యూనిక్ ఎంట‌ర్‌టైన‌ర్ థ్రిల్ల‌ర్‌గా యేవ‌మ్ అంద‌ర్ని అల‌రిస్తుంది

యూనిక్ ఎంట‌ర్‌టైన‌ర్ థ్రిల్ల‌ర్‌గా యేవ‌మ్ అంద‌ర్ని అల‌రిస్తుంది: ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ దంతులూరి

చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ప్రకాష్‌ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ దంతులూరి బుధ‌వారం మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలివి.

మీ నేప‌థ్యం ఏమిటి?
సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా నా కెరీర్ ప్రారంభ‌మైంది. ఓ టైమ్‌లో హిందీలో ల‌గాన్‌, తెలుగులో ఖుషి సినిమాలు న‌న్ను ద‌ర్శ‌కుడిగా మార‌డానికి ప్రేర‌ణ ఇచ్చాయి. అందుకే యూఎస్‌లో రిజైన్ చేసి ఇండియాకు వ‌చ్చాను. ఆ స‌మ‌యంలో
నేను రాసుకున్న ఓ క‌థ ప్రియాంక ద‌త్ గారికి వినిపించాను. అశ్వ‌నీద‌త్ గారు కూడా క‌థ విని నాకు ద‌ర్శ‌క‌త్వం అవ‌కాశం ఇచ్చారు. నా తొలిసినిమా వైజ‌యంతీ మూవీస్‌లో ఓంశాంతి సినిమా చేశాను. ఈ సినిమా త‌రువాత నా బిజినెస్‌ల్లో బిజీగా అవ్వ‌డం వ‌ల్ల చాలా గ్యాప్ తీసుకున్నాను. కోవిడ్ గ్యాప్‌లో మ‌ళ్లీ సినిమా చేయాల‌ని అనిపించింది. అనుకోకుండా న‌వ‌దీప్‌ను క‌ల‌వ‌డం ఆస‌మ‌యంలోనే సీస్పెస్ పెట్ట‌డం, ఆ టైమ్‌లో క‌లుసుకున్నాను. న‌వ‌దీప్‌కు కాన్సెప్టు న‌చ్చి ఈ సినిమాకు నిర్మాత‌గా మారాడు.

యేవ‌మ్ టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏమిటి?
యేవ‌మ్ అనేది సంస్కత ప‌దం, ఇతిహాసాలు, పురాణాలు చెప్పిన‌ప్పుడు ఇది ఇలా జ‌రిగింది అని చెప్ప‌డాన్నియేవ‌మ్ అంటారు. ఈ సినిమాలోని పాత్ర‌లు రియ‌ల్‌లైఫ్ పాత్ర‌ల్లా వుంటాయి. న‌లుగురు విభిన్న‌మైన వ్యక్తుల క‌థ ఇది. వంశీ అన్వేష‌ణ లాంటి థ్రిల్ల‌ర్‌ను మ‌న‌కు తెలిసిన పాత్ర‌ల‌తో చెబితే ఎలా వుంటుంది అనేది యేవ‌మ్‌.

ఎవ‌రికి తెలియ‌ని ఈ టైటిల్ పెట్ట‌డం రిస్క్ అనిపించ‌లేదా?
ఈ టైటిల్ అర్థం ఎవ‌రికి తెలియ‌నిది అని తెలుసు. కానీ క‌థ‌కు ఇదే యాప్ట్ టైటిల్‌. ఒక్క‌సారి సినిమా చూసిన త‌రువాత ఈ టైటిల్ గురించి అర్థం అవుతుంది. టైటిల్ గురించి ఇంత డిస్క‌ష‌న్ జ‌ర‌గ‌డం కూడా మాకు ప్ల‌సే అవుతుంది.

యేవ‌మ్ పోలీసాఫీస‌ర్ క‌థ అనుకోవ‌చ్చా?
పోలీసాఫీస‌ర్ క‌థ అయినా చాలా ఎంట‌ర్‌టైనింగ్ థ్రిల్ల‌ర్ ఇది. ప‌త్రి పాత్ర కూడా ఎంతో యూనిక్‌గా వుంటుంది. సినిమా మొత్తం సీరియ‌స్ మూడ్‌లో వుండ‌దు. ప్ర‌తి స‌న్నివేశాన్నిఆడియ‌న్స్ ఎంజాయ్ చేస్తారు.

ఈ సినిమా క‌థ‌కు మూలం ఏమిటి?
నేటి స‌మాజంలోని వ్య‌క్తుల‌ను చూసి రాసుకున్న పాత్ర‌లే ఇవి. ప్ర‌తి ఒక్క‌రికి జీవితంలో కొన్ని ల‌క్ష్యాలుంటాయి. ఆ ల‌క్ష్యాల‌ను చేదించ‌డానికి వాళ్లు ప‌డే స్ట్ర‌గుల్ ఈ క‌థ‌. అయితే చిత్రంలో ఓ అమ్మాయి త‌ను అనుకున్న గోల్‌ను ఎలా చేరుకుంది?
అనేది ఎంతో ఆస్త‌కిక‌రంగా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. స‌మాజంలోని పాత్ర‌లు, నా మైండ్‌లో రిజిస్ట‌ర్ అయిన పాత్ర‌ల్లోంచి వ‌చ్చిందే యేవ‌మ్

ఈసినిమాలోని పాత్ర‌ల గురించి?
ఈ సినిమాలో పాత్ర‌ల గురించి చెబితే క‌థ తెలిసిపోతుంది. అందుకే పూర్తిగా చెప్ప‌లేం. కానీ క్యారెక్ట‌ర్స్‌ను ఒక పోస్ట‌ర్ ద్వారా వాళ్ల పాత్ర‌ల‌ను తెలియ‌జేశాం. ఇంత‌కంటే ఎక్కువ చెబితే క్యారెక్ట‌ర్‌లోని కిక్ పోతుంది.

చాందిని చౌద‌రి పాత్ర ఎలా వుంటుంది?
చాందిని చౌద‌రి సౌమ్య పాత్ర‌లో లీన‌మైపోయింది. ప్ర‌తి స‌న్నివేశం బాగా చేసింది. ఆమెకు న‌టిగా మంచి పేరును తీసుక‌వ‌స్తుంది.

ఈ సినిమాకు నేప‌థ్యం సంగీతం ఎంత వ‌ర‌కు ప్ల‌స్ అవుతుంది?
నేప‌థ్య సంగీతం క‌థను చెప్పాలి. క‌థ‌ను ఇబ్బంది పెట్ట‌కూడ‌దు. ఈ సినిమాకు ఫీమేల్ సంగీత ద‌ర్శ‌కురాలు నేప‌థ్య సంగీతం అందించింది. చాలా బాగా చెసింది. నేప‌థ్య సంగీతం క‌థ‌లోని ఎమోష‌న్స్ చెబుతుంది.

ఈ సినిమాను థియేట‌ర్‌లోనే ఎందుకు చూడాలి?
ఈ సినిమా మేమే థియేట‌ర్ కోసం చేసింది. టెక్నిక‌ల్‌గా కూడా థియేట్రిక‌ల్ ఎక్స్ పీరియ‌న్స్ కోసం తీశాం. ఇది థియేట‌ర్‌లో చూడ‌ద‌గ్గ సినిమా.సినిమాను థియేట‌ర్‌లో చూసిన ఫీల్ ఓటీటీలో రాదు. థియేటిక్ర‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ బెట‌ర్ దెన్ ఓటీటీ

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

14 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago