విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అసురగురు. ఎ. రాజ్దీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని JSB సతీష్ నిర్మించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు.
ట్రైన్ హీస్ట్ సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. ట్రైలర్ పవర్ ప్యాడ్ యాక్షన్ తో సీట్ ఎడ్జ్ థ్రిల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. విక్రమ్ ప్రభు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వుంది. దర్శకుడు రాజ్దీప్ థ్రిలింగ్ ఎలిమెంట్స్ ట్రైలర్ తో ప్రజెంట్ చేశారు. కెమరా పనితనం, నేపధ్య సంగీతం టాప్ క్లాస్ లో వున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
విక్రమ్ ప్రభు తన తొలి బ్లాక్ బస్టర్ తొలి చిత్రం ఇవాన్ వేరెమదిరి (సిటిజన్ పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది) నుండి తన కెరీర్లో ఎప్పుడూ యాక్షన్ థ్రిల్లర్లతో అలరిస్తుంటారు.
తమిళంలో తాజా హిట్ చిత్రం ఇరుగపాట్రు తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన విక్రమ్ ప్రభు ఇప్పుడు అసురగురుతో థ్రిల్ పంచబోతున్నారు.
ఇందులో హీరోయిన్ మహిమా నంబియార్ పాత్ర స్ట్రీట్ స్మార్ట్ డిటెక్టివ్గా తీర్చిదిద్దారు.
ఈ చిత్రం రైలు హీస్ట్ సీక్వెన్స్తో ప్రారంభమౌతోంది. తమిళనాడులో కొన్నేళ్ల క్రితం జరిగిన నిజ జీవితంలో జరిగిన దోపిడీ నుంచి స్ఫూర్తితో ఈ కథని తీర్చిదిద్దారు. ఇందులో హీరో క్లెప్టోమేనియాతో ఇబ్బందిపడుతుంటారు. ఈ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
యోగి బాబు, ఎలాంగో కుమారవేల్ , సుబ్బరాజు, అనుపమ కుమార్, నాగినీడు, సంపత్ రామ్ కీలక పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి గణేష్ రాఘవేంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. అన్బరివ్ యాక్షన్ సమకూరుస్తున్నారు. లారెన్స్ కిషోర్ ఎడిటర్.
మే3న ఆహా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
తారాగణం: విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ,యోగి బాబు, ఎలాంగో కుమారవేల్ ,సుబ్బరాజు, అనుపమ కుమార్ , నాగినీడు, సంపత్ రామ్ , మనోబాల, రాజన్, శివకుమార్ (పసంగ శివ కుమార్)
టెక్నికల్ సిబ్బంది:
దర్శకత్వం – ఎ. రాజ్దీప్
నిర్మాత – JSB సతీష్
సంగీతం – గణేష్ రాఘవేంద్ర
ఎడిటింగ్ – లారెన్స్ కిషోర్
యాక్షన్ – అన్బరివ్
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…
సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…