స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా నేడు ఫిలింనగర్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ గారు, ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి మోహనకృష్ణ గారు, నందమూరి మోహన రూప గారు, నందమూరి సీమంతిని గారు, నందమూరి దీపిక, తుమ్మల ప్రసన్నకుమార్ గారు, పరుచూరి గోపాల కృష్ణ గారు, బాబు మోహన్ గారు, నిర్మాత భరద్వాజ్ గారు తదితరులు పాల్గొని పూలమాలలతో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాల కృష్ణ గారు మాట్లాడుతూ… “అందరి నమస్కారం. ఈరోజు తెలుగు జాతి మరువలేని రోజు, అన్నగారి పుట్టిన రోజు. తెలుగు జాతికి ప్రఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగు జాతికి ఒక వరం. ఆయన ఆశీస్సులు తెలుగు వారందరికీ ఎప్పుడు ఉంటాయని ఆశిస్తున్నాను” అన్నారు.
నందమూరి మోహన కృష్ణ గారు మాట్లాడుతూ… “తెలుగు జాతి ఆరాధ్య దైవం, మా నాన్నగారు ఎన్టీఆర్ గారి గురించి అందరూ చెబుతుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. సినీ రాజకీయ రంగాలలో ఆయన ప్రజలను మెప్పించిన వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలలో పేదవాళ్ల ఆఖరి తెలిసిన వ్యక్తి కాబట్టి ఎన్నో మార్పులు తీసుకొచ్చి పేదవారి దైవంగా ఆయన నిలిచారు. ఆడవారికి ప్రత్యేక హక్కులు అలాగే ఆస్తులలో వాటాలు ఉండాలని గుర్తించిన వ్యక్తి. ఇప్పుడు దేశం అంతటా మనం ఆ మార్పును చూస్తున్నాము. ఈ సందర్భంగా ఆయనను మరోసారి స్మరించుకుంటున్నాను. అమీర్పేటలో నూతన ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణను చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు” అన్నారు.
మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ గారు మాట్లాడుతూ… “ఈరోజు సారధి స్టూడియోస్ దగ్గర ఎన్టీఆర్ గారి విగ్రహం ప్రకారం నాకు చాలా ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. ఆయన పార్టీలో ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరారు. ఎంతమందికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారికి ప్రపంచమంతటా ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్” అన్నారు.
మాజీమంత్రి, నటుడు బాబు మోహన్ గారు మాట్లాడుతూ… “ఇక్కడికి విచ్చేసిన నందమూరి తారక రామారావు గారి అభిమానులకు, ఆయన కుటుంబ సభ్యులకు నమస్కారం. మా తల్లితండ్రులు అన్న గారి అభిమానులు. నా చిన్నప్పటి నుండి ఆయనను అభిమానిస్తూ వచ్చాను. రాజకీయం అంటే ఏంటో తెలియని నన్ను రాజకీయాలకు ఆహ్వానించి నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ప్రజల కోసం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న వ్యక్తి. ఆయన అడుగుజాడలలో నడిచాను, ఆయన ఎప్పటికీ మన మధ్యనే ఉన్నారు” అన్నారు.
“నందమూరి కుటుంబాన్ని అభిమానిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు. ఆయన సినీ రాజకీయ రంగాలలో అద్భుతంగా రాణించారు. ఆయన సమాజానికి ఎప్పుడూ ఈడెన్ మంచి చేయాలి అనుకునే వ్యక్తి. మన వంతు సాయం మనం చేయాలని చెప్తూ ఉండే వ్యక్తి” అన్నారు.
నందమూరి సీమంతిని గారు మాట్లాడుతూ… “ప్రజలంతా సమానం అంటూ ప్రజల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు” అన్నారు.
నందమూరి మోహన రూప గారు మాట్లాడుతూ… “మా తాత గారు, మా నాన్నమ్మ గారికి పాదాభివందనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతిని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి నందమూరి ఎన్టీఆర్ గారు. ఆయనను ఆరాధించని తెలుగువారు, పూజించని తెలుగువారు ఎవరు ఉండరు. ఎన్ని తరాలు మారిన ఒక్కరే ఎన్టీఆర్. రాష్ట్రంలో రాజకీయాలను ఒక మలుపు తిప్పిన వ్యక్తి ఆయన. రాష్ట్రానికి విపత్తు వచ్చిన ప్రతిసారి రాష్ట్రం కోసం, దేశం కోసం ముందున్న వ్యక్తి. స్వార్దం తెలియని వ్యక్తి. ఐక్యమత్యమే మహాబలం అని నమ్మిన వ్యక్తి. చిత్ర పరిశ్రమలో ఎవరికీ కష్టం వచ్చినా వారి కోసం నిలబడిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ప్రజలను దేవుళ్ళుగా చూసిన వ్యక్తి. ఎంతోమంది జీవితాలకు వెలుగు నింపి, వారి జీవితాలకు దారి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. తెలంగాణ రాష్ట్ర రాజధాని అమీర్పేటలో ఎన్టీఆర్ గాడి విగ్రహావిష్కరణ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 103వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాను” అన్నారు.
ప్రముఖ నిర్మాత భరద్వాజ్ గారు మాట్లాడుతూ… “దేశంలో మన తెలుగు వారిని ఒక అడుగు ముందుకు నడిపించిన నందమూరి తారక రామారావు గారు మన తెలుగు వారు కావడం ఎంతో గర్వంగా ఉంది” అన్నారు.
అనిల్ వల్లభనేని మాట్లాడుతూ… “ఎన్టీఆర్ గారి జయంతి అంటే ప్రతి తెలుగువారింట్లో ఒక పండగగా చేసుకుంటారు. తెలుగువారి ప్రఖ్యాతిని ప్రపంచానికి సాటి చెప్పిన వ్యక్తి. ఎంతోమంది కొత్తవారికి రాజకీయ ప్రయాణం నేర్పిన అటువంటి మహానుభావుని జయంతి సందర్భంగా మనమందరం ఇక్కడ కలుసుకోవడం నా ప్రేమతో ఆనందకరంగా ఉంది. తెలుగు వార్త ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనను స్మరించుకోవలసినదిగా ప్రార్థిస్తున్నాను” అన్నారు.
తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ… “ప్రపంచంలోనే ప్రఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు గారు. దేశంలో అప్పట్లోనే ఫ్యాన్ ఇండియా స్టార్ రామారావు గారు. బాలీవుడ్ నుండి ఎన్ని ఆఫర్లు వచ్చిన నా జీవితం తెలుగు వారికి అంకితం అని చెప్పి ఇక్కడే సినిమాలో చేసిన మహానుభావుడు. 60 సంవత్సరాలు వచ్చిన నటిస్తూనే ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు. ప్రజలే నా కుటుంబం అంటూ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలందరిని సమానంగా చూస్తూ వారి అభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన వల్ల ఎంతోమంది రాజకీయాల్లో వచ్చి చైతన్యంగా పనిచేశారు. ఎన్టీఆర్ గారి తెలుగువాడు కావడం తెలుగువారి అదృష్టం, తెలుగు వారంతా గర్వపడవలసిన విషయం. ప్రభుత్వంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన విగ్రహానికి ఆవిష్కరణ జరగడం అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ఇక్కడే అర్థమవుతుంది. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొని అభిమానులతో కలిసి ఆయన జయంతిని ఒక పండుగలా జరుపకోవడం ఆనందకరం. జై ఎన్టీఆర్!” అన్నారు.
నివాళులు అర్పించిన పిమ్మట 1000 మందికి పైగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరిట ప్రజలకు అన్నదానం చేయడం జరిగింది.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…