రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ది ఇండియన్ స్టోరి. చమ్మక్ చంద్ర, ముక్తార్ ఖ ాన్, రామరాజు, సమీర్, సి.వి.ఎల్ నరసింహారావు, అనంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ భీమ్ రెడ్డి నిర్మించారు. మన సమాజంలో మత సామరస్యం ఉండాలనే మంచి సందేశంతో అన్ని కమర్షియల్ అంశాలు కలిపి ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి. రేపు ఈ సినిమా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ మెంబర్స్ కు మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా
దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ – అన్ని మతాలూ సమానమే. మనుషులంతా ఒక్కటే అనే మంచి కాన్సెప్ట్ తో ది ఇండియన్ స్టోరి సినిమాను రూపొందించాం. కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థంతో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఈ విషయాన్ని మా మూవీలో చర్చించాం. దీంతో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మా టీమ్ కు హెచ్చరికలు చేశారు. మాపై కేసులు పెట్టారు. దాడులు చేసేందుకు ప్రయత్నించారు. అయినా మేము భయపడకుండా సినిమాను రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా సినిమాలో సందేశం ఉన్నా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కామెడీ, యాక్షన్, లవ్, డ్రామా, ఎమోషన్ వంటి అంశాలతో ది ఇండియన్ స్టోరి సినిమా ఆకట్టుకుంటుంది. అన్నారు.
నిర్మాత, హీరో రాజ్ భీమ్ రెడ్డి మాట్లాడుతూ – ది ఇండియన్ స్టోరి సినిమా మేము నిర్మించడం వెనక ఎలాంటి రాజకీయ శక్తులు లేవు. ఒక మంచి సందేశాత్మక సినిమా కమర్షియల్ అంశాలతో రూపొందించే ప్రయత్నం చేశాం. సెన్సార్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. నా విజ్ఞప్తి ఒక్కటే ఏ భాషలో అయినా స్థానిక భాష తెలిసిన సెన్సార్ ఆఫీసర్ ఉండాలి. తెలుగు సినిమాల సెన్సార్ కు తెలుగు తెలిసిన అధికారులే ఉండాలి. అప్పుడే మన సినిమాల్లోని భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోగలరు. ది ఇండియన్ స్టోరి సినిమాను అందరికీ నచ్చేలా తెరకెక్కించడంలో టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా మీరు అనుకున్నట్లు సీరియస్ సబ్జెక్ట్ తో ఉండదు. కామెడీ, యాక్షన్, డ్రామా అన్నీ ఉంటాయి. చమ్మక్ చంద్రతో నా సీన్స్ హిలేరియస్ గా వచ్చాయి. మీ మొదటి సినిమాను ఇలాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్ తో ఎందుకు చేశారని చాలా మంది అడుగుతున్నారు. ఇది సెన్సిటివ్ సబ్జెక్ట్ అయినా మేము సమాజానికి ఏ నెగిటివ్ మెసేజ్ వెళ్లకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేశాం. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా కథను నడిపాం. సెన్సార్ వాళ్లకు కూడా సబబే అనిపించేలా మూవీ ఉంటుంది. ఎడిటర్ జేపి గారు, డైరెక్షన్ టీమ్, రైటింగ్ టీమ్ ప్యాషన్ తో పనిచేశారు. వన్ మీడియా పార్థు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం చూసుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంతోషంగానే ఉన్నాం. అలాగే సినిమాను రేపు థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. ఈ వారం ఎన్ని సినిమాలు రిలీజైన బాక్సాఫీస్ విన్నర్ ది ఇండియన్ స్టోరి అవుతుందని నమ్మకంగా చెప్పగలం. నా నెక్ట్ మూవీ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుంది. యానిమల్, కేజీఎఫ్ కలిస్తే ఎలా ఉంటుందో అంత యాక్షన్ ఉంటుంది. ఆ సినిమాకు లూథర్ అనే టైటిల్ పెట్టాం. మరికొద్ది రోజుల్లో ఆ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాం. అన్నారు.
హీరోయిన్ జరా ఖాన్ మాట్లాడుతూ – తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను ముంబై నుంచి వచ్చాను. ది ఇండియన్ స్టోరి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించాను. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నా. ముంబైలో తెలుగు డబ్బింగ్ సినిమాలో చాలా వస్తుంటాయి. అవి చూశాక ఇక్కడి ఇండస్ట్రీ ఎంత పెద్ద పరిశ్రమో అర్థమైంది. ది ఇండియన్ స్టోరీ సినిమా చూడండి. మంచి కాన్సెప్ట్, మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ ఉన్నాయి. అన్నారు.
సహ నిర్మాత కమల్ హాసన్ పాత్రుని మాట్లాడుతూ – ది ఇండియన్ స్టోరి సినిమాకు సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్. టీమ్ వర్క్ గా కష్టపడిన మా యూనిట్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాను ఇక్కడి దాకా తీసుకొచ్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఆ ప్రాబ్లమ్స్ కూడా హ్యాపీగానే ఫేస్ చేశాం. ది ఇండియన్ స్టోరి సినిమాను థియేటర్స్ లో చూడండి. అన్నారు.
ఎడిటర్ జేపి మాట్లాడుతూ – మా మూవీ ట్రైలర్ మీకు నచ్చినట్లే..సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను రేపు గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా చూశాక మీలో ఒక మంచి ఆలోచన మొదలవుతుంది. మతం పేరుతో గొడవలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకుంటారు. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఆలోచింపజేసే సినిమా అవుతుంది. అన్నారు.
వన్ మీడియా పార్థు మాట్లాడుతూ – ది ఇండియన్ స్టోరి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం నా ఆధ్వర్యంలోనే జరిగింది. సినిమాకు వర్క్ చేస్తున్న క్రమంలోనే ఓ మంచి సినిమాలో భాగమయ్యానని హ్యాపీగా అనిపించింది. దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి, నిర్మాత హీరో రాజ్ భీమ్ రెడ్డి ఒక మంచి ప్రయత్నం చేశారు. ప్రేక్షకులంతా ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు – రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్, చమ్మక్ చంద్ర, ముక్తార్ ఖాన్, రామరాజు, సమీర్, సీవీఎల్ నరసింహారావు, అనంత్ తదితరులు
టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – జేపి, మ్యూజిక్ – సందీప్ కనుగుల, డీవోపీ – నిమ్మల జైపాల్ రెడ్డి, స్టంట్ – శంకర్, ఆది, ఆర్ట్ డైరెక్టర్ – మోహన్, వై నాగు, కొరియోగ్రాఫర్ – ఆనంద్ రాజ్ చిగిరి, కో ప్రొడ్యూసర్ – కమల్ హాసన్ పాత్రుని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – జానకి రామ్ పమరాజు, పీఆర్ఓ – కె. శ్రీధర్ (స్టూడియో వన్), బ్యానర్ – ది భీమ్ రెడ్డి క్రియేషన్స్, ప్రొడ్యూసర్ – రాజ్ భీమ్ రెడ్డి, దర్శకత్వం – ఆర్ రాజశేఖర్ రెడ్డి.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…