సుగి విజయ్, మౌనిక మగులూరి హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం రా రాజా. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై బి. శివప్రసాద్ స్వీయా నిర్మాణ దర్శకత్వం వహించారు. తాజాగా హీరో అల్లరి నరేష్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు.
నిమిషన్నర నిడివి గల టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. క్యారెక్టర్ ని చూపించకుండా, ఒక్క డైలాగ్ కూడా లేకుండా కట్ చేసిన ఈ ట్రైలర్ హారర్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టెర్రిఫిక్ అనిపించింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా వున్నాయి. దర్శకుడి కాన్సెప్ట్, టేకింగ్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. మొత్తనికి టీజర్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది.
టీజర్ లాంచ్ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై శివప్రసాద్ దర్శకత్వం వహించిన రారాజా సినిమా టీజర్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది .డైరెక్టర్ కథ చెబుతున్నంత సేపు చాల ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇందులో నేను చాల ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే దీనిలో నటించిన ఇరవై నాలుగు క్యారెక్టర్స్ ఎవరి ఫేస్ లు కనిపించకపోవడం. అదే విషయం డైరెక్టర్ ని అడిగితే చూస్తున్నంత సేపు ఏ ఆడియన్ కూడా ఎంగేజ్ మిస్ అవ్వడు, వింటున్నంత సేపు మీరు ఎలా ఫీల్ అయ్యారో అలాగే ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు అని చెప్పారు. A.I జనరేషన్ లో కూడా అసలు మొహాలు కనిపించకుండా సినిమా ఎలా తీశారు..ఆ ఒక్క రీజన్ కోసం అయినా త్వరగా చూడాలని ..సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా కచ్చితంగా ట్రెండ్ సెట్ చేస్తుందని నాకు అనిపిస్తోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ చెప్పారు.
ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తుండగా రాహుల్ శ్రీవాత్సవ్ డీవోపీగా పని చేస్తున్నారు. ఉప్పు మారుతి ఎడిటర్ కాగ, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. యాక్షన్ నందు మాస్టర్.
త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
బ్యానర్: శ్రీ పద్మిని సినిమాస్
తారాగణం : సుగి విజయ్, మౌనిక మగులూరి & ఇతరులు
నిర్మాత & దర్శకుడు: బి. శివప్రసాద్
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
ఎడిటర్: ఉప్పు మారుతి
డీవోపీ : రాహుల్ శ్రీవాత్సవ్
ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు
యాక్షన్: నందు మాస్టర్
పీఆర్వో : తేజస్వి సజ్జా
డిజిటల్: రెయిన్బో మీడియా
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
"సంతాన ప్రాప్తిరస్తు" చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో విక్రాంత్..ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ…
ఈషా ఫేం త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో చేస్తున్న హోల్సమ్ ఎంటర్టైనర్ 'మిస్టర్ వర్క్…
ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "ఆపరేషన్ అరుణారెడ్డి". ఈ…
‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని సందీప్ కిషన్తో ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. ఈ…
ఎం. ఎస్. రాజు రచన, దర్శకత్వం లో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్పై కాశీ విశాలాక్షి బలుసు 'అగధ'…