సినీ సంగీత క‌ళాకారుల‌కు అమోర్ ఆస్ప‌త్రిలోలైఫ్‌టైంప్రివిలేజ్ కార్డు

సినీ సంగీత క‌ళాకారుల‌కు అమోర్ ఆస్ప‌త్రిలో లైఫ్‌టైం ప్రివిలేజ్ కార్డు
* రెండు రోజుల పాటు ప‌లు సూప‌ర్ స్పెషాలిటీ విభాగాల్లో ఉచిత వైద్య‌సేవలు
* లైఫ్‌టైం ప్రివిలేజ్ కార్డుతో జీవితాంతం ప‌లు ర‌కాల రాయితీలు
* మెడిక‌ల్ ప్లానెట్‌కు వ‌చ్చిన‌ట్లుంద‌న్న సంగీత ద‌ర్శ‌కుడు కోటి
* ఆయ‌న చేతుల మీదుగా ప్రివిలేజ్ కార్డు ఆవిష్క‌ర‌ణ‌

హైద‌రాబాద్‌, మార్చి 17, 2023: తెలుగు సినీ సంగీత రంగానికి అంత‌ర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు వ‌స్తోంద‌ని, ఇలాంటి త‌రుణంలో ఈ రంగానికి చెందిన క‌ళాకారుల‌ను గుర్తించి, వారి ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించేందుకు అమోర్ ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ముందుకురావ‌డం, ప‌లు ర‌కాల స‌దుపాయాలు క‌ల్పించ‌డం ముదావహ‌మ‌ని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి అన్నారు. న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన అమోర్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో తెలుగు సినీ సంగీత క‌ళాకారుల యూనియ‌న్ స‌భ్యులు సుమారు 580 మందికి గురు, శుక్ర‌వారాల్లో రెండు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వ‌హించారు. ఇందులో ప‌లు సూప‌ర్ స్పెషాలిటీ క‌న్స‌ల్టేష‌న్లతో పాటు వారంద‌రికీ ప‌లు ర‌కాల వైద్య ప‌రీక్ష‌ల‌ను ఉచితంగా నిర్వ‌హించారు. వీటితో పాటు తెలుగు సినీ సంగీత క‌ళాకారుల యూనియ‌న్ స‌భ్యులంద‌రికీ లైఫ్‌టైం ప్రివిలేజ్ కార్డు అందించారు. ఈ కార్డును సంగీత ద‌ర్శ‌కుడు కోటి చేతుల మీదుగా శుక్ర‌వారం ఆవిష్క‌రించారు. ఈ కార్డు ద్వారా యూనియ‌న్ స‌భ్యులంద‌రికీ ప‌లు ర‌కాల స‌దుపాయాలు క‌ల్పించారు. వీటిలో, క‌న్స‌ల్టేష‌న్లు ఉచితంగా చేస్తూ, ఇన్‌పేషంట్లుగా చేరాల్సి వస్తే అన్నిరకాల సేవల మీద జీవితాంతం 50% రాయితీ అందిస్తున్నారు. అంతేకాక‌.. న‌గ‌రంలోని ఏ ప్రాంతం నుంచైనా ఉచితంగా అంబులెన్సు సేవ‌లు క‌ల్పిస్తారు.

ఈ సందర్భంగా సంగీత దర్శ‌కుడు కోటి మాట్లాడుతూ, ‘‘ఈరోజు నాకు ఒక మెడికల్ ప్లానెట్ కి వచ్చినట్లు అనిపించింది. ఇంత అత్యాధునిక సదుపాయాలు, టెక్నాలజీతో ఉన్న ఆస్పత్రికి రావడంఎంతో బాగుంది. అస‌లు లోప‌ల‌కు ప్రవేశించగానే వ్యాధి తగ్గిపోయేంత బాగుంది. డాక్టర్ కిశోర్ బి. రెడ్డికి శతకోటి ధన్యవాదాలు. కూకట్ పల్లి లాంటి సెంటర్లో ఇంత అత్యాధునిక సదుపాయాలున్న ఆస్పత్రిలో ప్రత్యేకరాయితీలను మా సంగీత కళాకారులకు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. వైద్యులందరికీ మా అందరి తరఫున కృతజ్ఞ‌త‌లు, ధన్యవాదాలు. చెన్నైలోని ఎంజీఆర్ ఆస్పత్రికి ఎవరు వెళ్లినా చికిత్స చేయించుకుని రావడమే తప్ప, మరణాల రేటు అన్నదే లేదు. అలాంటి వాతావరణం మళ్లీ అమోర్ ఆస్పత్రిలోనే చూస్తున్నాం’’ అన్నారు.

మ‌రో ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ, ‘‘అమోర్ ఆస్పత్రి సేవలను రాయితీ ధరలతో సినీ సంగీత క‌ళాకారుల‌కు అందిస్తున్న డాక్ట‌ర్ కిశోర్ బి రెడ్డికి ధన్యవాదాలు. సినీ సంగీత క‌ళాకారులు, వాళ్ల కుటుంబాలకు ఇదెంతో సాయం అవుతుంది. ఏ సమస్య వచ్చినా చికిత్స చేయగల సమర్థులైన వైద్యులు, స‌దుపాయాలు అందుబాటులో ఉన్న ఈ ఆస్ప‌త్రి సేవ‌ల‌ను మావాళ్లు అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ఇక్కడకు వస్తే, ఒక్కసారి ఇక్కడి వైద్యులు, సిబ్బంది, సదుపాయాలను చూస్తే మళ్లీ ఏ చిన్న అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చినా ఇక్కడకే రావాలని అనిపిస్తుంది’’ అని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఆస్ప‌త్రి సీఎండీ, ప్ర‌ముఖ ఆర్థో ఆంకాల‌జీ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ కిశోర్ బి.రెడ్డి మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఉన్న సంస్కృతి, క‌ళ‌ల‌ను కాపాడుతున్న‌వారు సినీ క‌ళాకారులే. అందులోనూ తెలుగు జాతికి అంత‌ర్జాతీయ స్థాయిలో అత్యున్న‌త సినీ అవార్డైన ఆస్కార్ అవార్డును కూడా సినీ సంగీత క‌ళాకారులే తీసుకొచ్చారు. అలాంటి వారిని కాపాడుకోవ‌డం మా బాధ్య‌త. అందులో భాగంగానే త‌మ ఆరోగ్యాన్ని ఏమాత్రం లెక్క చేయ‌కుండా క‌ళామ‌త‌ల్లి సేవ‌లోనే జీవితం గ‌డుపుతున్న సినీ సంగీత క‌ళాకారుల కోసం అమోర్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో ఈ రెండు రోజులు ఉచితంగా సూప‌ర్ స్పెషాలిటీ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. వారికి భ‌విష్య‌త్తులో ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చినా కాపాడేందుకు వీలుగా యూనియ‌న్ స‌భ్యులంద‌రికీ లైఫ్‌టైం ప్రివిలేజి కార్డులు అందిస్తున్నాం. క‌ళాకారులంతా ఈ సేవ‌ల‌ను వినియోగించుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాల‌ని కోరుకుంటున్నాం అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు ఆర్‌పీ ప‌ట్నాయ‌క్, కేఎం రాధాకృష్ణ‌, క‌ళ్యాణ్ మాలిక్‌, తెలుగు సినీ సంగీత క‌ళాకారుల యూనియ‌న్ అధ్య‌క్షురాలు విజ‌య‌ల‌క్ష్మి, కార్య‌ద‌ర్శి కె.రామాచారి, ఉపాధ్య‌క్షుడు జైపాల్ రాజ్‌, కోశాధికారి ర‌మ‌ణ‌, సంయుక్త కార్య‌ద‌ర్శి మాధ‌వి పాల్గొన్నారు. వారితో పాటు అమోర్ ఆస్ప‌త్రి వైస్ ప్రెసిడెంట్ పి.ఎన్. నాగేంద‌ర్ రావు, డిప్యూటీ మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ జ‌య‌శేఖ‌ర్‌, ఫెసిలిటీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ స‌తీష్ పాల్గొన్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

23 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago