“చమన్” (ఎడారి లో పుష్పం) టైటిల్ లాంచ్

దివంగత “శ్రీ చమన్ సాబ్ గారు” ఆయన జీవిత చరిత్రను అభిమానుల కోరిక మీద, సినిమాగా తీయాలనుకోవటం జరిగింది. ఆయన బ్రతికున్న రోజుల్లోనే సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయడం జరిగింది. విధివశాత్తు “శ్రీ చమన్ గారు” కాలం చేయడంతో అయన మిత్రుడిగా ఆయన మీద అభిమానంతో సినిమాను రూపొందించాలనుకున్నాను. కరోనా కారణంగా ఇన్ని రోజులు ఆలస్యం అయ్యింది. అన్ని కుదుట పడడటంతో ముఖ్యంగా ఈ రోజు “శ్రీ చమన్” గారి కుమారుడైన “ఉమర్ ముక్తర్” కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ మహనీయుడి జీవితం ఆదర్శప్రాయమైన ఆయన వ్యక్తిత్వం నేటి యువతకు తెలియ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాని ఆ మహనీయుడికి ఘనమైన నివాళిని తెలియ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము.శ్రీ చమన్ గారు దర్శకత్వ బాధ్యతల్ని “వెంకట్ సన్నిధి” చేత చేయించాలని భావించారు. ఆయనకు మాట ఇవ్వటంతో “వెంకట్ సన్నిధి” దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ “జి.వి. 9 ఎంటర్టైన్మెంట్” సంస్థ ద్వారా జివి చౌదరి గారు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం పేరు “చమన్” గా ఖరారు చేసారు. “సి రామ్ ప్రసాద్” డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పని చేస్తున్నారు. త్వరలోనే సినిమా సాకేంతిక నిపుణులు, పూర్తి తారాగణం వెల్లడిస్తాం.జి.వి. చౌదరి ప్రొడ్యూజర్ మాట్లాడుతూ: నేను ఎంతగానో అభిమానించే వ్యక్తి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ “దూదేకుల చమన్‌ సాబ్”. అయ్యన కుమారుడు “ఉమర్‌ ముక్తర్‌” బర్త్ డే కానుకగా, జి.వి. 9 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో పాటు మూవీ టైటిల్ అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ బ్యానర్ లో ఫస్ట్ మూవీ గా తెరకెక్కుతున్న “శ్రీ చమన్” గారి బయోపిక్ సినిమా కి, “సి రామ్ ప్రసాద్” డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ చేయడం మాకు చాలా హ్యాపీ గా ఉంది. అదే విధంగా “వెంకట్ సన్నిధి” దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ, యుంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మా సినిమా టైటిల్ పేరు “చమన్” (ఎడారి లో పుష్పం) ఈ సినిమా అందరిని అలరించబోతుంది. త్వరలోనే అక్టోబర్ లో కాస్టింగ్ వివరాలు వెల్లడిస్తాము. నేను ఎన్నో సంవత్సరాలు నుంచి ఇండస్ట్రీ లో పని చేస్తూ బాగా ఇష్టపడే వ్యక్తుల్లో బాలయ్య బాబు ఒకరు.

వెంకట్ సన్నిధి డైరెక్టర్ మాట్లాడుతూ: ఒక మహనీయుడి జీవిత చరిత్ర మీద నేను డైరెక్ట్ చెయ్యబోతున్నందుకు నా అదృష్టం గా భావిస్తున్నాను. నేను ఇండస్ట్రీ లో ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తూ వచ్చాను కానీ, గత 14 సంవత్సరాలు గా నేను సినిమాలకి దూరంగా ఉన్నాను, కేవలం సినిమాలకి డైరెక్ట్ చేద్దామనే ఇష్టంతో, ఇప్పుడు నాకు ఈ సినిమాతో అవకాశం దక్కింది.శ్రీ చమన్‌ సాబ్ గురించి చెప్పాలి అంటే తన కుటుంభ భవిషత్తు అన్నింటిని ఫలంగా పెట్టి ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆయన జీవిత కథ ఆధారంగా కమర్షియల్ హంగులతో పాటు నిజాన్ని నిక్కచ్చిగా తెర మీద చూపించబోతున్నాం. ఆయన గురించి ఈ తరం యువత కి తేలియాలిసిన కధ ఇది. టెన్త్ క్ల్యాస్ కూడ పాస్ కానీ ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు పడి చిన్న స్థాయి నుంచి ఇండియా లోనే బెస్ట్ జెడ్పీ చైర్మన్‌గా అవార్డు రావడం గొప్ప విషయం. అంతే కాదు, కుల మత బేధాలు లేకుండా అందరిని సమానంగా చూసే ఏకైక వ్యక్తి శ్రీ చమన్ గారు. అనంతపురం ఒక ఎడారి లాంటి జిల్లా ని మెరుగైన స్థాయి కి తీసుకురావడంతో ఈ సినిమాకి “చమన్” (ఎడారి లో పుష్పం) అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా ఎవ్వరిని కించపరచని విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రొడ్యూజర్ గారితో ఎంతో అనుబంధం ఉంది. అలాగే, సి రామ్ ప్రసాద్” మా సినిమా కి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పని చేయడం మా అదృష్టం. ఇండియా లో డీఓపీ గా గొప్ప స్థాయి కి వెళ్తారని బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమా కి అయ్యన అన్ని ముందుండి మామ్మలందరిని సక్సెస్ బాటలో నడిపిస్తారని కోరుకుంటున్నాను.

“సి రామ్ ప్రసాద్” డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ మాట్లాడుతూ: డైరెక్టర్ వెంకట్ సన్నిధి నా చిరకాల మిత్రుడు, కథ చెప్పినప్పుడు నేను బాగా ఎక్సయిట్ అయ్యాను. ఈ సినిమా ఎవ్వరిని కించపరిచే విధంగా ఉండదని ప్రేక్షకుల అందరిని అలరించే విధంగా ఉంటుందని తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమా ప్రొడ్యూసర్ జి.వి. చౌదరి గారిని కలిసింది ఒక్కసారే అయ్యిన, ఆయన ఎంతో ప్యాషినేటెడ్ గా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి తో నేను కోలాబ్రేట్ అవ్వడం చాలా హ్యాపీ గా ఉంది.మోహిత్ రెహమాన్య మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ: నేను ఏ.ఆర్. రెహమాన్ శిష్యుణ్ణి అయ్యనంటే నాకెంతో గౌరవం. ఈ సినిమాకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం ప్రొడ్యూజర్ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాకి వర్క్ చెయ్యబోతున్నందుకు నాకు చాలా హ్యాపీ గా ఉంది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

12 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago