ఘనంగా వరుణ్ సందేశ్ ‘విరాజి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్,

మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించేందుకు అందుబాటు టికెట్ రేట్లతో “విరాజి” థియేటర్స్ లో ప్రదర్శితం కానుంది. సింగిల్ స్క్రీన్స్ లో 99 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 125గా టికెట్ రేట్లు పెడుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాని మైత్రి మూవీ మేకర్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ – “విరాజి” మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ జూలై 2న చేశాం. ఆగస్టు 2న రిలీజ్ అని ఆరోజే చెప్పాం. సరిగ్గా నెల రోజులు ప్రమోషన్స్ కు పెట్టుకున్నాం. ఒక మంచి మూవీ చేశామనే నమ్మకం మా టీమ్ అందరిలో ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం వెళ్లాం. అక్కడ కాలేజీలకు వెళ్లి పబ్లిసిటీ చేశాం. స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజాగ్ బీచ్ లో ప్రమోషన్స్ చేశాం. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాం. అందరి దగ్గర నుంచి గుడ్ ఫీడ్ బ్యాక్ రిసీవ్ చేసుకున్నాం. మన దగ్గర కూడా ఇంటర్వ్యూస్, ప్రెస్ మీట్స్ తో సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ చేస్తున్నాం. ఈ మొత్తం క్రమంలో నాకు వరుణ్ గారు ఇస్తున్న సపోర్ట్ కు థ్యాంక్స్ చెబుతున్నా. హీరో అంటే నటించి వెళ్లడమే కాదు నిర్మాతగా నా పక్కన వరుణ్ ఉంటున్నారు. ఆయన లేకుంటే ఈ ప్రమోషన్స్ ఇంత బాగా చేసే వాళ్లం కాదు. “విరాజి”తో ఒక మంచి మూవీ రూపొందించారు దర్శకుడు ఆద్యంత్ హర్ష. ఈ మూవీకి మంచి యంగ్ ఎనర్జిటిక్ టీమ్ వర్క్ చేశారు. ఆగస్టు 2న రిలీజ్ అవుతున్న “విరాజి” సినిమాకు మీ సపోర్ట్ ఇవ్వండి. మా సినిమా కోసం టికెట్ రేట్లు తగ్గిస్తున్నాం. ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో సింగిల్ స్క్రీన్స్ కు 99 రూపాయలు, మల్టీప్లెక్సులకు 125 రూపాయలుగా టికెట్ రేట్లు ఉంటాయి. మా మూవీకి వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకుల్ని రప్పించేందుకు టికెట్ రేట్లు తగ్గించాం. మీరు సపోర్ట్ చేస్తే నాకు మరో నాలుగు మూవీస్ చేసే శక్తి వస్తుంది. పదిమందికి ఉపాధి దొరుకుతుంది. “విరాజి” మూవీని థియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ – మా “విరాజి” సినిమాకు సపోర్ట్ అందిస్తున్న మీడియా మిత్రులకు థ్యాంక్స్. ఈ సినిమా నా 37 ఏళ్ల కష్టం. “విరాజి” సినిమాకు మెయిన్ ఫిల్లర్ గా ఉన్నది మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ గారు. ఆయన ఒక టెక్నీషియన్ లా ఈ సినిమాకు పనిచేశారు. ప్రమోషన్స్ మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నారు. నాకు ప్రతి విషయంలో ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు. మరో ఫిల్లర్ వరుణ్ సందేశ్ గారు. ఆయన ఈ సినిమా కోసం చూపించిన డెడికేషన్ కు హ్యాట్సాఫ్. “విరాజి” మేకోవర్ కోసం కొన్ని గంటల పాటు టైమ్ స్పెండ్ చేశారు. ఈ జర్నీలో మా అందరికీ తన సపోర్ట్ అందించారు. టెక్నీషియన్స్ లో ముగ్గురి గురించి ప్రధానంగా చెప్పాలి. డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్. ఈ మూడు విభాగాల పనితనం మీరు రేపు థియేటర్స్ లో చూస్తారు. అద్భుతంగా విజువల్స్ ఉంటాయి. మ్యూజిక్ మరో స్థాయికి సినిమాను తీసుకెళ్లింది. ఎడిటింగ్ లో ఎంతో క్వాలిటీ కనిపిస్తుంది. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న కాకినాడ నాని గారు వన్ ఆఫ్ ది కీ రోల్ చేశారు. యాక్ట్రెస్ కుషాలినీ కూడా మంచి రోల్ చేసింది. ఆమెకు కూడా ఈ సినిమాతో మరింత గుర్తంపు దక్కుతుంది. “విరాజి”తో సోషల్ ఎలిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ఒక మంచి మూవీ చేశాం. మీరంతా ఆగస్టు 2న థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు కాకినాడ నాని మాట్లాడుతూ – నేను కూడా మీ జర్నలిస్టుల్లో ఒకడినే. వార్త, సాక్షిలో పనిచేశాను. ఇప్పుడు కాకినాడ నానిగా మూవీస్ చేస్తున్నాడు. “విరాజి” సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. నాకు నటుడిగా గుర్తింపు తెచ్చే మూవీ ఇది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు ఆద్యంత్ హర్ష, మహేంద్ర కూండ్ల గారికి థ్యాంక్స్. ఈ సినిమాకు మీ ఆదరణ దక్కాలని, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు మణిరూప్ మాట్లాడుతూ – “విరాజి” సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించాను. ఇంతమంచి టీమ్ తో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. వరుణ్ గారు ఎంతో సపోర్ట్ చేసేవారు. “విరాజి” మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా చూడండి. అన్నారు.

నటి కుషాలినీ మాట్లాడుతూ – నేను చాలా మూవీస్ చేశాను అయితే “విరాజి”తో మీ అందరికీ బాగా గుర్తుంటానని ఆశిస్తున్నా. సినిమా చాలా బాగా వచ్చింది. వరుణ్ సందేశ్ గారు కొత్తగా కనిపించబోతున్నారు. ఆయన లుక్ చూస్తున్నారు కదా అంతే కొత్తగా మూవీ ఉంటుంది. ఈ సినిమాను మీరంతా ఆగస్టు 2న థియేటర్స్ చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – దర్శకుడు ఆద్యంత్ హర్ష “విరాజి” కథను చెబుతుంటే గూస్ బంప్స్ వచ్చాయి. డైరెక్టర్ ఆద్యంత్ హర్షకు థ్యాంక్స్ చెబుతున్నా. అంత బాగా నెరేట్ చేశాడు. నా క్యారెక్టర్ మేకోవర్ దగ్గర నుంచి ప్రతీది కొత్తగా తెరకెక్కించాడు. ఇలాంటి సబ్జెక్ట్ ను ఒక ప్యాషన్ తో ప్రొడ్యూస్ చేశారు నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల. నా కెరీర్ లో చెందూ, బాలు లాంటి క్యారెక్టర్స్ గుర్తుండిపోయాయి. అలాగే “విరాజి”లో ఆండీ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. నా మూవీస్ ఫ్లాప్స్ అవుతున్నాయి, అలాంటి టైమ్ లో నిర్మాత మహేంద్ర గారు, కథను, నన్నూ నమ్మి “విరాజి” చేశారు. నేను ఆండీ లుక్ లోనే ఏపీలో ప్రమోషనల్ టూర్ కు వెళ్లాను. ఎందుకంటే నాకు “విరాజి”తో మీరంతా మరో అవకాశం ఇస్తారనే నమ్మకంతో ప్రమోషన్ చేస్తున్నాను. నేనెందుకు ఇంత ఎగ్జైటింగ్ గా ఉన్నాను అనేది ఆగస్టు 2న థియేటర్స్ లో మూవీ చూసినప్పుడు అర్థం చేసుకుంటారు. మీరంతా థియేటర్స్ కు వచ్చి “విరాజి” చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

8 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago