‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో . స్నీక్ పీక్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అంకిత్ కొయ్య

అంకిత్ కొయ్య హీరోగా, శ్రియా కొంతం హీరోయిన్‌గా ‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో’ అనే చిత్రం రాబోతోంది. శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద సత్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ హర్ష ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సోమవారం నాడు ఈ సినిమా నుంచి స్నీక్ పీక్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో..

నిర్మాత సత్య మాట్లాడుతూ.. ‘సెన్సిబుల్ మెసెజ్ ఇస్తూనే ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. టీ హబ్‌లో ఈ ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేశాం. కొత్త కంటెంట్‌ను టాలీవుడ్‌కు ఇవ్వాలని అనుకున్నాం. అందుకే ఈ చిత్రాన్ని నిర్మించాం. మా చిత్రానికి పెద్ద వాళ్లు కూడా సపోర్ట్ చేశారు. దీపక్ స్లమ్ డాగ్ మిలియనీర్‌కి పని చేశారు. సింగర్ కార్తీక్ పాట పాడారు. ట్రైలర్ తరువాత మా సినిమాకు మరింత పాజిటివ్ వైబ్ వచ్చింది’ అని అన్నారు.

హీరో అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. ‘మనం అమృతం సీరియల్‌ను ఎంత ఎంజాయ్ చేశామో అంతలా మా సినిమాను ఎంజాయ్ చేస్తాం. కొన్ని సార్లు ఎదుటి వాళ్ల కష్టాలను, బాధల్ని చూసి మనం నవ్వుకుంటాం. హర్ష అనే కారెక్టర్ తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన తరువాత డోర్ లాక్ అవ్వడం, ఇంట్లోనే పద్నాలుగు రోజులు ఉండటంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది ఈ సినిమా కథ. మెయిన్ ప్లాట్ రివీల్ చేశాం. సినిమా ఆద్యంతం నవ్వుకునేలా ఉంటుంది. హర్ష చెప్పిన ఈ యూనిక్ పాయింట్ నచ్చింది. అలా మా జర్నీ ప్రారంభం అయింది. పూరి జగన్నాథ్ గారి వద్ద హర్ష పని చేశాడు. మా హీరోయిన్ శ్రియ అద్భుతంగా నటించారు. మరో తెలుగమ్మాయి నటన అందరినీ ఆకట్టుకోబోతోంది. సత్య వద్ద చాలా కొత్త కొత్త ఐడియాలుంటాయి. ఈ సినిమా రిలీజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. మంచి వాళ్లకే ఇలా లేట్ అవుతుంటాయి. క్రిష్ గారి వల్లే మా చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. వెన్నెల కిషోర్ గారి ట్రాక్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే థియేటర్లోకి రాబోతోంది. అందరినీ ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.

సహ నిర్మాత నాగు మాట్లాడుతూ.. ‘సత్య ఆర్ట్స్ బ్యానర్‌లో కో ప్రొడ్యూసర్‌గా నేను రావడం ఆనందంగా ఉంది. అంకిత్, వెన్నెల కిషోర్ గారి ట్రాక్ బాగుంటుంది. కొత్త టీంను మీడియా ప్రోత్సహించాలి, ఆదరించాలని కోరుకుంటున్నాను. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం’ అని అన్నారు.

డైరెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ.. ‘టీ హబ్‌లో ప్రొడక్షన్ కంపెనీ ఉందని తెలిసి షాక్ అయ్యా. అక్కడకు వెళ్లి మా నిర్మాత సత్యను కలిశాను. కొత్త వాళ్లమంతా కలిసి ఈ చిత్రాన్ని తీశాం. అంకిత్‌కి కూడా ఇది సోలో హీరోగా మొదటి చిత్రం. మా లాంటి కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయండి. మున్ముందు మరింత కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నామ’ని అన్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

1 day ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago