ప‌వ‌న్ క‌ళ్యాన్ గారి స్ఫూర్తితో జీరో బ‌డ్జెట్ మూవీ ‘గండ’

జీరో  బడ్జెట్ తో పాలిటిక్స్ ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాన్ గారి స్ఫూర్తితో నిర్మించిన జీరో బ‌డ్జెట్ మూవీ ‘గండ’

 సినిమా అంటేనే కోట్ల బడ్జెట్ తో కూడుకున్న వ్య‌వ‌హారం.  అలాంటిది జీరో బ‌డ్జెట్ తో సినిమా సాధ్య‌మా? అంటే సాధ్య‌మే అంటూ వార‌ణాశి సూర్య ఓ వినూత్న ప్ర‌యోగానికి తెర‌తీస్తూ ఈజీ మూవీస్ బేన‌ర్ పై `గండ` అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు.  జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాన్ స్ఫూర్తితో జీరో బ‌డ్జెట్ మూవీని తెర‌కెక్కించా అంటున్నారు ద‌ర్శ‌కుడు వార‌ణాశి సూర్య‌. ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ర‌చ‌యిత శివ‌శ‌క్తి ద‌త్త‌ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.


ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ర‌చ‌యిత  శివశ‌క్తి ద‌త్త మాట్లాడుతూ...“ వార‌ణాశి సూర్య చేస్తోన్న‌జీరో బ‌డ్జెట్ చిత్రం గురించి విని మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయాను…ఆ త‌ర్వాత‌ ఆనందించాను. ఈ సినిమా స‌క్సెస్ కావాలని మ‌న‌స్పూర్తిగా ఆశీర్వ‌దించాను.  డ‌బ్బు లేకున్నా చేయాల‌న్న ఉత్సాహం, త‌పన ఉంటే చాలని ఈజీ సినిమా వారు ఈ సినిమాతో నిరూపిస్తున్నారు. ఈ ప్ర‌యోగం ఎంతో మంది ఔత్సాహికుల‌కు ఆద‌ర్శంగా నిలవాల‌నీ,  ఈ సినిమా  ట్రెండ్ సెట్ట‌ర్ గా మారాల‌ని కోరుకుంటున్నా. గండ అంటే మ‌గ‌వాడు అని అర్థం. ఈ సినిమా గండ‌రగండ‌డుగా పేరు తెచ్చుకోవాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటూ వార‌ణాశి సూర్య‌కు నా అభినంద‌న‌లు“ అన్నారు.

 ద‌ర్శ‌కుడు వార‌ణాశి సూర్య మాట్లాడుతూ...“నేను కూడా మీడియా వ్య‌క్తినే. సినిమా మీద ప్యాష‌న్ తో ఈ రంగంలోకి వ‌చ్చాను.  తెలుగు సినిమా చ‌రిత్ర‌లో మొద‌టి జీరో బ‌డ్జెట్ మూవీ గండ. మా టీమ్ అంతా కొత్త‌వారే. కంటెంట్ న‌మ్ముకుని సినిమా తీశాం. నాకు తెలిసింది సినిమా ఒక్క‌టే. అన్నీ వ‌దిలేసి ఈ సినిమా చేశాను. ఈ జీరో బ‌డ్జెట్ సినిమాకు క‌ర్త‌,క‌ర్మ‌, క్రియ అన్నీ నేనే. మొద‌టి నుంచి స‌పోర్ట్ చేస్తూ వ‌స్తోన్న మా టీమ్  మెంబ‌ర్స్ కీ ధ‌న్య‌వాదాలు. ఇక నుంచి మా సంస్థ నుండి వ‌రుస జీరో  బ‌డ్జెట్  చిత్రాలు వ‌స్తాయి. మా జీరో బ‌డ్జెట్ సినిమాకి  అన్ని విధాలుగా  స‌హ‌కరిస్తోన్న ప్ర‌ముఖ ర‌చ‌యిత శివ‌శ‌క్తి ద‌త్త గారు ఇక్క‌డికి వ‌చ్చి మా టీమ్‌ని, మా ప్ర‌య‌త్నాన్ని ప్రోత్స‌హిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు.  ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ తో యుద్ధం కొన‌సాగిస్తున్న‌ప్పుడు…సినిమా ఇండ‌స్ట్రీలో జీరో బ‌డ్జెట్ మూవీస్ఎందుకు చేయ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌తో ఈ సినిమా ప్రారంభించాం. ఆర్జీవీ గారు జీరో బడ్జెట్ మూవీస్ చేయొచ్చ‌ని ప‌న్నేండేళ్ల క్రిత‌మే చెప్పారు. అది కూడా ఈ సినిమాకు ఓ ఇనిస్పిరేష‌నే. ఈ సినిమా పై మా టీమ్ అంతా ఐదేళ్లు వ‌ర్క్ చేసాము. ఒక కొత్త ప్ర‌య‌త్నం ఎప్పుడూ మొద‌ట ఎన్నో విమ‌ర్శ‌ల‌కు. అవ‌మానాల‌కు గుర‌వుతుంది..అలాంటి ఎన్నో అవ‌మానాలు, విమ‌ర్శ‌లు  త‌ట్టుకుంటూ ఈ సినిమా పూర్తి చేశాను.  ప్ర‌స్తుతం టీజ‌ర్ రిలీజ్ చేస్తున్నాం. త్వ‌ర‌లో ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఈజీ సినిమా సంస్థ కొన్ని వేల మంది ఆర్టిస్టుల‌కు, టెక్నీషియ‌న్స్ కు అవ‌కాశాలు క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఇక‌పై ఇండ‌స్ట్రీలో జీరో బ‌డ్జెట్ సినిమాలు చూస్తారు.  కంటెంట్ ని న‌మ్ముకుని ఈ సినిమా చేశాను. మేము చేస్తున్న ఈ ప్ర‌యోగానికి మీడియా స‌పోర్ట్ ఉంటుంద‌ని ఆశిస్తున్నా“ అన్నారు.

Tfja Team

Recent Posts

‘మా రాముడు అందరివాడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా : సీనియర్ నటులు సుమన్

v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా ‌‌: హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…

13 hours ago

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

2 days ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago