కోర్టు డ్రామాలో ‘ఉద్వేగం’ కచ్చితంగా ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది

కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో జి శంకర్, ఎల్ మధు నిర్మాతలుగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం ఉద్వేగం. ఈ చిత్రానికి అజయ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించారు. త్రిగున్ ముఖ్యపాత్రలో నటించినున్న ఈ చిత్రంలో దీప్సిక కథానాయికగా నటించగా శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఈ చిత్రం టీజర్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి చేతుల మీదగా విడుదల కావడం జరిగింది. చిత్రం టీజర్ చూస్తుంటే ఎంతో కష్టపడి తీశారని, అలాగే యాక్టర్ త్రిగున్ కు 25వ చిత్రం కావడం విశేషమని ఆర్జీవి అన్నారు. అంతేకాక కోర్టు రూములో వచ్చే చిత్రాలు చాల తక్కువ అని, ఈ చిత్రం మంచి సక్సెస్ కావాలని తన కోరుకుంటున్నట్లు ఆర్జీవి అన్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ఏంతో ప్రేక్షక ఆదరణ పొందింది.

2021లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత కోర్టు నేపథ్యంలో మరో సినిమా ఇదే కావడం విశేషం. ఈ నెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది అని చిత్ర బృందం వెల్లడించింది.

ఈ సందర్భంగా పరుచూరి గోపాల కృష్ణ గారు మాట్లాడుతూ : నేను విలన్ గా చేసిన పాత్రలు చూసి కొంతమంది మీరు మంచివారు విలన్ పాత్రలు ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు అలాంటి పాత్రలు చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ప్రజాస్వామ్యం అనే సినిమాలో ఒక మంచి పాత్ర చిన్న పాత్ర అయినా కూడా చేసి మెప్పించాను. అప్పటినుండి సినిమాల్లో చేస్తే మంచి పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నా. సినిమాలో నాయకుడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రతి నాయకుడికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమా దర్శకుడు మహిపాల్ రెడ్డి వెంటపడి నన్ను ఒప్పించి ఈ సినిమా చేయించుకున్నాడు. అదేవిధంగా హీరో ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రతి నాయకుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నాయకుడు పాత్ర సినిమాలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలా ఈ సినిమాలో మా పాత్రలను రాసుకున్నారు. చిన్న సినిమాగా కాకుండా ఒక మంచి సినిమాగా ఈ సినిమాను ప్రేక్షకులు చూసి ఆదరించి విజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

కౌశల్ మాట్లాడుతూ : సినిమా అంటేనే ఒక ఉద్వేగం. సినిమా కోసం అందరూ కష్టపడి పని చేస్తారు. అదేవిధంగా ఈ ఉద్వేగం టీం కూడా ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం పని చేసి మంచి సినిమాని తీశారు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి మంచి డబ్బులు తెచ్చి పెట్టాలని, దర్శకుడు, హీరోకి మంచి పేరు తెచ్చి పెట్టాలని, సినిమాని ప్రేక్షకులు ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సీనియర్ యాక్టర్ సురేష్ గారు మాట్లాడుతూ : ఈ రోజుల్లో మీడియా చాలా పవర్ ఫుల్ గా ఉంది. చిన్న సినిమాకు కాకుండా ఒక మంచి సినిమా ట్రై చేయండి అని మీడియా చెప్తే కచ్చితంగా చిన్న సినిమాలకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మీడియా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలి అని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేశారు. మా గురువుగారు పరుచూరి గోపాలకృష్ణ గారితో నటించడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా హీరో త్రిగున్ మరియు కౌశల్ కష్టపడి ఇండస్ట్రీలో పైకే దిగారు అలాంటి వాళ్ళకి మంచి సక్సెస్ అందాలని సినిమాతో మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేక్షకుల సినిమాని చూసి పెద్ద విజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ప్రొడ్యూసర్స్ శంకర్ మరియు మధు మాట్లాడుతూ : ఈ సినిమా కథ వినగానే నచ్చి సినిమాని స్టార్ట్ చేసాం. అడగగానే ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్న పరుచూరి గోపాలకృష్ణ గారికి సురేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. హీరో త్రిగున్ కి ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ ఇస్తుంది అని నమ్ముతున్నాను. చిన్న సినిమాగా కాకుండా ఒక మంచి సినిమాగా ఈ సినిమాని ప్రేక్షకుల ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ : నన్ను నమ్మి ఈ సినిమాని నాకు ఇచ్చిన మన నిర్మాతలకి అదే విధంగా ఈ సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్న పర్చూరు గోపాలకృష్ణ గారికి సురేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కోర్టు డ్రామా సినిమాగా ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకి ఎంగేజింగ్ గా ఉంటుంది. ఈ సినిమా చూసి నచ్చితే ఇంకో పది మందికి చెప్పి సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

హీరో త్రిగున్ మాట్లాడుతూ : ప్రతి సక్సెస్ఫుల్ హీరో వెనకాల ఒక రైటర్ ఉంటాడు. అలా ఎంతోమంది హీరోల వెనకాల పిల్లర్గా నిలబడి సపోర్ట్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ గారు ముందు ఈ రోజు నేను నిలబడ్డం ఆయనతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి మనిషికి ఓ పదేళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది నేను చేశాను అని చెప్పుకునే గొప్ప సినిమా ఒకటి ఉంటుంది నాకు అలాంటి సినిమానే ఉద్వేగం. ఈ సినిమా కథకి నేను సరిపోతాను అని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా దర్శకుడు ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. మీడియా కూడా ఈ సినిమాని సపోర్ట్ చేయాలని అలాగే ప్రేక్షకుల సినిమా చూసి పెద్ద సక్సెస్ చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు: త్రిగున్, దీప్సిక, శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, అంజలి తదితరులు

టెక్నీషియన్స్ :
సంగీతం: కార్తిక్ కొడగండ్ల
సినిమాటోగ్రఫీ: అజయ్
ఎడిటర్: జశ్వీన్ ప్రభు
నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధు
దర్శకుడు: మహిపాల్ రెడ్డి
పీఆర్ఓ: హరీష్, దినేష్

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

6 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago