‘ది ఫిక్సర్ ఈజ్ బ్యాక్’… జూన్13 నుంచి నెట్ఫ్లిక్స్లో ‘రానా నాయుడు సీజన్2’ స్ట్రీమింగ్
హైదరాబాద్, మే21, 2025: హైదరాబాద్లో ప్రముఖమైన ప్రసాద్ సినిమాస్ దగ్గర అభిమానులు, ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు. అందరిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ ప్రత్యేకమైన వేడుకలకు విలక్షణ నటుడు రానా దగ్గుబాటి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వెర్సటైల్, డైనమిక్ యాక్టర్ అర్జున్ రాంపాల్ కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు. నెట్ఫిక్స్లో సూపర్ హిట్ అయిన సిరీస్ రానా నాయుడు సీజన్2 కోసం ఈ ఇద్దరు స్టార్స్ తమదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చేసి రానా నాయుడు సీజన్2 భారీ పోస్టర్ను విడుదల చేశారు.
రానా నాయుడు సీజన్2 కోసం ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ సరికొత్త ఫస్ట్లుక్ను విడుదల చేయటం విశేషం. జూన్13 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న రానానాయుడు సీజన్2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సీజన్ వన్ కంటే సీజన్2 మరింత వైల్డ్గా ఉంటుంది’ అని పేర్కొన్నారు రానా. ‘ఈ సీజన్ మరింత పెద్దదిగా, వ్యక్తిగతంగా ఉంటుంది. రానానాయుడు సీజన్2 కోసం మరోసారి టీమ్ను కలవటం చాలా ఆనందంగా ఉంది. పాత్రలు మరింత లోతుగా ఉంటాయి. అవన్నీ గందరగోళంగా అనిపిస్తాయి. అన్నీ విషయాల్లో హద్దులను మరింతగా పెంచాం. మీరు ఇష్టపడిన విషయాలను మరో లెవల్కు తీసుకెళ్లాం. మొదటి సీజన్కు అభిమానుల నుంచి గొప్ప స్పందన వచ్చింది. ఇప్పుడు సీజన్2కి సంబంధించిన ఫస్ట్ లుక్ను అభిమానుల సమక్షంలో ఎక్స్క్లూజివ్గా విడుదల చేయటం ఆనందంగా ఉంది. నేను నేను రానా నాయుడుగా నటిస్తే, రవుఫ్ పాత్రలో అర్జున్ రాంపాల్ నటించారు. ఇద్దరం ఢీ అంటే ఢీ అనేలా నటించాం. కానీ హైదరాబాద్లో నేను హోస్ట్గా వ్యవహరిస్తున్నాను’ అని రానా తెలిపారు.
అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ ‘‘రవుఫ్ పాత్రకు జీవం పోయటం చాలా కష్టమైంది. అయితే కరణ్ అన్షుమన్ పట్టుదల, అంకితభావంతో అది సాధ్యమైంది. ఆయన పాత్రల్లో అనేక వేరియేషన్స్ చూపిస్తూ చక్కగా రాశారు. దీని వల్ల నా పాత్రను నేను చేయటం చాలా సులభమైంది. చాలా ఎంజాయ్ చేశాను. ఎలాంటి భయం లేని రానా నాయుడుకి ఈ సీజన్లో చాలా కష్టాలుంటాయి. పాత్ర పరంగా నేను చాలా కఠినంగా నటించినప్పటికీ షూటింగ్ సమయంలో నేను రానాతో చక్కగా కలిసిపోయాను. తను చాలా మంచి కోస్టార్. తనతో వర్క్ చేయటం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక వెంకటేష్ కూడా అలాంటి సరదా వ్యక్తే. సూపర్ టాలెంటెడ్ టీమ్తో కలిసి పనిచేశాను. నెట్ఫ్లిక్స్లో నేను చేసిన మొదటి సిరీస్ కావటంతో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ సీజన్ గొప్పగా రావటానికి మేకర్స్ ఎంతగానో ఇన్వాల్వ్ అయ్యారు. మంచి ఔట్పుట్ రావటం కోసం దోహదపడ్డారు. కరణ్, సుపర్ణ్, అభయ్.. ఇలా ముగ్గురు దర్శకులతో ఒకేసారి పని చేయటం నాకు కూడా మొదటిసారే. ముగ్గురు వేర్వేరు వ్యక్తులైనప్పటికీ వారి ఆలోచనలు, మేకింగ్ సరిగ్గా ఒకటే అన్నట్లున్నాయి. ఇప్పుడు రానా నాయుడు సీజన్2 ఫస్ట్ లుక్తో అభిమానులు సంతోషపడుంటారు. జూన్13కి ఎంతో సమయం లేదు. నెట్ఫ్లిక్స్ను ట్యూన్ చేసుకోండి’’ అన్నారు.
రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి కర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా వంటి తారాగణంతో, రానా నాయుడు సీజన్ 2 ప్రేక్షకులు కోరుకునే డ్రామా, సంఘర్షణ, భావోద్వేగాలతో తుఫాను సందడిని సృష్టించటానికి సిద్ధంగా ఉంది. సుందర్ ఆరోన్ మరియు లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ సిరీస్ను కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేయగా.. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ, మరియు అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు. కుటుంబ సమీకరణాలు మరింత సంక్లిష్టంగా మారడం, వ్యక్తుల్లోని విధేయతలు మరింతగా పరీక్షింపబడతాయి.జూన్13న నెట్ఫ్లిక్స్లో నాయుడు కుటుంబం ఓ తుపాను సందడి అందించటానికి సిద్ధమవుతోంది.
క్రియేటర్: కరణ్ అన్షుమన్
దర్శకత్వం: కరణ్ అన్షుమన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా
రచయితలు: కరణ్ అన్షుమన్, రాయన్ సోరెస్, కర్మణ్య అహుజ, అనన్య మౌడి, కరణ్ గౌర్, వైభవ్ విశాల్
నిర్మాత: సుందర్ అరోన్
నిర్మాణ సంస్థ: లోకో మోటివ్ గ్లోబల్ మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విశాల్ బజాజ్, నిశాంత్ పాండే, ఆరిఫ్ మిర్
ప్రధాన తారాగణం: రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్విన్ చావ్లా, కృతి కర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మారియో
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…