రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “చిట్టి పొట్టి”. ఈ చిత్రాన్ని భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కిన “చిట్టి పొట్టి” సినిమా ఈనెల 3వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. “చిట్టి పొట్టి” సినిమా చూసిన సెన్సార్ బృందం సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాలోని అన్నా చెల్లి అనుబంధాలు, కుటుంబ భావోద్వేగాలు తమను కదిలించాయంటూ ఉద్వేగానికి గురయ్యారు సెన్సార్ సభ్యులు. “చిట్టి పొట్టి” సినిమా టీమ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మంచి సకుటుంబ చిత్రం రాలేదని సెన్సారు వారు చెప్పడం విశేషం.
చిరకాలం తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా అన్నా, చెల్లి అనుబంధం నేపథ్యంలో మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ “చిట్టి పొట్టి” సినిమాను రూపొందించారు. కుటుంబ విలువలు, మన కుటుంబ వ్యవస్థ గొప్పదనం చెప్పేలా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల రివార్డ్స్ తో పాటు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డ్ లు గెల్చుకుంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. సినిమా విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు “చిట్టి పొట్టి” సినిమా టీమ్.
నటీనటులు – రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి, కాంతమ్మ, ఆచారి, హర్ష, సతీష్, రామకృష్ణ, సరళ, తదితరులు
టెక్నికల్ టీమ్
బ్యానర్ – భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా
ఎడిటర్ – బాలకృష్ణ బోయ
మ్యూజిక్ – శ్రీ వెంకట్
సినిమాటోగ్రఫీ – మల్హర్ భట్ జోషి
పీఆర్ఓ – లక్ష్మీ నివాస్
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం – భాస్కర్ యాదవ్ దాసరి
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…