‘మై డియర్ దొంగ లాంటి కాన్సెప్ట్ సినిమాలే చేస్తాం: మహేశ్వర్ రెడ్డి

సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో

మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సాడా మాట్లాడుతూ..‘‘అభినవ్‌తో స్టార్ చేస్తే.. 2014లో మేము తీసిన ఫస్ట్ మూవీ ‘జగన్నాటకం’లో కూడా అభినవ్ దొంగ క్యారెక్టర్ చేశాడు. మళ్లీ ఇప్పుడు పదేళ్ల తర్వాత దొంగ పాత్ర చేశాడు. ఇందులో కామెడీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ర్యాడికల్ కామెడీ ఉంది. మ్యూజిక్ అంతా ఎంజాయ్ చేస్తూ చేశా. ఆహా గురించి చెప్పక్కర్లేదు. ఆహా నుంచి ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తాయని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

నిర్మాత మహేశ్వర్‌‌రెడ్డి మాట్లాడుతూ..‘‘మై డియర్ దొంగ అంటే ఈ టీమ్‌లో శాలిని. ఆమె ఒక స్టోరీ రాసి, అందులో నటించడం అంటే చాలా గొప్ప విషయం. ఆమె ఒక డైరెక్టర్‌ను సెలెక్ట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్‌ను ఇంత సక్సెస్ చేయడంలో ఆమే కీలకం. తర్వాత ఆహా ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహరించింది. ఎంతోమంది కొత్త టాలెంట్‌ను గుర్తించి వాళ్లకు క్రియేటివ్ ఫ్రీడమ్‌ను ఇచ్చింది ఆహా. చాలా తక్కువ బడ్జెట్‌లో, తక్కువ టైమ్‌లో మంచి అవుట్‌పుట్ ఇచ్చిన డైరెక్టర్ సర్వాంగ రియల్లీ గ్రేట్. మ్యూజిక్ ఈ సినిమాకు గ్రేట్ ఎసెట్. శాలిని, అభినవ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయి. క్యామ్(CAM) ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ముగ్గురు వ్యక్తులు. వాళ్లు చంద్ర, అభిలాష్, మహేశ్. కొత్తవాళ్లతో మేము ఫ్రెండ్లీగా సినిమాలు చేయాలనుకుంటున్నాము. మంచి స్టోరీస్ ఉన్నవాళ్లు మమ్మల్ని సంప్రదించండి’’ అని చెప్పారు.

నటుడు నిఖిల్ మాట్లాడుతూ..‘‘ఇది నా ఫస్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్. అభినవ్ అన్న నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సిద్ధు, అడివి శేష్ లాగా శాలినీ తనే కథ రాసి యాక్ట్ చేయడం నిజంగా గొప్ప విషయం. ఇందులో యాక్ట్ చేసిన వాళ్లలో ఒక్కరి నుంచి ఒక్కో విషయం నేర్చుకున్నా. నాలాంటి కొత్త నటుడి నమ్మినందుకు ఆహాకు థ్యాంక్స్. ’’ అని అన్నారు.

నటి స్నేహల్ మాట్లాడుతూ..‘‘డైరెక్టర్ కష్టం అంతా ట్రైలర్‌లో కనిపిస్తోంది. శాలినీ రైటింగ్ చాలా బాగుంది. దివ్య శ్రీపాదతో కలిసి నటించడం నా అదృష్టం. ఏప్రిల్ 19న ‘మై డియర్ దొంగ’ను ఆహాలో చూసి ఆనందించండి’’ అని చెప్పారు.

నటి దివ్య శ్రీపాద మాట్లాడుతూ..‘‘నేను ఇందులో బుజ్జి అనే క్యారెక్టర్ చేశాను. నాకు శాలినీ చేసే స్కెచెస్ లాంటివి చాలా నచ్చుతాయి. ఇప్పుడు ఆమె రాసిన సినిమాలో నేను చేశా. ఇదొక నేచురల్ స్టోరీ. నేచురల్ స్టోరీ అంటే అందరూ విలేజ్ బ్యాక్‌డ్రాప్ అనుకుంటారు. కానీ ఇది సిటీలో జరిగే స్టోరీ. అమ్మాయి కష్టాలపై జోక్స్ వేసుకుని నవ్వించేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో నాక్యారెక్టర్ నా ఒరిజినాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. టైమ్ తెలీకుండా సినిమా మొత్తం చూసేస్తారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.

నటుడు శశాంక్ మాట్లాడుతూ.. ‘‘మా టీమ్ గురించి మాట్లాడాలంటే శాలినీ గురించి చెప్పాలి. ఫస్ట్ ఆడిషన్‌లోనే నన్ను సెలెక్ట్ చేసింది. కొన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించి సినిమాను పూర్తి చేసింది. అభినవ్ అన్న నుంచి చాలా నేర్చుకున్నా. టీమ్ అంతా ఎంతో ఎనర్జిటిక్‌గా పని చేశాం. ఈ సినిమాను 19న ఆహాలో అందరూ తప్పకుండా చూడండి.’’ అని అన్నారు.

హీరోయిన్, రైటర్ శాలినీ మాట్లాడుతూ..‘‘ముందుగా ఆహాకు థ్యాంక్స్ చెప్పాలి. నా స్క్రిప్ట్‌ను, నా యాక్టింగ్‌ను ఆహా టీమ్ ఎంతగానో నమ్మారు. నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది వాళ్లే. ఈ మధ్య చాలామంది యాక్టర్స్ రైటింగ్ కూడా చేస్తున్నారు. ఫస్ట్ నేను ఈ ఐడియా అనుకున్నప్పుడు వంశీని తీసుకున్నా. నేను ఏదైనా జోక్ చెప్తే వంశీ ఇంప్రువైజ్ చేశాడు. ట్రైలర్‌లో ఉన్న ఒక డైలాగ్‌ను కూడా వంశీ ఇంప్రూ చేశాడు. నేను, ప్రియదర్శి, అభినవ్ గోమటం ముగ్గురూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్‌కు థ్యాంక్స్ చెప్పకూడదని అంటారు. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ వస్తుందో అని భయపడ్డా. కానీ ఇప్పుడే సక్సెస్ వైబ్స్ వస్తున్నాయి. ఫస్ట్ దీన్ని ఒక వెబ్ సిరీస్‌గా చేద్దామనుకున్నాం. కానీ ఇది ఫిల్మ్‌కు కూడా వర్కవుట్ అవుతుందని భావించి సినిమాగా చేశాం. మ్యూజిక్ డైరెక్టర్ బీజీఎంతో మేజిక్ క్రియేట్ చేశారు. టీమ్ అందరికీ గుడ్ లక్’’ అని చెప్పారు.

నటుడు వంశీ మాట్లాడుతూ..‘‘ఈ ఐడియా స్టార్ట్ అయినప్పటి నుంచి శాలినీని చూస్తున్నా. ఫస్ట్ సినిమాకే శాలినీ స్క్రిప్ట్ వర్క్‌తో పాటు యాక్టింగ్ కూడా చేసింది. ఆమె జర్నీ రియల్లీ గ్రేట్’’ అని చెప్పారు.

