VS10 అనౌన్స్ మెంట్-  గ్రాండ్ గా ప్రారంభం

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ విభిన్నమైన జోనర్‌ల సినిమాలతో అలరిస్తున్నారు. తన 10వ సినిమా కోసం, నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడితో కలిసి విశ్వక్ సేన్ చేతులు కలిపారు.    ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు.

అందరి దృష్టిని ఆకర్షించే పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ రోజు #VS10ని అధికారికంగా అనౌన్స్ చేశారు. పలువురు ప్రత్యేక అతిథులు సమక్షంలో ఈ చిత్రం ఈరోజు గ్రాండ్‌గా ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామ్‌ తాళ్లూరి భార్య రజనీ క్లాప్‌ ఇవ్వగా, రచయిత, దర్శకుడు మచ్చ రవి కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకుడు రవితేజ ముళ్లపూడి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. అంతకుముందు రామ్ తాళ్లూరి ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు.

కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ సాగే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది.

ప్రారంభోత్సవం సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రామ్ తాళ్లూరి నా ఫేవరేట్ ప్రొడ్యూసర్. ఇది నా పదో చిత్రం. ఇది కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో కెల్లా భిన్నంగా వుంటుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. కొత్త దర్శకుడు రవితేజ చాలా టాలెంటెడ్. సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు

దర్శకుడు రవితేజ మాట్లాడుతూ.. నన్ను నమ్మి సినిమా ఇచ్చిన విశ్వక్ సేన్ గారికి, నిర్మాత  రామ్ తాళ్లూరి గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ: రామ్ తాళ్లూరి నిర్మాణంలో సినిమా చేయడం చాలా ఎక్సయిటింగా వుంది. విశ్వక్ సేన్ గారితో ఎప్పటి నుంచో పని చేయాలని వుండేది. ఈ సినిమాతో అది కుదిరింది. చాలా మంచి స్క్రిప్ట్. చాలా మంచి పాత్ర. ఇంత మంచి టీం తో కలసి పని చేయడం చాలా ఎకయిటింగా వుంది’’ అన్నారు

నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ నాకు ఇష్టమైన హీరో. ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాం. ఏడాది క్రితం  రవితేజ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. విశ్వక్ ఏ కథ ఎంచుకున్న తర్వాత ఇంకా నమ్మకం పెరిగింది. ఈ సినిమాని  ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు తగ్గకుండా వుంటుంది. పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు

ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ కటసాని డీవోపీగా పని చేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్ , విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.

#VS10 వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలౌతుంది.  

తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
నిర్మాత: రామ్ తాళ్లూరి
ప్రొడక్షన్ బ్యానర్: ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డివొపి: మనోజ్ కటసాని
ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
ఎడిటర్: అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యుసర్స్: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె
కాస్ట్యూమ్ డిజైనర్: కళ్యాణి
సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ కంట్రోలర్: శరత్ పాలంకి
ప్రొడక్షన్ మేనేజర్ : శ్రీహరి పెద్దమల్లు
పీఆర్వో: వంశీ- శేఖర్

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

15 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago