రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్కనకాల, ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్, వెంకటేష్, సాయి అరుణ్, రాహుల్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘ది బర్త్డే బాయ్’ఈ చిత్రాన్ని బొమ్మ బొరుసా పతాకంపై ఐ.భరత్ నిర్మించారు. ఈ చిత్రానికి విస్కి దర్శకుడు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మంచి మౌత్ టాక్తో, క్రిటిక్స్ అభినందనలతో ముందుకు సాగుతున్న ఈ చిత్రం థ్యాంక్స్ మీట్ శనివారం జరిగింది. ఈసందర్భంగా
నిర్మాత భరత్ మాట్లాడుతూ ఈ సందర్భంగా నాకు సపోర్ట్ చేసిన నా స్నేహితులకు, నా ఫ్యామిలీకి థ్యాంక్స్. రాహుల్ మాచినేని అనే సూపర్ కెమెరామెన్ ఈ సినిమాకు దొరికారు. ఆయన ప్రతిభ సినిమాలో కనిపించింది. సంగీత దర్శకుడు ప్రశాంత్కు కూడా ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది. విస్కి వల్లే ఈ రోజు సినిమాకు ఈ రోజు ఇంత మంచి టాక్ వచ్చింది. కామన్ ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తోంది. సింక్ సౌండ్ అనేది సినిమా విజయంలో ఎంత కీలకంగా అనిపించింది.ఈ సినిమాలో నటించిన నటీనటులు కొత్తవారైనా బాగా నటించారు. రవికృష్ణ, రాజీవ్ కనకాల నటన గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా అంటే, థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇష్టంతో, నిజాయితీగా సినిమా చేశాం. తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండ
దర్శకుడు విస్కి మాట్లాడుతూ ‘ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మా నటీనటులదే. చిన్నసినిమా గురించి ఎవరూ మాట్లాడుకోరు. కానీ మా సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. మీరు మౌత్టాక్ తెలుసుకుని సినిమాకు వెళ్లండి. సినిమా థియేటర్స్ తిరిగి స్పందన తెలుసుకుంటున్నాం. అందరూ చాలా బాగా తీశారు అని మెచ్చుకుంటున్నారు. నేను నా వాస్తవ జీవితంలో జరిగిన ఈ సంఘటనను థియేటర్లో ఆడియన్స్ కూడా ఫీల్ అవ్వాలనే వుద్దేశంతో సినిమాను చాలా సహజంగా తీశాను. ఇదొక కాన్సెప్ట్ ఫిలిం. ఇది అందరికి రీచ్ అయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నిజాయితీగా ఈ సినిమా తీశాను. సొంతంగా విడుదల చేశాం. మీరు సినిమా చూసి నచ్చితే నలుగురికి చెప్పండి.
ఎటువంటి నేపథ్యం లేకుండా అందరం కొత్తవాళ్లం కలిసి ప్రయత్నించాం. ఆడియన్స్ ఆదరిస్తున్నారు. తప్పకుండా సినిమా చూడాని వాళ్లు చూసి మమ్ములను ఎంకరేజ్ చేయండి అని చిత్ర నటీనటులు తెలిపారు.
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…
నిర్మాత గా ఒక చరిత్ర సృష్టించిన ఎం.ఎస్. రాజు , దర్శకునిగా ‘అగధ’ చిత్రాన్ని ఒక విజువల్ వండర్ గా…
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా రెయిన్బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
పీఆర్ఓగా, జర్నలిస్ట్గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్ తరిగోపులతో…
లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ సినిమా ఫస్ట్ లుక్…