బుల్లి తెర కమల్ హాసన్గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కృష్ణమాచారి దర్శకునిగా, సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేశారు. మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.
సక్సెస్ మీట్ లో హీరో గెటప్ శ్రీను మాట్లాడుతూ.. రాజు యాదవ్ సక్సెస్ మీట్ కి వచ్చేసిన అందరికీ థాంక్స్. రాజు యాదవ్ కి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. థియేటర్స్ విజిట్ కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ గుండెలు బరువెక్కాయని చెప్పడం చాలా ఎమోషనల్ గా అనిపించింది. వారి నుంచి వచ్చిన రెస్పాన్స్ రియల్ సక్సెస్ అనిపించింది. సినిమా మనసుని కదిలిస్తే అది రియల్ సక్సెస్. అలాంటి రియల్ సక్సెస్ ని అందించిన ఆడియన్స్ కి థాంక్స్. టీం తరపున ఆడియన్స్ కి శిరస్సు వంచి పాదాభివందనం చెబుతున్నాం. రాజు యాదవ్ ని ఇంత భారీ స్థాయిలో ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్ళిన మా బన్నీవాస్ గారికి థాంక్స్. మ్యూజిక్ ఇచ్చిన హర్ష వర్ధన్ రామేశ్వర్, సురేష్ బొబ్బిలి, లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారికి, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అంకిత చాలా చక్కగా పెర్ఫామ్ చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటులకి, అందరికీ థాంక్ యూ. దర్శకుడు కృష్ణమాచారి చాలా పాషన్ తో ఈ సినిమా చేశారు. ఈ సక్సెస్ ఆయకే వెళ్ళాలి. భవిష్యత్ లో ఆయన మరెన్నో మంచి చిత్రాలు చేయాలి. మమ్మల్ని బ్లెస్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు. అలాగే కొరటాల శివ గారు, పూరి జగన్నాథ్ గారు, బాబీ గారు, బ్రహ్మనంద గారు అందరికీ పేరుపేరునా మనస్పూర్తిగా కృతజ్ఞతలు. సినిమా విషయంలో నిర్మాతలు చాలా హ్యాపీగా వున్నారు. నాలుగో రోజే బ్రేక్ ఎవెన్ అవ్వడం ఆనందంగా వుంది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులు మరోసారి ధన్యవాదాలు. రాజు యాదవ్ థియేటర్స్ లో వుంది. ఇంకా చూడని వారు తప్పకుండా వెళ్లి చూడండి.’ అని కోరారు.
డైరెక్టర్ కృష్ణమాచారి మాట్లాడుతూ.. రాజు యాదవ్ కు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులు మనస్పూర్తిగా ధన్యవాదాలు. సినిమాకి అన్ని చోట్ల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన చాలా ఆనందాన్ని ఇస్తోంది. ప్రేక్షకులు రాజు యాదవ్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. చూసిన వారంతా చాలా బావుందని అభినందిస్తున్నారు. ఈ జర్నీలో నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన శ్రీను అన్నకి థాంక్స్. అలాగే నాపై ఎంతో నమ్మకం వుంచి నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేసిన బన్నీవాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. సినిమా థియేటర్స్ లో వుంది. ఇంకా చూడని వారు తప్పకుండా వెళ్లి చూడండి. రాజు యాదవ్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది’ అన్నారు.
హీరోయిన్ అంకిత మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. రాజు యాదవ్ కి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్స్. శ్రీను గారు చాలా సపోర్ట్ చేశారు. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. మా సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’ తెలిపారు
నిర్మాత ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజు యాదవ్ ని ఇంత అద్భుతంగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు. మూవీ టీం అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…