తెలుగు ఇండియన్ ఐడల్ 3 నుంచి కుశాల్ శర్మ ఎలిమినేట్

హైదరాబాద్, జూలై 15, 2024 – వీకెండ్ లో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారమైన తాజా ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ కుశాల్ శర్మ ఎలిమినేట్ కావడంతో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో కాంపిటేషన్ రసవత్తరంగా మారింది. జూన్ 14, 2024న ప్రారంభమైన ఈ షో ఇప్పుడు కీలకమైన ఎలిమినేషన్ దశలోకి ప్రవేశించింది, ప్రేక్షకుల ఓటింగ్‌తో పాటు న్యాయమూర్తుల స్కోర్‌లు కంటెస్టెంట్స్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేసిన మొదటి ఎలిమినేషన్ రౌండ్లో, ముగ్గురు కంటెస్టెంట్స్-స్కంద, భరత్ రాజ్ కుశాల్ శర్మ- జడ్జిల నుండి తక్కువ స్కోర్లు అందుకుని డేంజర్ జోన్‌లోకి ప్రవేశించారు. తోటి కంటెస్టెంట్స్ భరత్ రాజ్, స్కందతో కుశాల్ తలపడ్డాడు. స్కంద అత్యధిక ఓట్లను పొంది, మొదట సేఫ్ అయ్యారు. కుశాల్, భరత్‌ ఎలిమినేషన్ లోకి వచ్చారు. ఫైనల్ గా ప్రేక్షకుల నుండి తక్కువ ఓట్లు పొందిన కుశాల్ ఎలిమినేట్ అయ్యాడు.

సింగర్ కార్తీక్ నుంచి ప్రేరణ పొందిన కుశాల్, షోలో తన అనుభవాన్ని ‘జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం’ అని చెప్పాడు. అతను ఈ వేదికని దేవాలయంగా, న్యాయనిర్ణేతలను తన మార్గదర్శక వ్యక్తులుగా పేర్కొన్నాడు. తనను ఎంతగానో ప్రోత్సహించిన థమన్‌, గీతా మాధురి, కార్తీక్‌ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.

ఎలిమినేషన్ అయినప్పటికీ, కుశాల్ పాజిటివ్ గా ఉన్నాడు, అతను పోటీ నుండి చాలా నేర్చుకున్నానని, విలువైన అనుభవాలను పొందానని చెప్పాడు. థమన్, కుశాల్ ప్రతిభని గుర్తించాడు, అతన్ని జెన్యూన్ కంటెస్టెంట్ అని అభినందించారు. భవిష్యత్ లో విజయం సాధించాలని ఆకాంక్షించాడు.

కుశాల్‌కు వీడ్కోలు పలికినప్పుడు తోటి కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. ఈ ఎలిమినేషన్‌తో, పోటీ తీవ్రమైంది, 11 మందికంటెస్టెంట్స్ ప్రతిష్టాత్మకమైన టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. పెర్ఫార్మెన్స్ కొనసాగుతున్న కొద్దీ, పబ్లిక్ ఓటింగ్ , న్యాయనిర్ణేతల స్కోర్‌ల ఆధారంగా ప్రతి వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు, చివరి వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు అవకాశం ఉంటుంది.

వీక్షకులు తెలుగు ఇండియన్ ఐడల్ విభాగానికి నావిగేట్ చేయడం ద్వారా లేదా ప్రతి కంటెస్టెంట్ కోసం నిర్దేశించిన నంబర్‌లకు మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా లేదా ఆహా యాప్ ద్వారా తమ ఓట్లను వేయవచ్చు. ఓటింగ్ లైన్లు శుక్రవారం నుండి రాత్రి 7 గంటలకు తెరిచి ఉంటాయి. ఆదివారం ఉదయం 7 గంటల వరకు, అభిమానులు తమ వాయిస్ వినిపించేందుకు అనుమతిస్తారు.

ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రత్యేకంగా ఆహాలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ మూమెంట్స్ మిస్ కాకుండా చూడండి.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

17 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago