కాకా మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మాతగా ప్రముఖ దర్శకుడు పి వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరో గా రాజ్ శంకర్, పూర్ణ, నాగ బాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రలో రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఆలా ఇలా ఎలా”. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన బాణీలను హిందూపూర్ ఊర్లో జనసందోహంలో అంగరంగవైభోగంగా విడుదల చేశారు. ఈ చిత్రంలో లోని పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా వినొచ్చు. ఈ చిత్రాన్ని జులై 21న భారత దేశం అంతటా ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా విడుదల అవుతుంది.
ఈ ఆడియో విడుదల వేడుకకి వై ఎస్ ఆర్ సి పి ఎమ్ ఎల్ సి షేక్ మహమ్మద్ ఇక్బాల్ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్ ని మరియు ఆడియో ని విడుదల చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ “ఆలా ఇలా ఎలా” చిత్రం ట్రైలర్ ను ఇప్పుడు చూసాం, చాలా బాగుంది, ఇలాంటి వేడుక హిందూపూర్ లో జరగడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాత కొల్లకుంట నాగరాజు గారికి ఈ చిత్రం మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేవతి గారు మాట్లాడుతూ “ఆలా ఇలా ఎలా” ట్రైలర్ చాలా బాగుంది, నిర్మాత కొల్లకుంట నాగరాజు గారికి నా శుభాకాంక్షలు. రాజకీయాల్లో మేము ఎంత విజయం సాధించామో నిర్మాత నాగరాజు గారు కూడా ఈ చిత్రం తో సినీరంగం లో కూడా అంతటి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.
హీరోయిన్ నిషా కొఠారి మాట్లాడుతూ “నేను ఈ వేడుకకి రావటం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రాన్ని నిర్మించి విడుదల చేస్తున్న నిర్మాత నాగరాజు గారికి నా కృతజ్ఞతలు. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఈ చిత్రం మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.
ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ అధినేత ఆదినారాయణ మాట్లాడుతూ “హిందూపూర్ లో “ఆలా ఇలా ఎలా” ఆడియో రిలీజ్ వేడుక జరగటం చాలా ఆనందంగా ఉంది. హిందూపూర్ లో ఉన్న ప్రతి ఒక మనిషి మా ఫంక్షన్ కి వచ్చి మా నిర్మాత నాగరాజు గారిని మా చిత్రాన్ని ఆశీర్వదించటానికి వచ్చారు అందరికి ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని నేను చూసాను, మణిశర్మ గారి సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది, తర్వాత హీరో శక్తి గారి నటన చాలా అద్భుతంగా నటించారు. “ఆలా ఇలా ఎలా” చిత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం, స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని జులై 21న భారత దేశం అంతటా ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా విడుదల అవుతుంది” అని తెలిపారు.
నిర్మాత కొల్లకుంట నాగరాజు మాట్లాడుతూ “నేను పుట్టి పెరిగిన ఊరు హిందూపూర్, మన హిందూపూర్ అని రంగాల్లోనూ ముందు ఉండాలి అని కోరుకునేవాడిని. ఇప్పుడు నేను నిర్మాతగా మారి “ఆలా ఇలా ఎలా” చిత్రాన్ని నిర్మించాను, ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హిందూపూర్ లో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని జులై 21న విడుదల చేస్తున్నాం. మీరు అందరు చూసి మా చిత్రాన్ని విజయవంతం చేయాలి” అని కోరుకున్నారు.
యువ నటుడు అశోక్ మాట్లాడుతూ “ఆడియో విడుదల వేడుక ఇంత ఘనవిజయం అవుతుంది అని నేను అనుకోలేదు, హిందూపూర్ ప్రేక్షలులందరికి నా ధన్యవాదాలు. మా హీరో శక్తి గారి నటన అద్భుతంగా ఉంటుంది. మణిశర్మ గారి సంగీతం హై లైట్ గా నిలుస్తుంది. ఈ చిత్రాన్ని జులై 21న భారత దేశం అంతటా ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా విడుదల అవుతుంది. మీరు అందరు మా చిత్రాన్ని సపోర్ట్ చేయాలి. మన నిర్మాత నాగరాజు గారి రెండో చిత్రంలో నేను హీరో గా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాతకి ధన్యవాదాలు” అని తెలిపారు.
హీరో శక్తి వాసుదేవన్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో నేను హీరో గా కనిపిస్తాను, 83 రోజులు మంచి మంచి లొకేషన్స్ లో చిత్రీకరించాం. మా దర్శకుడు ఏ చిత్రానికి బలం, తన కథ, కథనం గొప్పగా ఉంటుంది. నిర్మాత నాగరాజు గారికి నా ధన్యవాదాలు. తెలుగు లో లాంచ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగుంటుంది, జులై 21న విడుదల అవుతుంది. అందరు చుడండి” అని తెలిపారు.
చిత్రం పేరు : ఆలా ఇలా ఎలా
నటి నటులు : శక్తి వాసుదేవన్, రాజా శేఖర్, పూర్ణ, షియాజీ షిండే, నాగబాబు, రియాజ్ ఖాన్, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి, హరిప్రియ, సితార, రేఖ, సీత, తదితరులు
యాక్షన్ డైరెక్టర్ : రాజశేఖర్
డాన్స్ మాస్టర్ : శోభి, అశోక్ రాజ్, నిక్సన్, గిరి, దిన
ఎడిటర్ : జాషి ఖ్మెర్
కెమెరా మాన్ : పి కె హెహ్ దాస్
సంగీతం : మణిశర్మ
నిర్మాత : కొల్లకుంట నాగరాజు
దర్శకుడు : రాఘవ
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…