వైవిధ్యమైన చిత్రాలకు, విభిన్నమైన కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవలోనే రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ. పవర్ఫుల్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన చివరి షెడ్యూల్తో ఈ చిత్రం షూటింగ్ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న అవికాగోర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో ఆమె లుక్ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా దర్శకుడు మట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ అద్భుతమైన పాయింట్తో రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ ఇది. విజువల్ వండర్లా, అద్బుతమైన గ్రాఫిక్స్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో కథానాయిక అవికాగోర్ సర పాత్రలో సాహసోపేతమైన పనులు చేసే శక్తివంతమైన అమ్మాయి పాత్రలో కనిపించనుంది. లక్ష్య సాధనలో ఆది పాత్రకు సపోర్ట్ చేస్తూ ఆయనకు తోడుగా నిలిచే పాత్ర. తప్పకుండా ఆమె కెరీర్లో ఈ పాత్ర , సినిమా మరిచిపోలేని చిత్రంగా నిలిచిపోతుంది. ఈ చిత్రంలో అవికాగోర్ తన నటనతో అందరి హృదయాలను హత్తకుంటుంది. ఇటీవల హైదరాబాద్లో ఈ చిత్రం కోసం ఎంతో రిచ్గా వేసిన ఓ సెట్లో చివరి షెడ్యూల్ను పూర్తిచేసాం. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు తన సంగీతంతో ప్రాణం పోసిన రవి బసూర్ ఈ చిత్రానికి స్టనింగ్ మ్యూజిక్ను అందిస్తున్నారు. ప్రస్తుతం అత్యున్నత సాంకేతిక నిపుణులతో నిర్మాణనంతర పనులు మొదలుకానున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఓ వండర్ఫుల్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ఆది కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుంది* అన్నారు.
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…
నిర్మాత గా ఒక చరిత్ర సృష్టించిన ఎం.ఎస్. రాజు , దర్శకునిగా ‘అగధ’ చిత్రాన్ని ఒక విజువల్ వండర్ గా…
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా రెయిన్బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
పీఆర్ఓగా, జర్నలిస్ట్గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్ తరిగోపులతో…
లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ సినిమా ఫస్ట్ లుక్…