తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్
తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్ సభ్యులకు ఐడెంటిటీ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ఇటీవల ఫిల్మ్ఛాంబర్లో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఫౌండర్ ప్రెసిడెంట్ ఉషారాణి, గౌరవ అధ్యక్షలు సాయి మాధవ్ బుర్రా, అధ్యక్షులు కొమ్మనాపల్లి గణపతిరావు, ప్రధాన కార్యదర్శి శశాంక్ తదితరులు పాల్గొన్నారు. క్రిష్ ముఖ్య అతిథిగా హాజరై కార్డులను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘నాకు రచయితలు అంటే ఎంతో గౌరవం. టీవీ రచయితలు ఓపిక ఎక్కువ ఉంటుంది. నవల, సినిమా కథలు రాయడానికి చాలా సౌలభ్యం ఉంటుంది. కానీ టెలివిజన్కి రాయాలంటే చాలా సవాళ్లు ఉంటాయి’’ అని అన్నారు.
ఉషారాణి మాట్లాడుతూ ‘‘రైటర్స్ కోసం రైటర్స్ అనే నినాదంతో ఈ అసోసియేషన్ మొదలుపెట్టా. అంతా ఐక్యమత్యంగా ముందుకు వెళ్లాలని కోరుతున్నా’’ అని అన్నారు. సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ ‘‘69ఏళ్ల జాతీయ పురస్కారాల చరిత్రలో తెలుగు వారు ఎవరికీ ఉత్తమ నటుడు అవార్డుల రాలేదు. మొదటిసారి మనతెలుగు హీరో అల్లు అర్జున్కి ఈ అవార్డు వరించడం, నేను మాటలు రాసిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు అవార్డులు రావడం ఎంతో ఆనందంగా ఉంది.
ఉత్తమ నటుడు ఘనత సాధించిన అల్లు అర్జున్ను చూస్తుంటే గర్వంగా ఉంది. తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఎంతో ఘనత సాధించామని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ట్రెజరర్ వెంకటేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్: బివి రామారావు, జాయింట్ సెక్రెటరీ: ప్రజా ప్రభాకర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర వర్మ, అంజన్ మేగోటి, ఫణి రాజ్, రాంప్రసాద్, తదితర తెలుగు టీవీ రచయితలు పాల్గొన్నారు.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…