తెలుగు ప్రేక్షకులు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చూడటానికి ఇష్టపడుతుంటారు. అలానే ఒరిజినాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలకి ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. అలా వచ్చిన ఎన్నో సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఇక తెలుగులో ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ రోహిత్ మరియు క్యాంప్ శశి గురించి ప్రత్యేకించి పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు.
వీళ్లు చేసిన ఎన్నో ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు కూడా వీళ్ళ వర్క్ చూసి ఫిదా అవుతుంటారు. స్టోరీ డిస్కషన్స్, నిరుద్యోగ నటులు వంటి సిరీస్ వీళ్లకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం రోహిత్ మరియు శశి దర్శకత్వం వహించిన గోపిగాళ్ల గోవా ట్రిప్.
ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కి డైరెక్టర్ రోహిత్ మరియు శశి , మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడిమర్తి. ప్రొడ్యూసర్, నటుడు సాయికుమార్, రాజు శివరాత్రి, అజిత్ మోహన్, సాయి కుమార్, పవన్ రమేష్ హాజరయ్యారు.
డైరెక్టర్ రోహిత్ అండ్ శశి మాట్లాడుతూ…
ఈ సినిమాకి మొత్తం ముగ్గురు ప్రొడ్యూసర్లు, ఈ సినిమాను మొదటిసారి మొదలుపెట్టారు. ఈ ఐడియా చెప్పిన 15 రోజు షూటింగ్ లో ఉన్నాం. గద్వాల్ డిస్ట్రిక్ట్ లోని ఒక రిమోట్ విలేజ్ లో ఈ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇది ఒక రకమైన రూట్ ఫిలిం. హైవే మీద ట్రావెల్ చేస్తూ గోవా దాకా రీచ్ మధ్యలో షూటింగ్ చేసాం ఎక్కడ పర్మిషన్ లు కూడా లేవు. సినిమా 90% సినిమా అవుట్ డోర్ లోనే ఉంటుంది. ఇది చాలా మెమొరబుల్ షూట్. ఈ సినిమా.. చిల్డ్ బీర్ లాంటి మూవీ. ఇలాంటి మూవీని మీడియా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను అని మాట్లాడారు.
పుష్ప ఫేమ్ జగదీష్ (కేశవ) మాట్లాడుతూ…
జగదీష్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది తను నటించిన నిరుద్యోగ నటులు వెబ్ సిరీస్. దానికి రోహిత్ మరియు శశి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత పుష్ప సినిమా విపరీతమైన గుర్తింపు సాధించింది. వరంగల్ నుంచి హైదరాబాద్ కి సినిమాలు చూడడానికి వచ్చిన జగదీష్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో సెటిల్ అయిపోయాడు. ఈ సినిమా నవంబర్ 14న విడుదలవుతుంది అందరూ చూసి ఎంకరేజ్ చేయండి.
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ…
ఈ సినిమా అనేది ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లో మాగ్నమోపస్ లాంటిది. అంటూ ఎలివేషన్ తెలిపాడు. ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ అందరూ ఎంకరేజ్ చేయాలి అని కోరుకున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడిమర్తి. ప్రొడ్యూసర్ మరియు నటుడు సాయికుమార్, రాజు శివరాత్రి, అజిత్ మోహన్, సాయి కుమార్, పవన్ రమేష్ ఈ ఈవెంట్లో మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది. మా సినిమాను ఎంకరేజ్ చేయాలి అని ఆడియన్స్ ను కోరారు.
‘గోపి గాళ్ల గోవా ట్రిప్’ సినిమాను రాస్తా ఫిల్మ్స్, ఔరాఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్తంగా నిర్మించారు. అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మాణంలో రోహిత్ & శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నవంబర్ 14న ఏ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్,…
సినీ కార్మికులకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు. చిత్రపురి కాలనీకి కోట్లాది రూపాయల…
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా…
రాకింగ్ మంచు మనోజ్ స్టైలిష్ కమ్బ్యాక్కు రంగం సిద్దమైంది. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 'వడ్డీ కాసుల…
హాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్ను…
టాలీవుడ్లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక…