శంకర్ చేగూరి దర్శకత్వంలో బి బాలకృష్ణ, రమా శంకర్ నిర్మించిన తాజా చిత్రం బద్మాషులు. ఈ చిత్రంలో మహేష్ చింతల, విద్యాసాగర్, బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, కవితా శ్రీరంగం, దీక్ష కోటేశ్వర్ కీలకపాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన బద్మాషులు చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వినోదం అందించే సన్నివేశాలు, మంచి కామెడీ తో ట్రైలర్ బాగా వైరల్ అయింది. ఈ చిత్రం జూన్ 6న రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకులు తరుణ్ భాస్కర్, మాలిక్ రామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. మహేష్ చింతలకి అవకాశం వచ్చినట్లే చిత్ర పరిశ్రమంలో ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఒక శుక్రవారం రోజు ప్రతి ఒక్కరు స్టార్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి కాస్త టైం పడుతుంది. బద్మాషులు చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ స్టార్లు కావాలని ఆశిస్తున్నా అని అన్నారు.
ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరైన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. చాలామంది కామెడీ ని చాలా తేలిగ్గా తీసిపారేస్తుంటారు. కానీ ఆ కామెడీ సన్నివేశాలు వెనుక ఎంత కష్టం, నిజాయితీ దాగుందనేది చూసే వాళ్లకి అర్థం కాదు. ఆ సీన్లు రాసిన వాళ్లకే తెలుస్తుంది. పెళ్లిచూపులు చిత్రంలో కామెడీ సన్నివేశాలు రాస్తున్నప్పుడు మా నాన్న ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉంది. చాలా టెన్షన్ పడుతూ రాత్రి వేళల్లో ఆ సన్నివేశాలు రాసాను. మన టాలెంట్ తో నిజాయితీగా ప్రయత్నిస్తే మన కష్టానికి వడ్డీతో సహా ప్రతిఫలం దక్కుతుంది. మా నాన్న కి కోపం వచ్చినప్పుడు నన్ను కామన్ గా తిట్టే పదం బద్మాష్. బద్మాషులు చిత్రం మంచి విజయం సాధించాలి. ఆరవ తేదీ ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూడండి అని తరుణ్ భాస్కర్ అన్నారు.
డైరెక్టర్ మాలిక్ రామ్ మాట్లాడుతూ.. టిల్లు స్క్వేర్ రాకముందు డిజె టిల్లు అనేది చిన్న చిత్రం. ఈ నగరానికి ఏమైంది చిత్రానికి ముందు పెళ్లి చూపులు అనేది ఒక స్మాల్ బడ్జెట్ మూవీ. ఈ రోజున విజయం సాధించే చిన్న బడ్జెట్ చిత్రాలే రేపు పెద్ద బడ్జెట్ చిత్రాలకు నాంది పలుకుతాయి. బద్మాషుల చిత్రం కూడా భవిష్యత్తులో ఒక పెద్ద చిత్రానికి నాంది పలకబోతోంది అని అనిపిస్తుంది. ఈ చిత్రం విజయం సాధించాలి అని మాలిక్ రామ్ అన్నారు.
బద్మాషులు చిత్ర డైరెక్టర్ శంకర్ చేకూరి మాట్లాడుతూ.. తరుణ్ భాస్కర్ అన్న ఈ చెత్త ఫ్రీ రిలీజ్ కి వచ్చి బద్మాష్ లో చిత్రాన్ని మరో స్థాయికి పెంచారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. బద్మాషులు మూవీ రెండు గంటల పాటు ఫన్ రైడ్ గా సాగుతుంది. హాస్యం అందిస్తూనే ఒక మంచి మెసేజ్ ఈ కథ ద్వారా అందించాం అని అన్నారు.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన మహేష్ చింతల మాట్లాడుతూ.. బద్మాషులు చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ మూవీ ద్వారా సహజసిద్ధమైన హాస్యాన్ని అందించాం. పెద్ద సినిమాలు సిటీ లాంటివి అయితే మా చిన్న సినిమాలు పల్లెటూరు లాంటివి. అప్పుడప్పుడు పల్లెటూర్లకు కూడా వెళుతూ ఉండాలి అని మహేష్ అన్నారు.
ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటించిన విద్యాసాగర్ మాట్లాడుతూ.. బద్మాషులు మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ చిత్రం థియేటర్స్ లో మంచి ఎక్స్పీరియన్స్ అందించాలని ఉద్దేశంతో డైరెక్టర్ గారు చాలా వర్క్ చేశారు. ఈ చిత్రంలో పాత్రలు మీరు ప్రతిరోజు చేస్తున్న మీ స్నేహితులు, బంధువుల తరహాలో సహజ సిద్ధంగా అనిపిస్తాయి అని అన్నారు.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…