ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అజయ్, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ `కొత్త కొత్తగా’. బి జి గోవింద రాజు చిత్రాన్ని సమర్పించారు. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
అజయ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి నేను కొత్త. సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో అంచనాలేదు. కానీ మా దర్శకుడు ఈ విజయాన్ని ముందే ఊహించారు. ఇప్పుడు చాలా జోష్ లో వున్నాను. ఇంత మంచి కథతో లాంచ్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నన్ను ఉదయ్ కిరణ్ అని ప్రసంసిస్తున్నారు. ఇంతమంచిగా చూపించిన మా డీవోపీ కి థాంక్స్. యూత్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రియతమా పాటని. ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది” అన్నారు
వీర్తి మాట్లాడుతూ.. ఈ సినిమాని ఆదరించి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం ఎంతో సహకరించిన అజయ్ కి థాంక్స్. ఈ సినిమాని ఇంకా చూడని వారు దయచేసి థియేటర్ లో చూడండి. తప్పకుండా నచ్చుతుంది” అన్నారు
దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి మాట్లాడుతూ.. వర్షాలు, వినాయక నిమజ్జనం వున్నా కూడా ప్రేక్షకుల నుండి తొలి రోజు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రేక్షకులు చాలా ఆనందంగా ఫీలౌతున్నారు. మంచి రివ్యూలు వచ్చాయి. ఈ సినిమాని చాలా బావుంది. వర్డ్ అఫ్ మౌత్ తో సినిమా మరింత ముందుకు వెళ్తుందనే నమ్మకం వుంది” అన్నారు
నిర్మాత మాట్లాడుతూ.. సినిమాకి అన్ని ప్రాంతాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము అనుకున్న దాని కంటే ఎక్కువ ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. పంపిణీదారులు ఆనందంగా వున్నారు. కొత్తకొత్తగా కొత్త అనుభూతిని ఇచ్చే సినిమాని. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లో చూడాలి” అని కోరారు
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…