ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక నటుడుగా నిలదొక్కుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ఎంతోమంది నటులు తమకున్న టాలెంట్ ప్రూవ్ చేసుకొని ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు.
ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో రాగ్ మయూర్ ఒకరు. “సినిమా బండి” సినిమా తోనే విలక్షణమైన హీరోగా మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. అద్భుతమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోకుండా నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ కెరియర్ లో ఆచితూచి ముందడుగు వేస్తున్నాడు. తను ఏ పాత్ర చేసిన చాలా సహజంగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
“సినిమా బండి” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు ఆ సినిమాను తీసిన విధానం, ఆ సినిమాలో నటులు ఒదిగిపోయిన తీరు ప్రతి ప్రేక్షకుడిని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో మరిడేష్ బాబు అనే పాత్రలో కనిపించిన రాగ్ మాయూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక పాత్రలో నటించడం వేరు, ఆ పాత్రలా ప్రవర్తించడం వేరు. మరిడేష్ బాబు పాత్రలో రాగ్ మయూర్ ర్ నటించాడు అనేకంటే ప్రవర్తించాడు అని చెప్పాలి. ఆ సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో పాటు వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి.
అయితే తాను ఏ పాత్ర చేసిన ఒక ప్రత్యేకత ఉంటుందని ఇప్పటివరకు రాగ్ మయూర్ చేసిన సినిమాలను బట్టి చెప్పొచ్చు. ప్రతి పాత్ర దేనికది ప్రత్యేకం. సినిమా బండి తర్వాత మంచి గుర్తింపు తీసుకువచ్చిన సినిమా కీడాకోలా. ఈ సినిమాలో లంచం అనే పాత్రలో కనిపించి ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. సినిమా బండి సినిమాలో రాయలసీమ యాసను మాట్లాడటమే కాకుండా, కీడాకోలా సినిమాలో తెలంగాణ యాసను కూడా అద్భుతంగా మాట్లాడి ఆడియన్స్ ను సప్రైజ్ చేశాడు. అలానే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన “వీరాంజనేయులు విహారయాత్ర” సినిమా కూడా మంచి పేరును తీసుకొచ్చింది.
రీసెంట్ గా పంచాయత్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన సివరపల్లి వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాలో శ్యామ్ అనే పాత్రలో కనిపించాడు రాగ్ మయూర్. ఇంజనీరింగ్ చదువుకొని అమెరికా వెళ్లాలి అనుకునే ఒక కుర్రోడు సివరిపల్లి అనే ఒక ఊరికి పంచాయతీ సెక్రటరీగా వెళ్లడం, అక్కడ జరిగే కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా, సహజంగా అనిపిస్తాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో రాగ్ మయూర్ నటించిన విధానం వర్ణనాతీతం అని చెప్పాలి. అందుకే ఈ వెబ్ సిరీస్ చాలామందికి విపరీతంగా నచ్చింది. ఈ వెబ్ సిరీస్ దాదాపు రెండు వారాలు పాటు ట్రెండింగ్ సెకండ్ ప్లేస్ లో ఉండటం అనేది మామూలు విషయం కాదు. సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకి అనేక ప్రశంసలు వస్తున్నాయి. ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరు తమ జన్యున్ ఒపీనియన్ ను సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. సుకుమార్ కూతురు సుకృతి నటించిన గాంధీ తాత చెట్టు సినిమాకు కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు రాగ్ మయూర్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ఒకే రోజు రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన సినిమాలు రిలీజ్ అవ్వడం కూడా రాగ్ కెరియర్ లో ఒక అరుదైన అంశం.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఫహద్ ఫాజిల్, రాజ్ కుమార్ రావ్ వంటి ప్రత్యేకమైన నటులులా రాగ్ మయూర్ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజేంద్రప్రసాద్ అప్పట్లో కొన్ని అద్భుతమైన సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ ఒక పంథాను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుత కాలంలో అటువంటి సినిమాలు చేసే దర్శకులు నటులు అరుదుగా ఉన్నారు. ఈ జనరేషన్ లో అలా సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న హీరో రాగ్ మయూర్. ప్రస్తుతం రాగ్ మయూర్ గరివిడి లక్ష్మి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసను రాగ్ మయూర్ మాట్లాడబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా కూడా రాగ్ కెరియర్ కు ప్లస్ కాబోతోంది.
రాగ్ మయూర్ ఒక సినిమా చేస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది అని ఒక స్థాయి నమ్మకం చాలా మంది ప్రేక్షకులకు వచ్చేసింది.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…