‘ఉత్సవం’ మనందరం గర్వపడే సినిమా. హీరో దిలీప్ ప్రకాష్

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షుకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరో దిలీప్ ప్రకాష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

ఉత్సవం ఎలా బిగైన్ అయ్యింది ? మీ జర్నీ గురించి చెప్పండి ?
-స్కూల్స్ డేస్ నుంచే సినిమాల పట్ల ఆసక్తి వుండేది. చిన్నప్పుడు స్కూల్ లో నాటకాలు రాయడం, ప్రదర్శించడం జరిగేది. ఎంబీఏ పూర్తి చేశాను. మధ్యలో ఓ సినిమాలో చిన్న రోల్ చేసే ఆఫర్ వచ్చింది. తర్వాత క్రేజీ బాయ్ అనే కన్నడ సినిమా చేశాను. ఆ సినిమా సక్సెస్ మీట్ లోనే డైరెక్టర్ అర్జున్ సాయి ని కలిశాను. ఆరేళ్ళ జర్నీలో ఆయన ఉత్సవం కథ చెప్పారు. ఇది చాలా రెస్పెక్టబుల్ సబ్జెక్ట్ చాలా గర్వంగా చెప్పుకునే సినిమా.

ఉత్సవం లో మీకు ఆకట్టుకున్న అంశాలు ఏమిటి ?
-చాలా అద్భుతమైన కథ. ఇందులో కథనే హీరో. ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం గారు ఇలా చాలా మంది అద్భుతమైన యాక్టర్స్ వున్నారు. ఇది వండర్ ఫుల్ జర్నీ. వారందరినుంచి చాలా నేర్చుకున్నాను.

రెజీనా గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-రెజీనా స్వీట్ కో యాక్టర్. చాలా హెల్ప్ చేశారు. తననుంచి చాలా నేర్చుకున్నాను. చాలా కంఫర్ట్ బుల్ గా యాక్ట్ చేశాను.

ఉత్సవం ఎలా వుండబోతోంది ?
-రంగస్థల కళాకారుల మీద తీసిన సినిమా ఇది. సురభి నాటక సమాజం స్ఫూర్తి వుంది. సినిమా వచ్చిందే నాటకాల నుంచి. మన రూట్స్ ని గుర్తు చేసేలా వుంటుంది. ఇందులో మంచి ఫ్యామిలీ డ్రామా, రోమాన్స్ కూడా వుంటుంది. అనూప్ రూబెన్స్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆడియన్స్ ని అలరించే అన్ని ఎలిమెంట్స్ ప్యాకేజ్ లా వుంటుంది. చాలా గొప్పనటులు ఇందులో వున్నారు. సినిమా చూసిన కొందరు ” ఫీల్ గుడ్ సినిమా, లైట్ హార్ట్ సినిమా’ అని ప్రశంసించారు.

ప్రకాష్ రాజ్ గారి లాంటి సీనియర్ యాక్టర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-ప్రకాష్ రాజ్ గారు లాంటి వెర్సటైల్ యాక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం వెరీ ఛాలెంజ్. ఈ ప్రాసెస్ ని చాలా ఎంజాయ్ చేశాను. ప్రకాష్ రాజ్ గారు నా నటన చూసి ‘గుడ్ జాబ్’అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తోంది ?
-మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారు ఈ సినిమా చూశారు. ఆయనకి కంటెంట్ చాలా నచ్చింది. అలా హోంబలే వారు కర్ణాటక లో రిలీజ్ చేస్తున్నారు. నార్త్ లో సినీ పోలీస్ రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రముఖ సంస్థలు సినిమాని విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాం.

ఈ సినిమాలో సందేశం వుంటుందా?
-ఇందులో హీరోది నాటకాలకి మళ్ళీ తీసుకొచ్చే క్యారెక్టర్. అయితే ఇదంతా సందేశం చెప్పేలా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ విధానంలోనే చూపించాం. ఇందులో తెలుగు కల్చర్, ట్రెడిషన్ చాలా అద్భుతంగా చూపించాం.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ గురించి ?
-నా మొదటి సినిమాలోనే ఇంత అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. ఈ విషయంలో అనూప్ కి థాంక్స్ చెబుతున్నాను.

-అనంత్ శ్రీరామ్, భాస్కర భట్ల, వనమాలి వండర్ ఫుల్ లిరిక్స్ రాశారు.

-ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి గారు ప్రతి డిటెయిల్ తీసుకొని చాలా అద్భుతంగా ఆర్ట్ వర్క్ చేశారు. కథ కోసం అందరూ సినిమాని వోన్ చేసుకొని పని చేశారు.

నిర్మాత సురేష్‌ పాటిల్‌ గురించి ?
-ఆయనకి స్పెషల్ గా థాంక్స్ చెబుతున్నా. ఆయన వలనే ఈ సినిమా పాజిబుల్ అయ్యింది.

మీరు తెలుగు బాగా మాట్లాడుతన్నారు కదా ?
-నాన్న సైడ్ తెలుగు. హిందూపూర్. అమ్మ సైడ్ కన్నడ. జై బాలయ్య( నవ్వుతూ)

మీ ఫేవరేట్ జోనర్ ఏంటి ?
-నాకు యాక్షన్ సినిమాలు ఇష్టం. నేను చేయబోయే నెక్స్ట్ సినిమా యాక్షన్ జోనర్ లో వుంటుంది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

21 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago