మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ లో తమన్నా భాటియా కథానాయికగా నటించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘జైలర్’ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు తమన్నా. ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్న భోళా శంకర్ ఆగస్ట్ 11న, జైలర్ ఆగస్ట్10న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ రెండు చిత్రాలలో నటించిన హీరోయిన్ తమన్నా విలేకరుల సమావేశంలో సినిమాల విశేషాలని పంచుకున్నారు.
ఒక రోజు గ్యాప్ లో మీరు నటించిన భోళా శంకర్, జైలర్ సినిమాలు విడుదలౌతున్నాయి కదా ఎలా అనిపిస్తుంది ?
చాలా ఆనందంగా వుంది. రెండు సినిమాలు అన్నీ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు.. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ స్టార్స్. వారితో కలసి నటించడంతో నా కల నెరవేరినట్లయింది.
సైరాలో చిరంజీవిగారితో డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు కదా.. భోళా శంకర్ తో ఆ లోటు తీరిందా ?
అవును. పాట పేరు కూడా మిల్కీ బ్యూటీ అని పెట్టారు. రియల్లీ క్యూట్. చిరంజీవి గారితో డ్యాన్స్ చేసే అవకాశం రావడం చాలా అదృష్టం. డ్యాన్స్ లో ఇప్పుడు వాడుతున్న చాలా స్టయిల్స్ ఆయన దగ్గర నుంచే వచ్చాయి. భోళా శంకర్ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా.
చిరంజీవి గారితో డ్యాన్స్ అంటే ఎలా రిహార్సల్ చేశారు ?
మిల్కీ బేబీ పాట రొమాంటిక్ మెలోడి. ఒక హుక్ స్టెప్ వుంటుంది. అలాగే చాలా గ్రేస్ ఫుల్ మూమెంట్స్ వుంటాయి. స్విజ్జర్లాండ్ లో చాలా బ్యూటీఫుల్ గా షూట్ చేశాం.
భోళా శంకర్, జైలర్ చిత్రాలలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
భోళా శంకర్, వేదాళంకు రీమేక్. ఐతే మెహర్ రమేష్ గారు చాలా మార్పులు చేశారు. నా పాత్ర కొత్తగా వుంటుంది. నిజానికి నా పాత్ర ఒరిజినల్ లో అంత వుండదు. ఇందులో చాలా డిఫరెంట్ గా క్యారెక్టరైజేషన్ వుంటుంది. జైలర్ విషయానికి వస్తే.. అందులో స్మాల్ పార్ట్ లో కనిపిస్తా. క్యారెక్టర్ పరంగా రెండూ డిఫరెంట్ సినిమాలు. ఆడియో పరంగా జైలర్ లో కావలయ్య పాట చాలా మందికి రీచ్ అయ్యింది. భోళా శంకర్ లో నాది ఫుల్ లెంత్ రోల్. ఈ సినిమాతో చాలా అసోసియేషన్ వుంది.
మెహర్ రమేష్ గారి వర్కింగ్ స్టయిల్ ఎలా వుంటుంది ?
మెహర్ రమేష్ గారు చాలా క్యాజువల్ గా వుంటారు. ఇందులో నా పాత్రకు హ్యుమర్ వుంటుంది. సెట్స్ లో చాలా జాలీగా గడిచింది. హ్యూమర్, కామెడీని చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. మెహర్ గారు హ్యూమర్ ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.
కాళిదాస్ తర్వాత సుశాంత్ తో మళ్ళీ వర్క్ చేశారు కదా ?
అవునండీ. నిజంగా ఇది వండర్ ఫుల్ జర్నీ. తనతో మళ్ళీ కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఇందులో చాలా డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాం.
కీర్తి సురేష్ తో కాంబినేషన్ సీన్స్ చేయడం ఎలా అనిపించిది ?
కీర్తి సురేష్ అత్యుత్తమ నటి. తను ఇంటెన్స్ సీన్స్ తో పాటు అన్నీ ఎమోషన్స్ ని సెటిల్డ్ అండ్ బ్యాలెన్సింగా చేస్తుంది. తనతో కలసి పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాతో మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం.
భోళా శంకర్ సెట్స్ లో గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఏవైనా ఉన్నాయా ?
భోళా శంకర్ లో అద్భుతమైన తారాగణంతో పని చేశాం. భోళా శంకర్ నాకు చాలా మంచి అనుభవం. అన్నీ ఎలిమెంట్స్ వుండే కమర్షియల్ సినిమా చేశాను. ప్రేక్షకులకు కూడా నచ్చితుందనే నమ్మకం వుంది.
మీరు రామ్ చరణ్ గారితో కూడా పని చేశారు కదా.. చిరంజీవి గారికి చరణ్ కి ఎలాంటి పోలికలు గమనించారు ?
ఇద్దరూ అద్భుతమైన వ్యక్తులు. చాలా సపోర్టివ్ గా వుంటారు. నా కెరీర్ బిగినింగ్ నుంచి చాలా సపోర్టివ్ గా వున్నారు. చరణ్, చిరంజీవి గారితో వర్క్ చేయడం మంచి అనుభవం.
ఏకె ఎంటర్ టైన్మెంట్స్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
ఇంతకుముందే వారితో పని చేశాను. చాలా మంచి నిర్మాతలు. సినిమా అంటే వారికి చాలా ప్యాషన్. ఈ సినిమా ప్రయాణంలో ఎంతగానో సపోర్ట్ చేశారు. ఎక్కడా రాజీపడకుండా సినిమాకి కావాల్సింది సమకూర్చారు. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ తో పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.
భోళా శంకర్ మ్యూజిక్ గురించి ?
పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. మిల్కీ బ్యూటీ, జామ్ జామ్ పాటలు నాకు నాకు చాలా నచ్చాయి. జామ్ జామ్ పాటలో నర్సపల్లి అనే ట్విస్ట్ పెట్టడం పార్టీ సాంగ్ కి మరింత అందాన్ని తీసుకొచ్చింది. అది గొప్ప ఆలోచన.
కొత్త సినిమాల గురించి ?
తమిళంలో అరణం అనే సినిమా చేస్తున్నా. మలయాళంలో బాంద్ర సినిమా విడుదలకు సిద్ధమౌతుంది. అలాగే హాట్ స్టార్ లో ఓ వెబ్ సిరిస్ చేస్తున్నా.
ఆల్ ది బెస్ట్
థాంక్స్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…