ఆహా కంటెంట్ హెడ్ వాసు మాట్లాడుతూ..‘‘ఏళ్ల తరబడి ఆహాను సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్యూ. లాస్ట్ టైమ్ అర్థమైందా అరుణ్ కుమార్‌కు ప్రియదర్శి గెస్ట్‌గా వచ్చాడు. అది సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా దర్శి గెస్ట్‌గా వచ్చాడు. ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది. మై డియర్ దొంగ సినిమాకు శాలినీ గ్రేట్ ఎఫర్ట్ పెట్టింది. నిర్మాత మహేశ్ పని రాక్షసుడు. డైరెక్టర్ సర్వాంగ పని తీరు చాలా బాగుంది. ఇలాగే కష్టపడితే ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేస్తాడు. ప్రతిఒక్కరూ ఈ ప్రాజెక్ట్‌ను సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌గా ట్రీట్ చేస్తున్నారు. అభినవ్ క్రేజీనెస్ గురించి చెప్పాల్సిన పని లేదు. దొంగగా ఎవరు చేస్తే బాగుంటుందని శాలినీ, నేను అనుకున్నప్పుడు అభినవ్ పేరే వచ్చింది. ఈ సినిమా కోసం ఎంతోమంది తెరవెనుక గ్రేట్ వర్క్ చేశారు. వాళ్లందరికీ థ్యాంక్యూ. ఏప్రిల్ 19న మైడియర్ దొంగను ఆహాలో చూడండి’’ అని చెప్పారు.

హీరో అభినవ్ గోమటం మాట్లాడుతూ..‘‘ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటి నుంచీ దీనికోసం పని చేస్తున్నవాళ్లను నేను కలుస్తున్నా. ఆహా కంటెంట్ హెడ్ వాసు ప్రతి ఒక్కరికీ సపోర్ట్ చేస్తుంటాడు. ఆహా టీమ్ అందరికీ థ్యాంక్యూ. ఫస్ట్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వాళ్లదగ్గర నుంచే వచ్చింది. ఈ కంటెంట్ మొత్తం నేను చూశాను. చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. శాలినీ, నేను పదేళ్ల నుంచి ఫ్రెండ్స్. ప్రియదర్శి నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు శాలినీ స్క్రీప్ట్‌లో యాక్ట్ చేశా. ఆమె చాలా సెన్సిబుల్. ఆమె ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది. ఒక మంచి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.’’ అని చెప్పారు.

చీఫ్ గెస్ట్ ప్రియదర్శి మాట్లాడుతూ..‘‘శాలినీ, అభినవ్ నా ఫ్రెండ్స్. వాళ్లని సపోర్ట్ చేద్దామని నేను వచ్చాను. మేమంతా ఎక్కడో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటే ఉండేవాళ్లం. ఇక్కడ సినిమా స్క్రీనింగ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. కానీ ఇప్పుడు ఈ స్టేజీ మీద ఉండడం చాలా బాగుంది. యాక్టింగ్‌లో ఇంట్రెస్ట్ ఉన్నా అవకాశాలు రాకపోవడంతో తన స్క్రిప్ట్ తనే రాసుకుని మీ ముందుకు వస్తోంది శాలినీ. యుద్దాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వస్తాయన్నట్లు శాలినీని వెతుక్కుంటూ ఆహా వచ్చింది. మిమ్మల్ని మీరు నమ్మితే అనుకున్నది సాధిస్తారు. అందుకు శాలినీయే ఉదాహరణ. ఈ సినిమా ఆమె కోసం సక్సెస్ అవ్వాలి. మంచి సినిమాలకు ఆహా సపోర్ట్ చేయడం నిజంగా మంచి విషయం. టాలెంట్ ఉన్నవాళ్లకు ఆహా ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని చెప్పారు.

నటీనటులు: అభినవ్ గోమటం, శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి, చంద్ర వెంపతీ తదితరులు

సాంకేతిక బృందం:
బ్యానర్: క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్
ప్రొడ్యూసర్: మహేశ్వర్‌రెడ్డి గోజల
డైరెక్టర్: బీఎస్ సర్వాంగ కుమార్
రైటర్: శాలిని కొండెపూడి
డీవోపీ: ఎస్ఎస్ మనోజ్
మ్యూజిక్ డైరెక్టర్: అజయ్ అర్సాడా
ఎడిటర్: సాయి మురళి
ప్రొడక్షన్ డిజైనర్: ఝాన్సీ లింగం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికిరణ్ మదినేని, వెంకటేష్. వై
క్యాస్టూమ్ డిజైనర్: అనూష దేవర

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

10 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago