మంచి కంటెంట్ తో వస్తున్న “డీమాంటీ కాలనీ 2” రామ్ గోపాల్ వర్మ

బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డీమాంటీ కాలనీ 2” ఈ నెల 23న తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పంపిణీ చేస్తోంది. ఈ సినిమాను శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించారు. అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించారు. ఈ రోజు హైదరాబాద్ లో “డీమాంటీ కాలనీ 2” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అజయ్ భూపతి, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

నిర్మాత బి.సురేష్ రెడ్డి మాట్లాడుతూ – నాకు “డీమాంటీ కాలనీ” సినిమా బాగా నచ్చింది. “డీమాంటీ కాలనీ 2” అనౌన్స్ అయినప్పటి నుంచి డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు గారితో ట్రావెల్ అవుతున్నాను. వీఎఫ్ఎక్స్ వల్ల మూవీ రిలీజ్ కొంత డిలే అయ్యింది. తమిళంలో బిగ్ హిట్ అయ్యిందీ సినిమా. తెలుగులోనూ అంతకంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. ఇందులో హారర్ కంటే థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఆకట్టుకుంటాయి. అజయ్ ఆర్ జ్ఞానముత్తు గారు టెక్నికల్ గా స్ట్రాంగ్ డైరెక్టర్. ఆయన చేసిన అంజలి ఐపీఎస్, కోబ్రా, డీమాంటీ కాలనీ సినిమాలు చాలా బాగుంటాయి. ఆయన టాలెంట్ మీద నమ్మకంతో ఈ మూవీ తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ – నిర్మాత సురేష్ రెడ్డి నాకు మిత్రుడు. ఆయన “డీమాంటీ కాలనీ 2” సినిమా తీసుకుంటున్నానని చెప్పినప్పుడు మంచి సినిమా చేయండి అని చెప్పాను. ఒక మంచి టీమ్ వర్క్ తో దర్శకుడు అజయ్ గారు ఈ సినిమా రూపొందించారు. థియేటర్స్ కు వెళ్లి చూడాలని అనిపించే చిత్రమిది. తమిళంలో పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ శశి మాట్లాడుతూ – “డీమాంటీ కాలనీ 2” సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ మాకు ఇచ్చిన నిర్మాత సురేష్ రెడ్డి గారికి, డైరెక్టర్ అజయ్ ఆర్ జ్ఞానముత్తు గారికి థ్యాంక్స్. ఈ నెల 15న తమిళంలో ఈ సినిమా విడుదలైంది. అక్కడ ఘన విజయాన్ని సాధించింది. మేము విమల్ థియేటర్ లో నిన్న సినిమా చూశాం. ఫోన్స్ కూడా పక్కన పెట్టి చూసేంత ఇంట్రెస్టింగ్ గా సినిమా ఉంది. తప్పకుండా తెలుగులోనూ “డీమాంటీ కాలనీ 2” సక్సెస్ అందుకుంటుంది. అన్నారు.

హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ మాట్లాడుతూ – “డీమాంటీ కాలనీ 2” మూవీకి తెలుగు ప్రొడ్యూసర్స్ నుంచి వస్తున్న సపోర్ట్ కు థ్యాంక్స్. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. మా సినిమా స్పెషల్ ప్రీమియర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ దగ్గర నుంచి వచ్చిన ఆదరణ సంతోషాన్నిస్తోంది. తమిళంలో మా మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో కూడా అలాంటి విజయాన్నే అందిస్తారని కోరుకుంటున్నాం. మీరు ఈ నెల 23న “డీమాంటీ కాలనీ 2” సినిమాను థియేటర్స్ కు వెళ్లి చూస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.

డైరెక్టర్ అజయ్ ఆర్ జ్ఞానముత్తు మాట్లాడుతూ – “డీమాంటీ కాలనీ 2” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన మీడియా మిత్రులకు, దర్శకులు ఆర్జీవీ, అజయ్ భూపతి గారికి మిగతా గెస్టులకు థ్యాంక్స్. ఈ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశాను. ఈ సినిమాను 2023 జనవరిలోనే కంప్లీట్ చేశాం. సినిమా ఫస్ట్ కాపీ చేతిలోకి వచ్చాకే బిజినెస్ డీల్స్ చేయాలని అనుకున్నాం. షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశాం. మా సినిమా కొనేందుకు ఫస్ట్ తెలుగు నుంచి అప్రోచ్ అయిన ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి గారు. ఆయన మా మూవీలోని ఒక్క సీన్ కూడా చూడకుండా సినిమా మీద నమ్మకంతో మూవీ తెలుగు రైట్స్ తీసుకున్నారు. “డీమాంటీ కాలనీ 2″కు మేము క్లోజ్ చేసిన ఫస్ట్ బిజినెస్ కూడా తెలుగు నుంచే. “డీమాంటీ కాలనీ 2” తమిళంలో మంచి హిట్ అయ్యింది. తెలుగు ఆడియెన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఈ మూవీకి 3, 4 పార్ట్స్ కూడా చేయబోతున్నాం. సెకండ్ పార్ట్ లోని ఆర్టిస్టులంతా థర్డ్ పార్ట్ లో కంటిన్యూ అవుతారు. ఇప్పటిదాకా ఏ హారర్ సినిమాలో బుద్ధిజం స్పిరిచువాలిటీ చూపించలేదు. మేము ఈ మూవీలో టిబెటియన్ యాక్టర్ ను పెట్టి ఆ ప్రయత్నం చేశాం. అన్నారు.

డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ – నేను దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

19 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago