ముంబై కి చెందిన ప్రముఖ ఫ్యాషన్ రంగ మోడల్.. బెవిలిన్ భరాజ్ తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. తన క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ తెలియజేయడానికి ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఆమె. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు బెవిలిన్ భరాజ్ సమాధానాలు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ “ఫ్యాషన్ మోడలింగ్ లో అక్కడ నాకు మంచి పేరు, ఒక స్టార్ డం ఉంది. మాది ముంబైలో వ్యాపార కుటుంబం. సోలార్ ఎనర్జీ బిజినెస్ లో ఉన్నాము.
“రే ఫోర్స్ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్” కంపెనీ నిర్వహిస్తున్నాము. నేను ఈ సంస్థలో డైరెక్టర్ గా పని చేస్తున్నాను. మా సంస్థ సోలార్ ఎనర్జీని తయారు చేస్తుంది.
ఫ్యాషన్ మోడలింగ్ లో అడుగుపెట్టి మంచి విజయం సాధించాను. ఇంటర్నేషనల్ స్థాయి లో పాపులారిటీ సంపాదించాను. ఇప్పుడు సినిమాల్లో నటించడానికి కూడా మా పేరెంట్స్ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. నేను నటనలో, డాన్సులలో, ఫైట్స్ లో శిక్షణ పొందాను. సినిమాలు అంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. బాహుబలి, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలు తెలుగు సినిమాని జాతీయ స్థాయికి చేర్చాయి. ఫ్యాషన్ మోడలింగ్ లో ముంబైలో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్ రాలేకపోయాను. ఇప్పుడు సమయం కుదిరింది.
తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నాను. అందుకే హైదరాబాద్ వచ్చాను. పలువురు దర్శక నిర్మాతలను కలిశాను.. కలుస్తున్నాను. హీరోయిన్., నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్., యాక్షన్ హీరోయిన్… ఇలా ఏ పాత్ర ఇచ్చినా న్యాయం చేస్తాను. త్వరలోనే మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాను” అన్నారు బెవిలిన్ భరాజ్.
బాలీవుడ్ సినిమా రంగంలో మా బంధువులు, స్నేహితులు చాలామంది పెద్ద స్థాయిలో ఉన్నారు. అయితే వారిలో ఎవరి పేరు ఉపయోగించుకోకుండా స్వశక్తితో నా కెరీర్ ని నిర్మించుకోవాలి అనుకుంటున్నాను. అందుకే వారి పేర్లు చెప్పడం లేదు.. అన్నారు బెవిలిన్.
హాలీవుడ్ హీరోయిన్ లాగా కనిపించడం ఈ నటి ప్రత్యేకత.
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…