బయోపిక్ సినిమాలు అనేవి ఆడియెన్స్లో ఎప్పుడూ ఆసక్తిని రేపుతుంటాయి. ఉన్నది ఉన్నట్టుగా తీశారా? ఏమైనా అదనంగా చూపిస్తున్నారా? అసలు వాస్తవాలు బయటకు చూపిస్తారా? అనే ఆలోచనలతో జనాలు ఆ బయోపిక్ సినిమాలను చూస్తుంటారు. అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు, పేదల పాలిట పెన్నిది అయిన గుమ్మడి నర్సయ్య బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు అందరినీ ఆకట్టుకున్నాయి.
ప్రజల కోసం ప్రజల కొరకే నా జీవితం అంటూ ముందుకు సాగిన గుమ్మడి నర్సయ్య బయోపిక్ భావితరాలకు స్పూర్తిదాయకంగా నిలిచేలా తెరకెక్కిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య అనే సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. గుమ్మడి నర్సయ్య పుట్టిన రోజు సందర్భంగా ఓ పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్లు ప్రకటించారు.
ఈ మేరకు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలె మాట్లాడుతూ.. ‘ఈరోజు శ్రీ గుమ్మడి నర్సయ్య గారి పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక ప్రమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశాం. ప్రేక్షక మహాశయులు అందరూ చూసి మా చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. బయోపిక్ కావడంతో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చాలా శ్రద్దగా, నిదానంగా సినిమాను తీస్తున్నాం. ఇకపై సినిమాకు సంబంధించిన అప్డేట్లను రెగ్యులర్గా ఇస్తామ’ని తెలిపారు.
చరణ్ అర్జున్ అందించిన బాణీ, పాడిన తీరు పాటను వినసొంపుగా మార్చింది. గుమ్మడి నర్సయ్య వ్యక్తిత్వం, మంచితనం, గొప్పదనం తెలిసేలా రాసిన పాట శ్రోతలను కదిలించేలా ఉంది. ఈ పాటతో సినిమా మీద మంచి బజ్ ఏర్పడేలా ఉంది. ఈ పాట త్వరలోనే అందరి నోట వినిపించేలా కనిపిస్తోంది.
సాంకేతిక బృందం
బ్యానర్ : డార్క్ టు లైట్ క్రియేటర్స్
కథ, కథనం, దర్శకత్వం : పరమేశ్వర్ హివ్రాలే
సంగీతం : చరణ్ అర్జున్
సినిమాటోగ్రఫీ : అఖిల్ వల్లూరి
ఎడిటింగ్ : సత్య గిడుతూరి
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…