ఏపీ నూతన టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా ఎంపికైన కందుల దుర్గేష్ గారికి సీనియర్ నిర్మాత, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ నట్టి కుమార్ ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. “ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ తరపున నిడదవోలు నియోజకవర్గంలో విజయం సాధించిన ఆయనకు రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉంది. సినీ పరిశ్రమకు చెందిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీకి చెందిన శాసనసభ్యుడికే టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ముందుచూపుకు ఇది ఓ నిదర్శనం. టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలకు చక్కటి అవినాభావ సంబంధం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. విశాఖపట్టణం, అరకు, రాజముండ్రి, గోదావరి తీరం, తిరుపతి, మదనపల్లి వంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలలో షూటింగులకు అనువుగా ఆ లొకేషన్స్ ను తీర్చిదిద్దెందుకు తప్పకుండా దుర్గేష్ గారు కృషిచేస్తారన్న నమ్మకం ఉంది. అలాగే చిన్న, పెద్ద సినిమా సమస్యలు, థియేటర్ల సమస్యలు, చిత్ర పరిశ్రమలో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి దుర్గేష్ గారు పెద్ద పీట వేస్తారని విశ్వసిస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 68 శాతం ఏపీ నుంచే వస్తోంది. మంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు త్వరలోనే తెలుగు సినీ పరిశ్రమ తరపున ఆయనను కలుస్తాం” అని నట్టి కుమార్ పేర్కొన్నారు.
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…
సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…