విద్య కోసం పరుగు: హైదరాబాద్ NMDC మారథాన్లో ఈశా విద్యాకు మద్దతుగా 30 ఈశా బ్రహ్మచారులు ఇంకా వందల మంది వాలంటీర్లు పాల్గొన్నారు
ఈశా విద్య పై అవగాహన ఇంకా నిధులను సేకరించే ప్రయత్నంలో, 30 మంది ఈశా బ్రహ్మచారులు ఇంకా వందల మంది మద్దతుదారులు ఆగస్టు 27న హైదరాబాద్లో NMDC మారథాన్లో పాల్గొన్నారు.
ఈశా ఫౌండేషన్ యొక్క సామాజిక అభివృద్ధి విభాగమైన ఈశా ఔట్రీచ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈశా విద్యా పాఠశాలలు ఉన్నత విలువలతో ఇంగ్లీష్ మీడియం విద్యను అందరికీ అందుబాటులో ఉండేలా, ముఖ్యంగా గ్రామీణ పేద పిల్లలకు అందుబాటులో ఉండేలా అందజేస్తున్నాయి. 2006లో ప్రారంభమైనప్పటి నుండి, 10,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈశా విద్యా పాఠశాలల్లో చదువుకున్నారు.
వీరిలో 60% కంటే ఎక్కువ మంది విద్యార్థులు వారి కుటుంబంలో బడికి వెళ్తున్న మొదటి తరం వారు – స్కాలర్షిప్ల ద్వారా మద్దతు పొందుతున్నారు. మిగిలిన వారు తక్కువ ఫీసులు చెల్లిస్తారు.
పాఠశాలలలో మౌలిక వసతులతో విశాలమైన, బాగా వెలుతురు ఉన్న తరగతి గదులు ఇంకా గ్రామీణ వాతావరణంలో అరుదైనప్పటికీ పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉంటాయి.
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, విద్యార్థులకు పోషకాహార సమతుల్యమైన మధ్యాహ్న భోజనం అందించబడుతుంది- అవసరమైన విటమిన్లతో సమృద్ధిగా ఉంటుంది, క్రమం తప్పకుండా వైద్య ఆరోగ్య పరీక్షలు చేయిస్తుంటారు.
పిల్లలు క్రీడలు ఇంకా రోజువారీ యోగా అభ్యాసాలలో చురుకుగా పాల్గొంటారు. బహుళ స్థాయిలలో అభ్యాసాన్ని ఉత్తేజపరిచేందుకు ఇంటరాక్టివ్, చర్చ-ఆధారిత తరగతులు ఇంకా కార్యాచరణ-ఆధారిత అభ్యాసంతో ప్రత్యేకమైన పద్దతిని ఈ పాఠశాలలు అనుసరిస్తాయి. ప్రింట్, ఆడియో, వీడియో, కంప్యూటర్ మెటీరియల్స్ ఇంకా డిజిటల్ క్లాస్రూమ్ల రూపంలో 21వ శతాబ్దంలో విద్యార్థులకు అవసరమైన ప్రాపంచిక అవగాహన ఇంకా నైపుణ్యాలను పొందేలా చూస్తాయి.
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…