లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్తోపాటు చక్కటి సోషల్ మెసేజ్తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను మురళీకాంత్ తెరకెక్కించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
▶️https://youtu.be/5P7pEqSTojo
వైవిధ్యమై ప్రమోషనల్ స్ట్రాటజీతో ‘దండోరా’ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా రిలీజ్కు ముందే బిజినెస్ను పూర్తి చేసుకోవటం విశేషం. చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తుంటే.. ఆంధ్ర, సీడెడ్, కర్ణాటక ఏరియాల్లో ప్రైమ్ షో రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్లో 200కు పైగా థియేటర్స్లో సినిమాను అథర్వణ భద్రకాళి పిక్చర్స్ గ్రాండ్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్లో అయితే డిసెంబర్ 23నే ప్రీమియర్స్ పడుతున్నాయి.
మంచి అంచనాలతో క్రిస్మస్ సందర్బంగా విడుదలవుతోన్న ‘దండోరా’ సినిమా నుంచి శుక్రవారం రోజున మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. సాంకేతికంగా మనిషి రోజు రోజుకీ ఎంతో ఎదుగుతున్నాడు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు మంచి చదువులు చదువుకుని అమెరికాకు వెళ్తున్నారు. ఇంత డెవలప్మెంట్ అవుతున్నా.. సమాజాన్ని పట్టి పీడుస్తోన్న అంతర్గత సమస్యల్లో ప్రధానమైనది కులం. అలాంటి ఓ సెన్సిటివ్ విషయాన్ని కమర్షియల్ పంథాలో ఫన్నీగా ఆవిష్కరించారు డైరెక్టర్ మురళీకాంత్. ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి.
తాజాగా విడుదలైన ‘దండోరా’ ట్రైలర్ను మరింత పెంచాయి. ట్రైలర్ను గమనిస్తే.. ఊరి బయట కొంత మంది శవాన్ని మోసుకెళ్తుంటారు. ఇంత దూరం శవాన్ని ఎందుకు మోసుకు రావాలని వారితో పాటు వచ్చే చిన్న పిల్లాడు అడుగుతాడు. దానికి వాళ్లు..
‘మన చావు పుట్టకులన్నీ ఆ ఊరి బయట రాసిండ్రా ఆ దేవుడు..’
‘విష్ణుగాడొచ్చి కాళ్లు పట్టుకున్నా పని కాదని సర్పంచ్ సాబ్ చెబుతున్నాడా అని నందుతో మురళీధర్ పాత్ర చెప్పగానే.. నువ్వు ఉన్నోడివి ఉండకుండా ఆ సర్పంచ్గానికి ఎందుకు చెప్పినావ్..వాడేమన్నా పెద్ద లాడ్డా’ అని నందు చెప్పటం
‘ఒటేసినావ్రా అని’ నవదీప్ తన పక్క నుంచే వాడిని అడిగితే ‘ఎంత పెద్ద మాటన్నావ్ సర్పంచ్ నీ గుర్తుకే గుద్దినా’ అని వాడంటాడు. దానికి ‘ఓటుకి గుద్దినావో.. క్వార్టర్ గుద్ది ఇంట్లో పండినావో ఎవడు చూసిండవయ్యా’ అని నవదీప్ రియాక్ట్ కావటం..
‘ఒక ముద్దు పెట్టుకుంటానే అని రవికృష్ణ పాత్ర మణిక పాత్రను రిక్వెస్ట్ చేస్తే ఆమె ఏమో చెంప పగుల్తాది’ అని సీరియస్గా వార్నింగ్ ఇస్తది
‘సరే అయితే మా అయ్యతోని మాట్లాడి ముహూర్తం పెట్టించు..డైరెక్ట్గా మండపానికి వస్తాను ’ అని మణిక రవికృష్ణతో చెప్పే సీన్
‘నాన్న లేడు అని చెప్పి ఇప్పుడేమో బాధ్యతలు చూపిస్తున్నాడు’అటూ నందుని తన భార్య తిట్టే డైలాగ్
బిందుమాధవి నాగార్జున ఫొటోని ముద్దు పెట్టుకుంటూ ‘ఎట్లున్నాం మేమిద్దరం’ అంటూ శివాజీని అడగటం తనేమో చిరు కోపంగా చూడటం..
మరో సీన్లో అయితే శివాజీ సీరియస్గా ఒకర్ని కాలితో తన్ని.. ‘భయపడ్డావా.. పడాలి’ అంటూ వార్నింగ్ ఇవ్వటం
‘అయ్యిందేదో అయిపోయింది.. పెద్ద మనుషులు మీరే ఏదో ఒక పరిష్కారం చూపించండి’ అని మురళీధర్ పాత్ర రిక్వెస్ట్ చేయటం.. ‘పరిష్కారం లేదు.. బొంగులేదు..వెళ్లి ఆ చెట్టు కింద కాల్చుకోండి’ అంటూ నందుని చూసి కుల పెద్దలు చెప్పటం.. నవదీప్ సీరియస్ గా చూస్తుండటం
మరో సీన్లో మణిక రవికృష్ణతో మాట్లాడుతూ ‘అయినా చిరంజీవిలా బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతావ్కదా.. ఏదైనా చెయ్యొచ్చు కదా.. ’అని అంటుంది..
‘చావు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ.. కులం నుంచి తప్పించుకోలేం రా’ అని మురళీధర్ పాత్ర నందుతో చెప్పటం
‘ఒకటి పెళ్లి దగ్గర లేకపోతే చావు దగ్గర .. ఈ రెండింటిలోనే కదా వీళ్ల ఆటలు సాగేవి’ అంటూ కుల పెద్దలను ఉద్దేశించి వచ్చే డైలాగ్
‘మన బతుకులు మారాలంటే మనకు కావాల్సిందొక్కటి.. చదువు..చదువు..’ అంటూ దేవీప్రసాద్ పాత్ర స్టేజ్ పై చెప్పటం..
ట్రైలర్ చివరలో నవదీప్ ‘కొట్రా డప్పు..’ అంటూ మాస్ స్టెప్స్ వేయటం.. అక్కడ వచ్చే టైటిల్ ట్రాక్
ఇలాంటి డైలాగ్స్ వింటూ ట్రైలర్ చూస్తుంటే సినిమాను ఎలాంటి డెప్త్తో తెరకెక్కించారనేది చెప్పేశారు మేకర్స్. ఊర్లో అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నవదీప్ ప్రెసిడెంట్గా ఎన్నికవుతాడు. అక్కడి నుంచి ఊర్లో వచ్చే సమస్యలు, కుల పెద్దలకు, అతని వచ్చే ఘర్షణలు ఎలా ఉంటాయనే విషయాలను సన్నివేశాల రూపంలో చూపించారు.
శివాజీ పాత్ర, బిందు మాధవి పాత్ర మధ్య ప్రేమ, ఎమోషనల్ సన్నివేశాలను హృద్యంగా చూపించారు. అలాగే శివాజీ రోల్లోని సీరియస్ కోణాన్ని కూడా ఆవిష్కరించారు. నందు పాత్రతో పాటు రవికృష్ణ, మణిక పాత్రల మధ్య ప్రేమ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇలాంటి కుల వ్యవస్థ మీద ఆ గ్రామంలో ఎవరు దండోరా వేశారు.. చివరకు ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే డిసెంబర్ 25న రిలీజ్ అవుతోన్న సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. దండోరా సినిమాలోని పాటలు టి సిరీస్ ద్వారా రిలీజ్ అవుతున్నాయి.
నటీనటులు:
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: లౌక్య ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని
దర్శకత్వం: మురళీకాంత్
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్.శాఖమూరి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
సంగీతం: మార్క్ కె.రాబిన్
ఆర్ట్ డైరెక్టర్: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎడ్వర్డ్ స్టెవెన్సన్ పెరెజి
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖా బొగ్గారపు
లైన్ ప్రొడ్యూసర్: కొండారు వెంకటేష్
ఆడియో: T-సిరీస్
నైజాం డిస్ట్రిబ్యూషన్: మైత్రి మూవీస్
ఆంధ్ర – సీడెడ్ – కర్ణాటక: ప్రైమ్ షో
ఓవర్సీస్ రిలీజ్: అథర్వణ భద్రకాళి పిక్చర్స్
పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్- ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…