దుల్కర్ ‘కురుప్’ సెప్టెంబర్ 30న జీ సినిమాలు లో

సెప్టెంబర్ 30న దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో అలరించనున్న ‘జీ సినిమాలు’ ఛానల్ హైదరాబాద్, 27th సెప్టెంబర్, 2022: ప్రేక్షకులకు 24 గంటల పాటు సినిమాలతో నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న ‘జీ సినిమాలు’ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో తెలుగు ప్రజలకు మరింత చేరువైతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా, ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా యొక్క వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ ‘కురుప్’ సెప్టెంబర్ 30న సాయంత్రం 6 గంటలకు ‘జీ సినిమాలు’ ఛానల్లో తెలుగులో ప్రసారం కానుంది.

దుల్కర్ సల్మాన్ తో పాటూ శోభిత, షైన్ టామ్, అనుపమ పరమేశ్వరన్, ఇంద్రజిత్ మరియు తదితరులు కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి రివ్యూస్ అందుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కథ సుకుమారన్ కురుప్ అనే విదేశాలకి పారిపోయిన ఒక వాంటెడ్ క్రిమినల్ చుట్టూ తిరుగుతుంది. డబ్బుపై దురాశతో తాను చేసే నేరాలు మరియు తప్పించుకోవడానికి అల్లే కథలు సినిమాని రక్తి కట్టిస్తాయి. సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్, టోవినో థామస్ వంటి నటులు చేసిన పాత్రలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, అద్భుతమైన బాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు కట్టిపడేసే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ అనుభూతిని అందచేయడం ఖాయం.

Tfja Team

Recent Posts

ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి సెల్యూట్ చేస్తూ హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ నుంచి ‘శరణమన్న శరణం’ సాంగ్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…

20 hours ago

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయిక గా వెలుగొందారు మంజుల. ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే, మగాడు,…

2 days ago

ఫుల్ మార్క్స్ సాధించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్

'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే…

3 days ago

“ఫస్ట్ టైం” సినిమా ట్రైలర్ లాంచ్ అగ్ర నటి పాయల్ రాజ్ పుత్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది

హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అయినా భారతదేశంలోనే…

3 days ago

అపోలో నూతన ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అపోలో హాస్పిటల్స్ భారతదేశంలో తన 76వ ఆసుపత్రిని ప్రారంభించింది. హైదరాబాద్‌లో సాంకేతికంగా అధునాతనమైన ఈ ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఆవిష్కరించింది.…

3 days ago

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, బ్యానర్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా…

5 days ago