విద్య కోసం పరుగు: హైదరాబాద్ NMDC మారథాన్లో ఈశా విద్యాకు మద్దతుగా 30 ఈశా బ్రహ్మచారులు ఇంకా వందల మంది వాలంటీర్లు పాల్గొన్నారు
ఈశా విద్య పై అవగాహన ఇంకా నిధులను సేకరించే ప్రయత్నంలో, 30 మంది ఈశా బ్రహ్మచారులు ఇంకా వందల మంది మద్దతుదారులు ఆగస్టు 27న హైదరాబాద్లో NMDC మారథాన్లో పాల్గొన్నారు.
ఈశా ఫౌండేషన్ యొక్క సామాజిక అభివృద్ధి విభాగమైన ఈశా ఔట్రీచ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈశా విద్యా పాఠశాలలు ఉన్నత విలువలతో ఇంగ్లీష్ మీడియం విద్యను అందరికీ అందుబాటులో ఉండేలా, ముఖ్యంగా గ్రామీణ పేద పిల్లలకు అందుబాటులో ఉండేలా అందజేస్తున్నాయి. 2006లో ప్రారంభమైనప్పటి నుండి, 10,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈశా విద్యా పాఠశాలల్లో చదువుకున్నారు.
వీరిలో 60% కంటే ఎక్కువ మంది విద్యార్థులు వారి కుటుంబంలో బడికి వెళ్తున్న మొదటి తరం వారు – స్కాలర్షిప్ల ద్వారా మద్దతు పొందుతున్నారు. మిగిలిన వారు తక్కువ ఫీసులు చెల్లిస్తారు.
పాఠశాలలలో మౌలిక వసతులతో విశాలమైన, బాగా వెలుతురు ఉన్న తరగతి గదులు ఇంకా గ్రామీణ వాతావరణంలో అరుదైనప్పటికీ పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉంటాయి.
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, విద్యార్థులకు పోషకాహార సమతుల్యమైన మధ్యాహ్న భోజనం అందించబడుతుంది- అవసరమైన విటమిన్లతో సమృద్ధిగా ఉంటుంది, క్రమం తప్పకుండా వైద్య ఆరోగ్య పరీక్షలు చేయిస్తుంటారు.
పిల్లలు క్రీడలు ఇంకా రోజువారీ యోగా అభ్యాసాలలో చురుకుగా పాల్గొంటారు. బహుళ స్థాయిలలో అభ్యాసాన్ని ఉత్తేజపరిచేందుకు ఇంటరాక్టివ్, చర్చ-ఆధారిత తరగతులు ఇంకా కార్యాచరణ-ఆధారిత అభ్యాసంతో ప్రత్యేకమైన పద్దతిని ఈ పాఠశాలలు అనుసరిస్తాయి. ప్రింట్, ఆడియో, వీడియో, కంప్యూటర్ మెటీరియల్స్ ఇంకా డిజిటల్ క్లాస్రూమ్ల రూపంలో 21వ శతాబ్దంలో విద్యార్థులకు అవసరమైన ప్రాపంచిక అవగాహన ఇంకా నైపుణ్యాలను పొందేలా చూస్తాయి.
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…