ఐకానిక్ అకాడమీ అవార్డు విన్నర్ ఎం.ఎం. కీరవాణి-కవిపెరరసు వైరముత్తు-కె.టి కుంజుమోన్ కొలాబరేషన్ లో వరల్డ్ ఫేమస్ బోల్గట్టి ప్యాలెస్ ఐలాండ్లో కంపోజ్ సెషన్ తమిళ పరిశ్రమ మెగా ప్రొడ్యూసర్ కె.టీ కుంజుమోన్ నిర్మించనున్న జెంటిల్మన్ 2 కంపోజింగ్ బిగిన్స్
ప్రముఖ నిర్మాత “జెంటిల్మన్” కె.టి. కుంజుమోన్ అనేక బ్లాక్బస్టర్ సినిమాల ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో కీలక పాత్ర పోషించారు. ‘జెంటిల్మన్” సినిమా ద్వారా దర్శకుడు శంకర్ని పరిచయం చేసి బ్లాక్బస్టర్ హిట్ని క్రియేట్ చేశారు. 30 సంవత్సరాల తరువాత “జెంటిల్మన్ 2” పార్ట్ 2 ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
ఎ. గోకుల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అకాడమీ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కవిపేరరసు లిరిక్ రైటర్ వైరముత్తు సాహిత్యం అందిస్తుండగా అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ వర్క్స్ని పర్యవేక్షిస్తున్నారు.
ప్రాజెక్ట్ మెటీరియలైజ్లో మొదటి దశగా, కె.టి. కుంజుమోన్ కొచ్చిలోని ప్రపంచ ప్రఖ్యాత బోల్గట్టి ప్యాలెస్ ఐలాండ్లో పాటల కంపోజింగ్ సెషన్ను నిర్వహించనున్నారు. ఎం.ఎం. కీరవాణి జూలై 19న కవిపేరరసు పాటల రచయిత వైరముత్తుతో కలిసి ఇక్కడికి చేరుకోనున్నారు.
ఈ ఇద్దరు దిగ్గజాలు కలసి గతంలో వరుస విజయాలు సాధించారు. కీరవాణి తమిళంలో చేసిన సేవగన్, వనమే ఎల్లై, జాతి మల్లి చిత్రాలలో అనేక విజయవంతమైన పాటలని అందించారు. దర్శకుడు గోకుల్ కృష్ణ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఈ జీనియస్ బృందంలో చేరుతున్నారు. బ్లాక్ బస్టర్ నిర్మాత కె.టి.కుంజుమోన్ అత్యంత భారీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.
ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది గురించిన వివరాలు త్వరలో తెలియజేస్తారు.
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…
భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…