వీటి ఎంటర్ప్రైజెస్ పతాకంపై రవి సిరోర్, నివిష్క పాటిల్, హీరో హీరోయిన్లుగా ఎస్ జి ఆర్ దర్శకత్వంలో జి. వెంకటేష్ రెడ్డి నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఎవరు ఎందుకు”. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి నిన్న ఆవిష్కరించారు. అలాగే ఈ చిత్ర లిరికల్ సాంగ్ ని ప్రొడ్యూసర్ కాన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో హీరో రవి సిరూర్ , సంగీత దర్శకులు సతీష్ ఆర్యన్,సహనిర్మాతలు పిడిఆర్ ప్రసాద్ రెడ్డి, వినయ్ రెడ్డి,లేపాక్షి ఆలయ చైర్మన్ రామానంద్ శర్మ, కృష్ణంరాజు స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్ర శాస్త్రి, , ఆర్టిస్ట్ శృతి తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడుతూ “వెంకటరెడ్డి ప్రభాస్ ఫ్యాన్స్ హిందూపూర్ ప్రెసిడెంట్ గా ఎప్పటినుంచో ఉన్నారు. ఆయన మా ఫ్యామిలీ మొత్తానికి అభిమాని. అటువంటి ఆయన ఈరోజు నిర్మాతగా మారడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంతమంది ప్రముఖ నటుల ఫోటోల మధ్యన ,ఫిలిం ఛాంబర్ లో ఈ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ చూస్తుంటే మహానటుల దీవెన వీళ్లకు ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి సినీ పరిశ్రమకు ఒక డైరెక్టర్ రావాలి, ఒక ప్రొడ్యూసర్ కావాలి, ఒక యాక్టర్ రావాలి. మాతోపాటు మా అభిమానులు అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను” అన్నారు
నిర్మాత వెంకటేష్ రెడ్డి మాట్లాడుతూ ,” మా ఆరాధ్య దైవం రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి సతీమణి చేతుల మీదుగా ఈరోజు మా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ జరగటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనికి కారకులైన మా కృష్ణంరాజు & ప్రభాస్ ఫ్యాన్స్ ఆల్ ఇండియా అధ్యక్షులు శాస్త్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఎంటర్టైనర్. చక్కటి మ్యూజిక్ కి స్కోపు వున్న చిత్రం. ఈ చిత్రం డెఫినెట్ గా అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
చిత్ర డైరెక్టర్ ఎస్.జి.ఆర్ మాట్లాడుతూ” మా చిత్రం ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. హిందూపూర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాము. ఈ చిత్రంలో మూడు పాటలుంటాయి .అవి నేనే రాశాను. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ చిత్రం చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
రవి సిరూర్, నివిష్కా పాటిల్, అనురాధ, జగ్గప్ప తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సతీష్ ఆర్యన్, డి ఒ పి:ఎ . సి మహేంద్రన్, ఎడిటర్: మను ఎస్రంగ కహలె, డ్యాన్స్: సై రమేష్, పి అర్ ఓ: బి. వీరబాబు, కో ప్రొడ్యూసర్స్: పి డి అర్ ప్రసాద్ రెడ్డి, కె . వినయ్ రెడ్డి,నిర్మాత: జి. వెంకటేశ్వర రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం: ఎస్ జి ఆర్.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…