డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి, యలమంచిలి గీత, న్యూ టాలెంట్ రోర్స్ @ నుంచి గ్రేస్ఫుల్ నందమూరి తారక రామారావు ఫస్ట్ దర్శన్ లాంచ్
తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ శ్రీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్పై యలమంచిలి గీత నిర్మించనున్నారు.
డైరెక్టర్ వైవిఎస్ చౌదరి, అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ నందమూరి తారక రామారావు గ్రేస్ఫుల్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని లాంచ్ చేశారు. ఈ వీడియో వైవిఎస్ చౌదరి క్రియేటివ్ విజన్, యంగ్ హీరోకి తనపై ఉన్న కాన్ఫిడెన్స్ ని ప్రజెంట్ చేస్తోంది.
ఎన్టీఆర్ తన పొడవాటి జుట్టు, దృఢమైన శరీరాకృతితో అందంగా, ఆకర్షణీయంగా కనిపించారు. అర్ధవంతమైన పాత్రలను ఎంచుకుని ప్రేక్షకులను అలరిస్తానని, పరిశ్రమకు విధేయుడిగా ఉంటానని తన తాత ఎన్టీఆర్పై ప్రమాణం చేస్తూ ఆయన ప్రతిజ్ఞ చేశారు. వైవీఎస్ చౌదరి ఆధ్వర్యంలో 18 నెలల పాటు వివిధ విభాగాల్లో శిక్షణ పొందానని, తన అంకితభావాన్ని వెల్లడించారు.
ఈ యువ హీరో స్టార్గా ఎదగడానికి కావలసిన అన్ని లక్షణాలను ప్రదర్శిస్తూ తన బేస్ వాయిస్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. YVS చౌదరి అతనిని డైనమిక్ పాత్రలో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ చిత్రంలో ప్రతిభావంతులైన కూచిపూడి నృత్యకారిణి, తెలుగు నటి వీణా రావు కథానాయికగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.ఆస్కార్-విజేత MM కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. మరొక ఆస్కార్-విజేత చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నారు. స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ భారీ అంచనాల చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు.
నందమూరి తారక రామారావు విభిన్న సామర్థ్యాలను హైలైట్ చేసేలా వైవిఎస్ చౌదరి కథ, స్క్రీన్ప్లే రూపొందించారు. ఇది తెలుగు సినిమా అభిమానులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది.
ఫస్ట్ దర్శన్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ… నేను రాసుకున్న కథని మోయగలిగి, ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే దమ్మున్న క్యారెక్టర్ ని పోషించగల సత్తా ఉన్న ప్రధాన సూత్రధారి అయిన కథానాయకుడిని ఈ వేడుక ద్వారా మీ అందరికీ పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిపై వున్న అభిమానం, ఇష్టంతో పరిశ్రమలోకి వచ్చాను. ఆయన ప్రోత్సాహం వల్లే ఇప్పుడు ఈ స్థానంలో వున్నాను. ఎన్టీఆర్ అనే పేరు మూడు అక్షరాల తారకమంత్రం. ఆరడుగుల రూపం ఈ తారక రామారావుది. ఈ హీరోకు కుటుంబం నుంచి పూర్తి ఆశీస్సులు వుంటాయి. నేను అందరి హీరోల అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తాను. నేను ఇప్పటివరకు పరిచయం చేసిన హీరోలందరినీ ఫ్యాన్స్ ఆదరించారు. అలానే ఈ తారకరామారావును కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మొదటిసారి ఎన్టీఆర్ని చూడగానే అతడి కళ్లు, కనుబొమ్మలు నన్ను ఆకట్టుకున్నాయి. ఎంతో అణుకువగా ఉంటారు. అతడి వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉంటుంది. నందమూరి కుటుంబంలో నుంచి అద్భుతమైన హీరో అవుతాడని నమ్మకం ఉంది. ఎన్టీఆర్ గారి జీవితంలో కొత్త అధ్యాయానికి తెరలేపిన చిత్రం సర్దార్ పాపారాయుడు. ఆ చిత్రం అక్టోబర్ 30న రిలీజ్ అయింది. ఇదే రోజున మా ఈ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ చిత్రం రిలీజ్ అయిన రోజునే ఇంకో నందమూరి తారక రామారావు ని పరిచయం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. రాఘవేంద్రరావు గారు ఈ వేడుకకు వచ్చి ఆశీర్వాదం అందించడం చాలా గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. అలాగే అశ్విని దత్ గారితో నా ప్రయాణం చాలా గొప్పది. అలాగే రామారావు గారితో వాళ్ళిద్దరి ప్రయాణం అద్భుతం. అలాంటి గొప్పవ్యక్తులు ఇద్దరు వచ్చి ఈ రోజున మా యువ హీరో పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సభా పూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ మా కథానాయకుడికి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను’అన్నారు.
డైరెక్టర్ కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు, అతిధులకు నమస్కారం. నందమూరి వంశంలో కొత్త శకం ప్రారంభమైంది. ఈ పిక్చర్ తో నిర్మాత, దర్శకుడు, కొత్తగా పరిచయం అవుతున్న హీరో అఖండ విజయం సాధించాలని, అన్నగారి ఆశీస్సులతో ఈ పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయి అందరికీ మంచి పేరు తేవాలని ఆశిస్తున్నాను’ అన్నారు.
ప్రొడ్యూసర్ అశ్విని దత్ మాట్లాడుతూ..పాత్రికేయ మిత్రులకు నమస్కారం. మా చౌదరి ఇలాంటి గొప్ప పని ఎంతో ఓర్పుతూ నేర్పుతో చేసి నిలదొక్కుకుంటాడని నాకు మా సంస్థలో అతను పనిచేసిన రోజుల నుంచి గొప్ప అభిమానం. అదే విధంగా ప్రూవ్ చేశాడు. ఆల్ ది బెస్ట్ చౌదరి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అన్నారు
తారాగణం: నందమూరి తారక రామారావు, వీణా రావు
సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్ప్లే & దర్శకత్వం: వైవిఎస్ చౌదరి
బ్యానర్: న్యూ టాలెంట్ రోర్స్ @
నిర్మాత: యలమంచిలి గీత
సంగీతం: ఎంఎం కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ అత్తిలి
పీఆర్వో: వంశీ-శేఖర్
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…