిమా తీయడ, జడ్జ్‌ చేయడం రిస్క్‌ అనిపించటం లేదా?
రెండు గంటలు ఆడయన్స్‌ను కథ ఎంగేజ్‌ చేయగలిగితే ఆ సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టరే. ఆడియన్‌ కథతో డిస్‌కనెక్ట్‌ కాకూడదు. నేను కథ వినేటప్పుడు కూడా ఇదే ఫాలో అవుతాను. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉంది. దీంతో నాకు నిర్మాణం పెద్ద రిస్క్‌ అనిపించడం లేదు.

ఈ సినిమా ద్వారా మీరు సంపాందించిన ఎక్స్‌పీరియన్స్‌?
2017 నుంచి ప్రొడక్షన్‌ బ్యాక్‌ ఎండ్‌లో ఉన్నాను. నాకు అనుభవం ఉంది. ప్రాపర్‌, ప్లానింగ్‌, డిసిప్లేన్‌తో ఉండటం, ప్రాపర్‌ గైడెన్స్‌తో సినిమా చేయడం నాకు తెలుసు. అందుకే నేను సినిమా నిర్మాణాన్ని కూడా ఇష్టంతోనే చేశాను.

మీకు ఎలాంటి సినిమాలు చేయడం అంటే ఇష్టం?

ఎమోషన్‌ మూవీస్‌ విత్‌ ఫన్‌వే సినిమాలు చేయాలని ఉంది. కన్‌స్ట్రక్షన్స్‌, సినిమా నిర్మాణానికి చాలా తేడా ఉంటుంది.

మీ తదుపరి సినిమా?
ఫ్రెండ్‌షిప్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సత్యదేవ్‌ హీరోగా నటిస్తాడు. లక్ష్మీనారాయణ దర్శకుడు.
ఇప్పటివరకు సత్యదేవ్‌ టచ్‌ చేయని జోనర్‌లో అవుట్‌ అవుట్‌ అండ్‌ కమర్షియల్ మూవీ ఇది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌ నటిస్తారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News