“క” విజయంతో ప్రేక్షకులు తమ ఇంట్లో అబ్బాయిగా నన్ను అక్కున చేర్చుకున్నారు కిరణ్ అబ్బవరం

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. “క” సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి “క” సినిమా సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా రెండు రోజుల్లో 13.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డీవోపీ విశ్వాస్ డేనియల్ మాట్లాడుతూ – “క” సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా సంతోషాన్నిస్తోంది. నాకు మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నారు హీరో కిరణ్ గారు. ఆయనకు నేను ఎంతగానో కృతజ్ఞతలు చెబుతున్నా. మరో డీవోపీ సతీష్ రెడ్డిని నా ఆత్మలా భావిస్తా. డైరెక్టర్స్ సుజీత్, సందీప్ లో సుజీత్ నేను క్లోజ్ ఫ్రెండ్స్. ఈ సినిమాకు ఎంతో కష్టపడినా ఇష్టంతో వర్క్ చేశాం. ఈ రోజు ప్రేక్షకులు ఆ ఔట్ పుట్ ను థియేటర్స్ లో ఆదరిస్తున్నారు. అన్నారు.

డీవోపీ సతీష్ రెడ్డి మాసం మాట్లాడుతూ – మా మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. మేమంతా ఒక ఫ్యామిలీలా టీమ్ ఎఫర్ట్ పెట్టి పనిచేశాం. కిరణ్ గారు మాకు ముందు నుంచీ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ప్రొడ్యూసర్ గోపి గారి సపోర్ట్ వల్లే మేమంతా ఇంత బాగా వర్క్ చేయగలిగాం. అన్నారు.

ఎడిటర్ శ్రీ వరప్రసాద్ మాట్లాడుతూ – కంటెంట్ బాగుంటే సినిమాను చిన్నా పెద్దా అని తేడాలు చూడం, తప్పకుండా ఆదరిస్తామని ప్రేక్షకులు “క” సక్సెస్ తో మరోసారి ప్రూవ్ చేశారు. అన్నిచోట్ల నుంచీ హౌస్ ఫుల్ రిపోర్ట్ వస్తోంది. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని చెప్పడం ఎంతో హై ఫీలింగ్ కలిగిస్తోంది. అన్నారు.

నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ – కిరణ్ గారు ఫస్ట్ క సినిమా స్క్రిప్ట్ నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆయన కళ్లల్లో ఒక పట్టుదల చూశాను. కంటెంట్ చాలా కొత్తగా ఉంది అనిపించింది. మా సినిమాకు టీమ్ అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. ఒక సక్సెస్ ఫుల్ సినిమా ఇవ్వాలని టీమ్ వర్క్ చేశారు. అలాగే వీలైనంత తక్కువలో ఎంత బాగా సినిమా చేయాలని వాళ్లు ప్రయత్నించారు. ప్రొడ్యూసర్ ను కాపాడుకోవాలి, అతను బాగుంటే ఇంకా సినిమాలు చేస్తాడని మా టీమ్ గట్టిగా కృషి చేసింది. కిరణ్ గారు ఎక్కువగా మాట్లాడేవారు గీత గోవిదంలో విజయ్ దేవరకొండలా, నేను రశ్మికలా తక్కువ మాట్లాడేవాడిని. ఈ రోజు అవన్నీ రీకాల్ చేసుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంది. నేనేనా ఇంత పెద్ద సూపర్ హిట్ సినిమా చేశాను అనిపిస్తోంది. ఇంకా నమ్మకం కుదరడం లేదు అందుకే సక్సెస్ కిక్ రావడం లేదు. నా టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నా. అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – క సినిమా నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఈ సినిమాతో ఏదో మ్యాజిక్ జరుగుతుంది, మనం ఇరవై కోట్లు కాదు వంద కోట్ల సినిమా కొడుతున్నాం అని కిరణ్ చెప్పాడు. అతని మాటలే నాలో ఎంతో నమ్మకాన్ని కలిగించాయి. ఈ సినిమాను పెద్ద సంస్థలు కావాలని అడిగినా కిరణ్ గారి మాట మీద నాకే డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గోపి గారికి థ్యాంక్స్. గోపి గారి లాంటి ప్రొడ్యూసర్ బాగుంటే కిరణ్ లాంటి హీరోలు మరో పది మంది వస్తారు. నాలాంటి వాళ్లు మరో వంద సినిమాలు చేస్తారు. అన్నారు.

డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ – క సినిమాకు ఘన విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. మా డైరెక్షన్ టీమ్ రాత్రీ పగలూ కష్టపడ్డారు. వారికి థ్యాంక్స్ చెబుతున్నా. సినిమాల విషయంలో చిన్నా పెద్దా అనేది లేదు. మనకున్న బడ్జెట్ లో ఎంత బాగా సినిమాను రూపొందించాము అనేది ఇంపార్టెంట్. క సినిమా విషయంలో మేము అలాంటి ప్రయత్నం చేశాం. మాకున్న సోర్సెస్ లో ఒక మంచి మూవీ మీ ముందుకు తీసుకొచ్చాం. ఫ్యూచర్ లోనూ ఇలాంటి మంచి మూవీస్ చేయాలనుకుంటున్నాం. అన్నారు.

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ – మా మూవీ థియేటర్ లో చూసేందుకు వెళ్తాను. ఆడియెన్స్ మధ్య కూర్చుని చూస్తానని అడిగితే థియేటర్ వాళ్లు సీట్స్ ఖాళీగా లేవు అన్నారు. ఒక నాయికగా నాకు ఇంతకంటే సంతోషించాల్సిన విషయం మరొకటి లేదు. మా క మూవీకి ఆడియెన్స్ అంత బాగా ఆదరణ చూపిస్తున్నారు. నా కెరీర్ లో సత్యభామ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అన్నారు.

డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతూ – ఫస్ట్ టైమ్ డైరెక్టర్స్ అయిన మాకు క వంటి బ్లాక్ బస్టర్ తొలి చిత్రంతోనే దక్కడం చాలా సంతోషంగా ఉంది. మా మొదటి సినిమానే హౌస్ ఫుల్స్ చూస్తున్నాం. క ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఇలాంటి స్క్రిప్ట్ ను ప్రేక్షకులంతా ఆదరిస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారంటే ఆనందంగా ఉంది. మాకు సపోర్ట్ గా నిలిచిన కిరణ్ గారితో పాటు టీమ్ లోని ప్రతి మెంబర్ కు మేము థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ – పండుగ కాంపిటేషన్ లో రిలీజైన మా క సినిమాకు పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇలాంటి సరికొత్త కంటెంట్ తో సినిమా చేసిన మా డైరెక్టర్స్ కు, అలాగే సినిమాను ఇంత బాగా వచ్చేలా అన్ని విషయాలూ చుసుకున్న కిరణ్ గారికి థ్యాంక్స్. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – క సినిమాకు ఘన విజయాన్ని అందించి ఈ దీపావళికి నాకు పెద్ద పండుగ ఇచ్చారు. మన తెలుగు ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. నన్ను గతంలో పక్కింటి కుర్రాడి ఇమేజ్ తో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు మన ఇంటి అబ్బాయి అని భావిస్తున్నారు. టికెట్స్ కావాలని, ఇంకా థియేటర్స్ పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. సినిమా పరిశ్రమ నుంచి కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. అరవింద్ గారు, నాగవంశీ గారు, 14 రీల్స్ రామ్, గోపి గారు వీళ్లంతా శుభాకాంక్షలు తెలిపడం సంతోషంగా ఉంది. ఈ నెల 8వ తేదీన మలయాళంలో క సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అలాగే తమిళనాట ఉన్న తెలుగు ప్రజలు తమకు షోస్ కావాలని అడుగుతున్నారు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాక తమిళనాట ఎందుకు రిలీజ్ చేయడం లేదని అంటున్నారు. డిస్ట్రిబ్యూటర్ వంశీ గారిని తమిళనాట షోస్ వేయమని అడుగుతున్నా. ఫ్యామిలీస్ అంతా కలిసి మా క సినిమా చూసేందుకు వెళ్తున్నారు. అన్నిచోట్లా హౌస్ ఫుల్స్ కనిపించడం సంతోషంగా ఉంది. ఈ ట్రెండ్ ప్రీమియర్స్ నుంచే మొదలైంది. అన్నారు. క సినిమా విజయం నాకు ఈ గౌరవాన్ని తీసుకొచ్చింది. హిట్ కొట్టాడు అనకుండా హిట్ కొట్టేశాము అంటున్నారు. ఇది తమ విజయంగా భావిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. ఒక హీరోగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి. ఇంతమంది ఆదరణ ప్రేమ దక్కుతున్నాయి. ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందా అనేది కాదు, ప్రేక్షకులకు చేరువైంది అనే విషయమే ఎక్కువ సంతోషాన్ని ఇస్తోంది. క సినిమాకు తప్పకుండా సీక్వెల్ చేస్తాం. అది కృష్ణగిరి ఊరి ప్రత్యేకతలతో ఉంటుంది. అన్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం, తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – శ్రీ వరప్రసాద్
డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – సామ్ సీఎస్
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చవాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
లైన్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
సీయీవో – రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్ – అనూష పుంజ్ల
మేకప్ – కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్ – రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ – పొలాకి విజయ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – ఫణిరాజా కస్తూరి
కో ప్రొడ్యూసర్స్ – చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన దర్శకత్వం – సుజీత్, సందీప్

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

16 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago