అడివి శేష్ మెగా పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘డకాయిట్’ హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. హీరోయిన్గా నటిస్తున్న శ్రుతిహాసన్ ఈ షెడ్యూల్లో టీమ్తో జాయిన్ అయింది. ఈ ఇంపార్ట్టెంట్, మ్యాసీవ్ యాక్షన్ షెడ్యూల్లో మేకర్స్ లీడ్ కాస్ట్ పై కీలకమైన సన్నివేశాలు, యాక్షన్ పార్ట్ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా శృతి హాసన్, శేష్తో సెల్ఫీని షేర్ చేశారు.
డకాయిట్ ఇద్దరు మాజీ ప్రేమికుల కథ, వారు తమ లైఫ్స్ ని మార్చడానికి వరుస దోపిడీలకు ఏకం కావాలి. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు బ్లాక్బస్టర్లకు డివోపీగా పనిచేసిన షానీల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. శేష్, శ్రుతి జంటగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ ప్రాజెక్ట్ను సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్ చేస్తోంది. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.
అడివి శేష్, షానీల్ డియో ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ చిత్రం 2022లో ప్రశంసలు పొందిన ‘మేజర్’ తర్వాత శేష్ యొక్క సెకెండ్ స్ట్రయిట్ హిందీ మూవీ.
సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
నటీనటులు: అడివి శేష్, శృతి హాసన్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: షానీల్ డియో
కథ, స్క్రీన్ప్లే: అడివి శేష్, షానీల్ డియో
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
సహ నిర్మాత: సునీల్ నారంగ్
సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్
పీఆర్వో: వంశీ-శేఖర్
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…