“దీవాన” సరికొత్త ప్రేమ కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “దీవాన”. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. “దీవాన” సినిమా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి మూవీ హైలైట్స్ తెలిపారు.

• పదేళ్ల కిందట వచ్చిన ప్రయోగాత్మక చిత్రం మిణుగురులు చిత్రానికి అసిస్టెంట్ గా పనిచేశా. ఆ చిత్రానికి నంది అవార్డు కూడా వచ్చింది. ఆస్కార్ లైబ్రరీలో ఆ స్క్రిప్ట్ భద్రపరిచారు. పదేళ్లకుపైగా ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. చిన్న చిన్న డెమో ఫిల్మ్స్, సాంగ్స్, షార్ట్స్ ఫిల్మ్స చేసేవాణ్ని. సినిమాలు, ఇంటర్వ్యూలు చూసి సినిమా గురించి నేర్చుకున్నా. షార్ట్స్, కలర్ ఫాలెట్ ఏవీ నేర్చుకోలేదు. సినిమా చూస్తూ సినిమాను ఎంజాయ్ చేసేవాణ్ని. సినిమా నచ్చకపోతే బాగా తిట్టేవాణ్ని. చెత్త రైటింగ్ కు అవకాశం వచ్చింది. నాకెందుకు అవకాశం రాలేదనుకునేవాణ్ని. ఒక రకమైన ప్రస్టేషన్ ఉండేది. నా కథలన్నీ గొప్పగా ఉంటాయి. వాటన్నింటిని తెరపై చూడాలని ఉండేది. చూసినవాళ్లంతా ఎవర్రా ఈ సినిమా తీసిందని గొప్పగా మాట్లాడుకోవాలి. అదే నా మైండ్ లో రన్ అవుతూ ఉండేది. నేను 10 గంటలు కూర్చొని ఉద్యోగం చేస్తున్నప్పుడల్లా నా మైండ్ లో మొత్తం సినిమానే రన్ అవుతూ ఉండేది. జాబ్ లో ప్రమోషన్స్ కూడా వద్దనుకునేవాణ్ని. ఎందుకంటే ఆ పని నాకు నచ్చేది కాదు. నాకు మ్యాథ్స్ రాదు, సాప్ట్ వేర్ రాదు. ఎక్సెల్ రాదు, నాకు వచ్చింది కలలు కనడం. ఎన్నేళ్లైనా కూడా నాకు ఇప్పుడే పుట్టిన కలగా ఉండేది. ఉద్యోగం చేసేటప్పుడు 2019 డిసెంబర్ లో ఒక ఆలోచన వచ్చింది. ఇన్వెస్టిగేషన్ డ్రామా అది. అయితే జాబ్, సినిమా రెండు ఛాలెంజ్. జాబ్ లో ఏంట్రీ లెవల్ లోనే ఉండేవాణ్ని. సినిమా కోసం ఒకసారి జాబ్ మానేసి నా భార్యను బాగా కష్టపెట్టా. ఆ తర్వాత అర్థమైంది జాబ్ మానేయడం ఇంపాజిబబుల్ అనుకున్నా. కొవిడ్ సమయంలో మా నాన్న అనారోగ్యం వల్ల ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఓటీటీకి సూట్ అయ్యే కథతో తిరుగుతుండేవాణ్ని.

• దివాన కథ జెమిని టీవీలో ఓ యాంకర్ ను చూసి రాసుకున్నా. ఆమె రోజూ టీవీలో వచ్చేంది. ఎంబీఏ పూర్తి చేశాక జాబ్ కోసం ప్రయత్నించకుండా సినిమా కోసం ఆగిపోయా. పొద్దున లేస్తే టీవీ చూస్తుండగా యాంకర్ కనిపించింది. వెళ్లి ఆ అమ్మాయిని కలిస్తే ఎట్లుండది, కలిస్తే ఏమవ్వొచ్చు, గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి కలిస్తే ఏం జరుగుతుందనే ఆలోచన తట్టింది. దీంట్లో ఏమోషనల్ ప్లస్ కమర్షియల్ కథ ఉంది. ఇది రాయాలని అనుకున్నా.

• నా దగ్గర ఏదీ ఉంటే దానిపై కథగా రాసుకునేవాణ్ని. నాకొచ్చి ఆలోచన మరిచిపోకముందే దాన్ని రాసుకోవాలనిపించేది. పేపర్ దొరక్కపోతే అగ్గిపెట్టే ముక్కపై కూడా రాసుకున్నా. ఒకసారి కథ పూర్తిగా వచ్చాక సిస్టమ్ పై కూర్చొని ఆ కథలోని పాత్రల గురించి రాసుకునేవాణ్ని. దాదాపు ఆరేడు నెలలు పట్టేది. అట్ల ఈ కథ 10 డ్రాప్ట్స్ వరకు రాశాను. మొదటి డ్రాప్ట్స్ 12 ఏళ్ల కిందటే రాశాను.

• పెద్ద నిర్మాతలను కలిసే అవకాశం దొరకలేదు. చిన్న నిర్మాతలను కలిసి కథ చెప్పినప్పుడు వాళ్లేదో చెప్పేవాళ్లు. వాళ్లు మార్కెట్ లో ఉన్న నిర్మాతలు. నేనేమో ఇంట్లో ఉండేవాణ్ని. వాళ్ల ఇన్ పుట్స్ తో కూడా మరింత డెవలప్ చేసేవాణ్ని. ఎవరికి కథ చెప్పినా ఆ మార్పులతో మరింత డెవలప్ చేసేవాణ్ని. రెండేళ్లలో టోటల్ గా కథ మొత్తం సెట్ అయిపోయింది.

• రవీంద్రనాథ్ ఠాగూర్, ఆంటోన్ చెకావో రాసిన షార్ట్స్ స్టోరీల్లో కూడా ఇలాంటి లైన్స్ ఉంటాయి. దూరదర్శన్ లో కథా సాగర్ లో కూడా అద్భుతమైన కథలు వచ్చేవి. నా వెర్షన్ అయితే రాలేదు. నేను రాసిన కథను పెద్ద కమర్షియల్ సినిమా చేయవచ్చని ఎవరూ ఊహించరు. అది నాకే తెలుసు. దాంట్లో ఏమోషనల్ ఈజ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ ఆస్పెక్ట్. అంత ఏమోషన్ ఉంది. ఆ ఎమోషన్ చుట్టూ ఎంటర్ టైన్ మెంట్ ఉంది. నా కథలో హీరోది వన్ సైడ్ లవ్వే. ఎక్స్టోవర్ట్ గా హీరోయిన్ వెనుకపడుతుంటాడు. సెకండాప్ లో వన్ సైడ్ లవ్వే ఉంటుంది కానీ వెనుకపడేది ఉండదు.

• నా ఫ్రెండ్స్ తో కలిసి అవకాశాల కోసం తిరిగేవాణ్ని. కొన్నాళ్ల తర్వాత ఎవరూ లేరు. నేను ఒక్కణ్నే మిగిలా. ఓ రోజు రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. అల్లు అరవింద్ గారు, సత్యనంద్ గారు ఉన్నారు. అప్పుడు నా కాలేజిలో అనుభవించిదంతా కథగా రాసుకున్నా. వాళ్లిద్దరు మాట్లాడుతుంటే వెళ్లి మీకు కథ చెప్పాలి సర్ అని అడిగా. వాళ్లు షాక్ అయ్యారు. గీతా ఆర్ట్స్ కు రాసా. కథ బాగుంటే సినిమా అవుతుంది. కథ బాగాలేకపోతే టీయో కాఫీయో వేస్ట్ అవుతదన్నారు. ఆఫీసుకు వెళ్తే నన్ను లోపలికి కూడా రానివ్వలేదు. లోపల సర్ ఉన్నారో లేరో కూడా తెలియదు. కానీ ఎట్టకేలకు అల్లు అరవింద్ సర్ ముందు కాఫీ తాగటానికి 20 ఏళ్లు పట్టింది. కథ నచ్చింది. కాఫీ వేస్ట్ కాలేదు. కాలేజీ కథ కాదు. దివాన కథ చెప్పాను.

• సినిమాలో ఆరు పాటలుంటాయి. మూడు ఫైట్లు ఉంటాయి. మీరు ఎంతైనా బడ్జెట్ ఇవ్వండి అన్నీ చేస్తా అని చెప్పా. నేను డెమో చేస్తే సినిమా కన్నా బాగుంటుంది. 5 వేల రూపాయలతో డెమో తీశా. 69 రోజుల్లో తీయాల్సింద కథ అని చెప్పగానే 30 రోజుల్లో తీయమని చెప్పారు. ఇంత కథను 30 రోజుల్లో తీయమంటున్నరు. ఎలా రా అని మా ఫ్రెండ్స్ ను అడిగా. ముందైతే సినిమా మొదలుపెడుతాం అన్నారు. 42 రోజులు అయ్యింది. ఇంకా ఐదారోజుల కంటెంట్ తీయలేదు. అంత కంటెంట్ ను వదులుకోవడం ఛాలెంజ్ గా అనిపించినా రైటింగ్ పవర్, నటీనటుల వల్ల బాగా తీయగలిగాను.
• ఒక నిర్మాత కోటి రూపాయల్లో తీద్దామని చెప్పారు. ఆ నిర్మాతకు హర్షిత్ రెడ్డి పరిచయం. అప్పటికి మెయిల్ రాలేదు. మెయిల్ డైరెక్టర్ ఉదయ్ నా ఫ్రెండ్. తనతో చెప్పించా. పైనల్ గా హర్షిత్ వచ్చి కథ విన్నడు. ఇది కొంచెం 90నాటి లవ్ స్టోరీలా అనిపిస్తుంది. నేను ఎలా ఉంటనో అలానే తీశా. ప్రతి మనిషిని టార్గెట్ చేసి తీసిన సినిమా దివాన. లవ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎమోషన్స్ బాగా నచ్చుతాయి.

• సినిమా వచ్చిందో లేదో తెలియడం కన్నా…నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వస్తున్నాయా అని చూస్తుంటా. ఏవరన్నా రియాక్ట్ అవుతున్నారా లేదో చూస్తా. నా సినిమా చూసి తిట్టుకున్నా హ్యాపీ. వాళ్ల రియాక్షన్ నాకు ఇంపార్టెంట్. ఫేక్ కామెంట్స్ చూస్తే చాలా కోపం వస్తుంది.

• సినిమా ఇండస్ట్రీ చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు, రైటర్లు డైరెక్టర్ల కంటే టాలెంట్ గా ఉంటారు. మనమే టాలెంట్ అనుకుంటే వాళ్లు మనకంటే జీనియస్. తరుణ్ భాస్కర్, త్రివిక్రమ్ లాంటి వాళ్లు. మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ నేను కలిసి సినిమాలకు వెళ్లేవాళ్లం. ఈశ్వర్ సొంతగా నేర్చుకునేవాడు. నా కథలు ఈశ్వర్ కు చెప్పేవాణ్ని. అరవింద్ సర్ ఒకే అన్నాక అప్పుడు చెప్పా. బాగా రాశావు అన్నాడు. డెమో కోసం మ్యూజిక్ చేయిస్తే చెత్తగా చేశాడు. తిట్టా. ఒకసారి పక్కకు వెళ్లని చెప్పి మళ్లీ మ్యూజిక్ కొట్టాడు. అద్భుతంగా వచ్చింది. అరవింద్ సర్ టీమ్ కూడా బాగా నచ్చింది. కాపీ కొట్టాడా, ఇన్సిపిరేషన్ అనేది వాళ్లకు తెలియదు కదా. మన బడ్జెట్ లో డెమోకు మనోడు తప్ప ఇంకా ఎవరు రారు. ఇక సినిమాకు పాటలు చేయడం మొదలుపెట్టాం. చాలా రోజుల తర్వాత ఈశ్వర్ పాటలను ఒకే చేశారు.

• తీయడానికి మన టాలెంట్ సరిపోతుందా అనే కథలున్నాయి నా దగ్గర. టెక్నికల్ గా, ప్యూచరిస్ట్ గా ఉంటాయి. కొన్ని సినిమాలు చేస్తూ ఆ టాలెంట్ ను సంపాదించుకోవాలి. అప్పుడే అవి తెరపైకి వస్తాయి.

TFJA

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

4 days ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

5 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

2 weeks ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

2 weeks ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

2 weeks ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

2 weeks ago