నటీనటులు: విజయ్ శంకర్, అషు రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్ తదితరులు దర్శకత్వం: జీ సూర్యతేజ నిర్మాత: వీరభద్రరావు పరిస సమర్ఫణ: స్కైరా క్రియేషన్స్ ఎడిటర్: సత్య జీ డీవోపీ: జే ప్రభాకర్రెడ్డి సంగీతం: వినోద్ యజమాన్య గేయ రచయిత: కాసర్ల శ్యాం బ్యానర్: రిలాక్స్ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్: 2022-10-28
కథ: పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) వివేక్ వర్మ (భానుచందర్), న్యాయమూర్తి ప్రమోదా దేవి (సుహాసిని మణిరత్నం) అనోన్య దంపతులు. దాంపత్య జీవితం ఆనందంగా సాగుతున్న సమయంలో వివేక్ వర్మ దారుణ హత్యకు గురవుతాడు. అనుమానాస్పద రీతిలో మరణించడంతో ఎస్సై విజయ్ శంకర్ (విజయ్ శంకర్) దర్యాప్తు చేపడుతాడు. అనేక మలుపు తిరుగుతున్న వివేక్ వర్మ హత్య కేసు దర్యాప్తును టేకప్ చేయడానికి ప్రేమ (అషురెడ్డి) రంగంలోకి దిగుతుంది. వివేక్ వర్మ ఎలా హత్యకు గురయ్యాడు. హత్య కేసు తర్వాత ప్రమోదా దేవి పరిస్థితి ఏమిటి? వివేక్ వర్మ హత్య కేసు దర్యాప్తు ఎందుకు క్రిటికల్గా మారింది? దర్యాప్తులో ఎస్సై విజయ్ శంకర్కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? విజయ్ శంకర్ను తప్పించి.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రేమ ఎందుకు కేసును టేకప్ చేయాలని ప్రయత్నించింది? చివరకు వివేక్ వర్మను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనే ప్రశ్నలకు సమాధానమే ఫోకస్ సినిమా కథ.
దర్శకుడిగా తన తొలి సినిమానే మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్ను ఎంచుకుని దర్శకుడు సూర్య పెద్ద సాహసమే చేశాడని చెప్పవచ్చు. ఈ సినిమాకు ప్రధాన బలం కథ. ఇందులోని ట్విస్ట్లు. కథను బోర్ కొట్టకుండా దర్శకుడు ఎప్పటికప్పుడు టర్నింగ్పాయింట్స్తో ఆడియన్స్కు ఆసక్తిని రేకేత్తించాడు. ఎలాంటి సాగదీత లేకుండా నేరుగా ఫోకస్ సినిమా కథలోకి తీసుకెళ్లాడు. అయితే ఫస్టాఫ్లోప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేసే విధంగా రకరకాల ట్విస్టులతో కథను ముందుకు తీసుకెళ్లాడు. ఇక రెండో భాగంలో దర్శకుడు సూర్యతేజ సరైన గాడిలో పడి.. సినిమాను మంచి కథనం, ట్విస్టులతో కథను పరుగులు పెట్టించాడు. ప్రీ క్లైమాక్స్లో ఎవరూ ఊహించని ట్విస్టుతో కథను మరింత ఆసక్తికరంగా మలిచాడు. సుహాసిని మణిరత్నం, భాను చందర్ పాత్రలను భావోద్వేగంగా మార్చి ప్రేక్షకులతో కంటతడిపెట్టించాడు.
నటీనటుల విషయానికి వస్తే పోలీసాఫీసర్గా విజయ్ శంకర్ లుక్స్, బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ బాగున్నాయి. కొన్ని సీన్స్లో విజయ్ భావోద్వేగాలు స్టార్ హీరోని గుర్తు చేశాయి. సెకండాఫ్లో విజయ్ శంకర్ కేసును సాల్వ్ చేసిన తీరు ఆడియన్స్కు తప్పక కనెక్ట్ అవుతుంది. ఇక బిగ్బాస్ ఫేమ్ ఆషు రెడ్డి వచ్చిన తర్వాత కథలో మరింత వేగం పెరుగుతుంది. ఇక వివేక్ వర్మగా భానుచందర్, జడ్జిగా ప్రమోదా దేవి ఈ సినిమా మెయిన్ పిల్లర్స్లా నిలబడ్డారు. డీపీసీ ఇంద్రజిత్ పట్నాయక్గా షాయాజీ షిండే తమపాత్రల పరిధి మేరకు బాగా నటించారు. నటుడు సూర్యభగ వాన్, భరత్రెడ్డి (కథలో హుస్సేన్)కు ఓ మంచి రోల్స్ దక్కాయి. ఫైనల్గా క్లైమాక్స్ వివేక్ వర్మను ఎవరు హత్య చేశారు? అనే ట్విస్ట్ను దర్శకుడు రివిల్ చేసినప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవుతారు. స్క్రీన్ ప్లే ఉత్కంఠతతో సాగుతుండ టంతో ఫైట్స్, పాటలు లేవనే వెలితిని ఆడియన్స్ ఫీలయ్యే చాన్స్ లేదు. కథ థ్రిల్లర్ కాబట్టి కామెడీకి పెద్ద గా స్కోప్ లేదు. పైగా సినిమా నిడివి కూడా రెండు గంటలే కావడం మరో ఫ్లస్పాయింట్.సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ప్రభాకర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది.
పలు సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి. వినోద్ అందించిన బీజీఎం సినిమాను నెక్ట్ లెవల్కి తీసుకెళ్లింది. రిలాక్స్ మూవీ మేకర్స్ పై వీరభద్రరావు పరిస అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతగా మొదటి సినిమాకే అంత భారీ ప్యాడింగ్ ని తీసుకోవడం నిజంగా అభినందిచాల్సిన విషయం. పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనిపిస్తుంది.మర్డరీ మిస్టరీతో న్యూఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఫోకస్ సినిమా రూపొందింది. సుహాసిని, భానుచందర్ ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా మారాయి. కథ, కథనాలపై మరికొంత కసరత్తు చేసి ఉంటే.. క్రైమ్ థ్రిల్లర్స్లో వన్ఆఫ్ బెస్ట్ సినిమా అయి ఉండేది. అయితే క్రైమ్, మర్డర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, మిస్టరీ అంశాలను నచ్చే ప్రేక్షకులను ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుంది.
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…