కిరణ్ అబ్బవరం హీరోగా “క” చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని అందుకున్న దర్శకులు సందీప్, సుజీత్ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ లోనూ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో సందీప్, సుజీత్ లకు స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనౌన్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ దక్కడం ఈ దర్శకుల ప్రతిభకు లభించిన సరైన గౌరవంగా చెప్పుకోవచ్చు.
“క” మూవీ టీమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ తమ సంతోషాన్ని షేర్ చేసుకుంది. క” చిత్రంతో దర్శకులు సందీప్, సుజీత్ తమ ప్రయత్నంలోనే ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నారు. గతేడాది దీపావళికి రిలీజైన “క” సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. త్వరలో మరిన్ని ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ తో రెడీ అవుతున్నారు దర్శకులు సందీప్, సుజీత్
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…
"టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026" జ్యూరీ ఛైర్ పర్సన్ గా నటి ఇంద్రజ వ్యవహరిస్తారు: టీఎఫ్…
మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం దర్శకుడు…
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక…