నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12నుంచి ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ టీం ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది.
ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్ లో ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి మరోసారి థాంక్ యూ సో మచ్. నా ఇండస్ట్రీ జర్నీ ఈటీవీ డీ జూనియర్స్ షో తో స్టార్ట్ చేశాను. నన్ను ఆడియన్స్ కి పరిచయం చేసిన ఈటీవీకి థాంక్ యూ సో మచ్. ఈటీవిలో వచ్చే కంటెంట్ మీ మా మన అనుకునేలా వుంటుంది.’కమిటీ కుర్రోళ్ళు’ అలాంటి సినిమానే. మీ సినిమాలా అనుకొని తీశాం. ఈ సినిమా ఈటీవీలో రావడం మేము తీసుకున్న బెస్ట్ డెసిషన్. సెప్టెంబర్ 12న ఈటీవి విన్ లో మా ‘కమిటీ కుర్రోళ్ళు’ రీరిలీజ్ అవుతుంది. థియేటర్ లో ఎలా అయితే పండగ, జాతరలా ఎంజాయ్ చేశారో, ఈటీవీ విన్ లో కూడా చూసి అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.
డైరెక్టర్ యదు వంశీ మాట్లాడుతూ..‘కమిటీ కుర్రోళ్ళు’ని ప్రేక్షకులు వోన్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. మీ అందరికీ రుణపడి వుంటాను. ఈ సినిమాలో నటించిన అందరూ గొప్ప నటులుగా కెరీర్ లో ముందుకు వెళ్తారు. ఈ అవకాశం ఇచ్చిన నిహారిక గారికి, రమేష్ గారికి ధన్యవాదాలు. ఒక మెమరనీ బంధించి , అందరి బయోపిక్ గా సినిమాని మీ ముందుపెట్టాం. ఈ సినిమా ఈటీవి విన్ లో రావడం చాలా ఆనందంగా వుంది. ఇది పక్కా తెలుగు సినిమా. ఇలాంటి సినిమా ఈటీవీ విన్ లో వుండాలి. ఈ సినిమాని ప్రోత్సహించి నిహారిక గారికి, ఈటీవి విన్ కి ధన్యవాదాలు. 12న ఈ సినిమా ఈటీవీ విన్ లో వస్తుంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలి’ అని కోరారు.
‘కమిటీ కుర్రోళ్ళు’ గా నటించిన యాక్టర్స్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా విడుదలై నెల రోజులౌతుంది. కానీ ఈ రోజే రిలీజైన ఫీలింగ్ వుంది. చూసిన ప్రతి ఒక్కరి నుంచి ప్రసంశలు అందుతూనే వున్నాయి. మంచి కంటెంట్ ఇస్తే కొత్త పాత చూడకుండా థియేటర్స్ కి వచ్చి హిట్ చేస్తారని మా తెలుగు ఆడియన్స్ మరోసారి ప్రూవ్ చేశారు. మాకు ఒక గుర్తింపు ఇచ్చారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మంచి కంటెంట్ వున్న సినిమాలు చేస్తాం. మా సినిమా ఈటీవీ విన్ లో రావడం చాలా ఆనందంగా వుంది. సెప్టెంబర్ 12న ఈ సినిమా ఈటీవీ విన్ లో వస్తుంది. అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి’ అని కోరారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ మాట్లాడుతూ.. ఈటీవిన్ లో మా సినిమా రావడం చాలా ఆనందంగా వుంది. మయూరీ, మౌనరాగం లాంటి కంటెంట్ వుండే సినిమాలు తీసే సంస్థలో మా సినిమా రావడం గౌరవంగా వుంది. ఈటీవి విన్ ద్వారా ఈ సినిమా మ్యాగ్జిమమ్ ఆడియన్స్ కి చేరుతౌతుందని కోరుకుంటున్నాం’ అన్నారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ.. కమిటీ కుర్రోళ్ళు టీం కి థాంక్ యూ. చాలా బ్యూటీఫుల్ గా తీశారు. వంశీ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. ఈ సినిమాని ఈటీవీ విన్ కి ఇచ్చిన నిహారిక గారికి ధన్యవాదాలు. ఈ రోజుల్లో సినిమాలకి థియేటర్, ఓటీటీ రిలీజుకు ఉంటున్నాయి. థియేటర్ రిలీజ్ కంటే ఎక్కువ రెస్పాన్స్ ఓటీటీ రిలీజ్ తర్వాత వుంటుంది నమ్ముతున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ బ్రైట్ ఫ్యూచర్ వుండాలని కోరుకుంటున్నాను’ అన్నారు. సినిమా యూనిట్ సభ్యులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.
సీజన్ 1, సీజన్ 2లతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి భారీ విజయాలు సాధించిన అతి పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనింగ్…
నందు, అవికా గోర్ జంటగా నటిస్తూ నిన్న ప్రేక్షకుల ముందుకువచ్చిన 'అగ్లీ స్టోరీ' చిత్రానికి వచ్చిన అనూష స్పందనకు ఈ…
ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్,…
సినీ కార్మికులకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు. చిత్రపురి కాలనీకి కోట్లాది రూపాయల…
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా…
రాకింగ్ మంచు మనోజ్ స్టైలిష్ కమ్బ్యాక్కు రంగం సిద్దమైంది. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 'వడ్డీ కాసుల…