రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ల అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’ అనేక ఆకర్షణలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా సందడి చేస్తోంది. ప్రాజెక్ట్ K అత్యంత ఖరీదైన ఇండియన్ సినిమా, ఇండియన్ సూపర్ స్టార్స్ ఈ చిత్రంలో అలరించనున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, ప్రభాస్తో స్క్రీన్ స్పేస్ను పంచుకోనున్నారు.
ప్రాజెక్ట్ K శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రం. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ అక్కడ జరిగే ఈవెంట్ లో భారత ప్రామాణిక కాలమానం( (IST) ప్రకారం జూలై 20న అమెరికాలో, జూలై 21న ఇండియాలో విడుదల కానుంది. అనౌన్స్మెంట్ పోస్టర్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ లు పిడికిలి షేక్ చేయడం కనిపిస్తోంది.
ఈ వేడుకకు ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాతలు హాజరుకానున్నారు.
‘ప్రాజెక్ట్ K’ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న బహుభాషా సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఈ చిత్రంతో సినిమా నిర్మాణ చరిత్రలో వైజయంతీ మూవీస్ సక్సెస్ ఫుల్ గా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. చాలా మంది సూపర్స్టార్లు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు కలిసి పనిచేస్తున్న ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను దేశం ఎన్నడూ చూడలేదు.
దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్గా ఈ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది.
ప్రాజెక్ట్ K జనవరి 12, 2024న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…