చిత్రాల‌యం స్టూడియోస్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’… శ‌ర‌వేగంగా మేఘాల‌య‌లో షూటింగ్‌!

Must Read

ప్ర‌ముఖ నిర్మాత వేణు దోనేపూడి చిత్రాల‌యం స్టూడియోస్ తెర‌కెక్కిస్తున్న ట్రెండీ క్రైమ్ కామెడీ సినిమా ‘బా బా బ్లాక్ షీప్‌’. ప్ర‌స్తుతం మేఘాల‌య‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అక్టోబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. టిన్ను ఆనంద్‌, ఉపేంద్ర లిమ‌యే, జార్జ్ మ‌రియ‌న్‌, రాజా ర‌వీంద్ర‌, అక్ష‌య్ ల‌ఘుసాని, విష్ణు ఓ అయ్‌, కార్తికేయ దేవ్‌, క‌శ్య‌ప్‌, విస్మ‌య‌, మాల్వి మ‌ల్హోత్రా, స‌మృద్ధి ఆర్య‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

మేఘాల‌య‌లో సంపూర్ణంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న తొలి సినిమా బా బా బ్లాక్ షీప్‌ కావ‌డం గ‌మ‌నార్హం. ఒక రోజులో జ‌రిగే క‌థ‌తో తెర‌కెక్కుతోందీ సినిమా. ఆరుగురి మ‌ధ్య సాగే ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఇది. గ‌న్స్, గోల్డ్, హంట్ అంటూ ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. బా బా బ్లాక్ షీప్‌ గురించి వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘‘మా బా బా బ్లాక్‌షీప్ మేఘాల‌యాలో పూర్తి స్థాయిలో షూటింగ్ చేసుకుంటున్న తొలి చిత్రం. క‌థ మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియాలో సాగుతుంది కాబ‌ట్టి, ఇక్క‌డే చిత్రీక‌రిస్తున్నాం. క‌థ‌లోనే ఓ బ్యూటీ ఉంటుంది. జ‌ల‌పాతాలు, కొండ‌లు, అంద‌మైన ప్ర‌దేశాల్లో సాగే క‌థ ఇది. ఎన్నో చోట్ల రెక్కీ చేసి, మా క‌థ‌కు మేఘాల‌యా ప‌ర్ఫెక్ట్ గా సూట్ అవుతుంద‌ని ఇక్క‌డ ఫిక్స్ అయ్యాం’’ అని అన్నారు.

ఎప్పుడూ వ‌ర్షం కురుస్తూ ఉండే సోహ్రా (చిరపుంజి)లో ‘బా బా బ్లాక్ షీప్‌’ని తెర‌కెక్కిస్తున్నారు. ఎల్ల‌వేళ‌లా వ‌ర్షం పడుతూ ఉన్న చోట షూటింగ్ చేయ‌డం ఇబ్బందితో కూడిన వ్య‌వ‌హారం కాదా? ఇదే విష‌యం గురించి వేణు మాట్లాడుతూ ‘‘చాలా క‌ష్ట‌మైన వ్య‌వ‌హారం. అతి త‌క్కువ సంద‌ర్భాల్లో మాత్ర‌మే మ‌న‌కు కావాల్సిన లైటింగ్ ఉంటుంది. కానీ, అన్నిటినీ అధిగ‌మించి మా టీమ్ ఎంతో కృషి చేస్తున్నారు. త‌ప్ప‌కుండా మ‌న ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేసే సినిమా అవుతుంది’’ అని అన్నారు.

స‌మిష్టి కృషిని, స‌మైక్య‌త‌ను విశ్వ‌సించే చిత్రాల‌యం స్టూడియోస్‌, ‘బా బా బ్లాక్ షీప్‌’ కోసం మేఘాల‌య ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేస్తోంది. మేఘాల‌య ఛీఫ్ మినిస్ట‌ర్ మిస్ట‌ర్ క‌న్రాడ్ కె సంగ్మా ఇటీవ‌ల సినిమా యూనిట్‌ని క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. మేఘాల‌య‌లో షూటింగ్ కోసం త‌మ వంతు సంపూర్ణ స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని తెలిపారు.

అద్భుత‌మైన పాయింట్‌, ఎలాగైనా స‌క్సెస్ సాధించాల‌నే యూనిట్ ప‌ట్టుద‌ల‌, ఎక్స్ ట్రార్డిన‌రీ విజువ‌ల్స్… అన్నీ క‌లిసి బా బా బ్లాక్ షీప్‌ని ఆడియ‌న్స్ ముందు మంచి సినిమాగా నిల‌ప‌నున్నాయి. ప్ర‌తిభావంతుల‌ను ప్రోత్స‌హించ‌డంలో ఎప్పుడూ ముందుండే చిత్రాల‌యం స్టూడియోస్ ఈ సారి కొత్త ద‌ర్శ‌కుడు గుణి మాచికంటిని ఈ సినిమాతో ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. సినిమాను రికార్డ్ టైమ్‌లో పూర్తి చేసి, అత్య‌ధిక మంది ప్రేక్ష‌కుల‌కు ప్రేమ‌తో అందించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేస్తోంది మూవీ యూనిట్‌.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News